logo

హోంమంత్రి నామినేషన్‌ ర్యాలీకి వెళ్లొస్తుండగా ప్రమాదం

హోంమంత్రి నామినేషన్‌ ర్యాలీకి వెళ్లిన ముగ్గురు యువకులు ద్విచక్రవాహనంపై తిరిగొస్తుండగా ప్రమాదానికి గురయ్యారు.

Published : 20 Apr 2024 02:57 IST

ఒకరి పరిస్థితి విషమం.. 

రహదారి పక్కన పడిపోయిన క్షతగాత్రులు

నల్లజర్ల: హోంమంత్రి నామినేషన్‌ ర్యాలీకి వెళ్లిన ముగ్గురు యువకులు ద్విచక్రవాహనంపై తిరిగొస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. నల్లజర్లకు చెందిన గొన్నూరి పండు, కలపాల గణేష్‌, కలపాల సాగర్‌లు ద్విచక్రవాహనంపై శుక్రవారం ఉదయం హోంమంత్రి, గోపాలపురం వైకాపా అభ్యర్థి తానేటి వనిత నామినేషన్‌ కార్యక్రమానికి వెళ్లారు. తిరిగొస్తుండగా వీరవల్లిటోల్‌ప్లాజా వద్ద జాతీయ రహదారి పక్కన విద్యుత్తు స్తంభాన్ని ఢీకొన్నారు. అతివేగంగా వెళ్తుండటంతో బండి రెండు భాగాలుగా విరిగిపోయింది. తీవ్రంగా గాయపడిన ముగ్గుర్నీ హైవే అంబులెన్స్‌లో గోపాలపురం సీహెచ్‌సీకి తరలించారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై ఎటువంటి కేసు నమోదు కాలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని