logo

తెదేపా సూపర్‌ సిక్స్‌ ముందు.. వైకాపా గ్రాఫ్‌ పడిపోయింది: కేశవ్‌

వైకాపా ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోతో ఆ పార్టీ శ్రేణులే తీవ్ర నిరాశ నిస్పృహల్లో కనిపిస్తున్నారని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ పేర్కొన్నారు.

Published : 29 Apr 2024 03:38 IST

మాట్లాడుతున్న పయ్యావుల కేశవ్‌

ఉరవకొండ, న్యూస్‌టుడే: వైకాపా ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోతో ఆ పార్టీ శ్రేణులే తీవ్ర నిరాశ నిస్పృహల్లో కనిపిస్తున్నారని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం ఆయన ఉరవకొండ మండలం బూదగవిలో విలేకరులతో మాట్లాడారు. ఆ పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉండగా, మేనిఫెస్టో వదిలిన తరువాత వారిలో మరింత నిరుత్సాహాన్ని మిగిల్చిందన్నారు. తెదేపా రూపొందించిన సూపర్‌ సిక్స్‌ పథకాల ముందు వైకాపా గ్రాఫ్‌ పూర్తిగా పడిపోయిందన్నారు. సూపర్‌ సిక్స్‌ విధానం మరింత స్పీడ్‌గా వెళ్లనుందని చెప్పారు. వైకాపా ఎన్నికల ప్రణాళిక విషయంలో ఏవేవో గొప్పలు చెప్పుకొన్న వాళ్లు సైతం నోరు తెరవని పరిస్థితి నెలకొందన్నారు. ఆ ప్రణాళిక వల్ల రాష్ట్ర ప్రజలకు ఒరిగేదేమి లేదన్నారు. రాష్ట్రంలో రాబోయేది కూటమి ప్రభుత్వమేనని జగన్‌ తన మేనిఫెస్టో ద్వారా స్పష్టం చేశారన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని