logo

Purandeswari: అమృత కలశ యాత్ర.. ప్రత్యేక రైలుకు జెండా ఊపిన పురందేశ్వరి

దిల్లీలో నిర్మాణం చేపట్టబోయే అమృతవనంలో భాగస్వామ్యం అయ్యేలా భాజపా రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి వెళ్లి మట్టిని సేకరించిన విషయం తెలిసిందే.

Published : 29 Oct 2023 14:22 IST

విజయవాడ: దిల్లీలో నిర్మాణం చేపట్టబోయే అమృతవనంలో భాగస్వామ్యం అయ్యేలా భాజపా రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి వెళ్లి మట్టిని సేకరించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన 900 మట్టి కలశాలను ఇవాళ ప్రత్యేక రైలులో విజయవాడ నుంచి దిల్లీకి పంపారు. విజయవాడ రైల్వేస్టేషన్‌లో ప్రత్యేక రైలును భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు మట్టి కలశాలను శోభయాత్రగా రైల్వేస్టేషన్‌కు  తీసుకొచ్చారు. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు పురందేశ్వరి విముఖత చూపించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని