ఫలితాలను ఏం మాయ చేశావ్
కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ విద్యను తీర్చిదిద్దుతున్నామన్న వైకాపా సర్కారు మాటలు బూటకమని తేలిపోయింది. సోమవారం వెలువడిన పదోతరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు అరకొర ఫలితాలే సాధించాయి.
కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ విద్యను తీర్చిదిద్దుతున్నామన్న వైకాపా సర్కారు మాటలు బూటకమని తేలిపోయింది. సోమవారం వెలువడిన పదోతరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు అరకొర ఫలితాలే సాధించాయి. తరగతి గదులు చాలకపోవడం, ఉపాధ్యాయుల కొరత, ప్రభుత్వ అసంబద్ధ నిర్ణయాలు దీనికి కారణంగా తల్లిదండ్రులు చెబుతున్నారు.
న్యూస్టుడే, శ్యామలాసెంటర్
ఈ ఏడాది రాజమహేంద్రవరం నగరం పదోతరగతి పరీక్షా ఫలితాల్లో 87 శాతం ఉత్తీర్ణతతో సరిపెట్టుకుంది. మొత్తం 4,978 మంది పరీక్ష రాయగా వీరిలో 4,331 మంది ఉత్తీర్ణులయ్యారు. 647 మంది అనుత్తీర్ణులయ్యారు. విద్యార్థులు ఎస్వీఏ సాయీష్ 589, చల్లా డింపు వీర శర్వాణి 585, షేక్ శామ్సున్నీసా 584 మార్కులు సాధించగా మిగిలిన వారెవరూ 590 మార్కులు దాటకపోవడం గమనార్హం. ప్రభుత్వ అనాలోచిత కారణాలే దీనికి కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. నాడు-నేడుతో పూర్తికాని పనులు, సబ్జెక్టు టీచర్లు లేకపోవడం. డిజిటల్ విద్యాబోధన పేరుతో విద్యార్థులను పూర్తిగా చరవాణితో మమేకం చేయడం, ఆంగ్లం, సైన్సు, గణితం వంటి కీలక సబ్జెక్టులు బోధించేవారు కొన్నిచోట్ల తక్కువగా ఉండటంతో అరకొర ఫలితాలతో సరిపెట్టుకోవాల్సి వస్తోందని తల్లిదండ్రులు వాపోతున్నారు. కొన్నిచోట్ల సర్దుబాటు చేస్తున్నప్పటికీ ఫలితం లేకపోతోందని, పూర్తిస్థాయిలో ఉపాధ్యాయులను నియమించాలని కోరుతున్నారు.
ఉపాధ్యాయులు సొంత నిధులు వెచ్చించారు..
నగరంలో సుమారు 21 ప్రభుత్వ ఉన్నత, 56 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ఇక్కడ సుమారు 16 వేల మంది చదువుతున్నారు. వీరిలో పదోతరగతి విద్యార్థులు 2,140 మంది ఉన్నారు. వీరికి డిజిటల్ బోధనంటూ 112 పైగా ఐఎఫ్టీలు ఇచ్చారు. స్మార్ట్ టీవీలు 55 ఇచ్చారు. వీటికి విద్యుత్ కనెక్షన్లు, లాన్(ఇంటర్నెట్) సౌకర్యం చేసుకునేందుకు నాడు-నేడు నిధులు మళ్లించారు. నిధులు రాకపోవడంతో ఉపాధ్యాయులు సొంత నిధులు వెచ్చించారు. నగరంలోని ఓ పాఠశాలకు చెందన ఉపాధ్యాయుడు సుమారు రూ.80 వేలు ఖర్చుపెట్టి పనులు చేయించారు. కొందరు జీతాలు రాకపోవడంతో పనులు చేయలేక చేతులెత్తేశారు. ఇప్పటికీ కొన్నిచోట్ల సరైన ఇంటర్నెట్ సదుపాయం లేక పాఠాల బోధన సరిగా జరగకపోవటంతో యథావిధిగా గ్రీన్ చాక్బోర్డుల పైనే బోధిస్తున్నారు. టోఫెల్ పరీక్ష, రోజుకో ఆంగ్ల పదం, స్పెల్ -బి తదితర పరీక్షలు పెట్టినప్పటికీ ఫలితం లేకపోయింది. నగరంలో 2,230 మందికి ట్యాబ్లు ఇచ్చారు. వాటికి ఎస్డీ కార్డులు ఇవ్వకపోవడంతో తల్లిదండ్రుల సిమ్కార్డులు వేసుకున్నారు.
అసంపూర్తి పనులతో అవస్థలు
నగరంలో నాడు-నేడుకు ఎంపికైన పాఠశాలలు 67 కాగా వాటికి రూ.16.85 కోట్లు నిధులు కేటాయించారు. వాటిలో కేవలం రూ.8.9 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. ఇప్పటికీ కొన్నిచోట్ల అదనపు తరగతుల నిర్మాణం పూర్తికాలేదు. ఫ్లోరింగ్ పనులు చేయాల్సి ఉండగా కేవలం సిమెంటుతోనే సరిపెట్టారు. వాటిపై టైల్స్ వేయలేదు. దీంతో ఆరుబయట కూర్చోవడం, అసంపూర్తి భవనాల్లోనే పాఠాలు వినడం జరిగింది. ఈ కారణాలు ఉత్తీర్ణతా శాతంపై ప్రభావం చూపాయని అంటున్నారు. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి కొన్ని పాఠశాలల్లో వంటషెడ్ల నిర్మాణం ఇప్పటికీ జరగలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉమ్మడి మేనిఫెస్టోలో సంక్షేమ పథకాలు
[ 03-05-2024]
కూటమి ప్రవేశపెట్టిన మేనిపెస్టో ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తుందని ముప్పిడి సుజాత తెలిపారు. -
పిఠాపురంలో పవన్కే జై.. ముద్రగడ కుమార్తె కీలక వ్యాఖ్యలు
[ 03-05-2024]
జనసేన (Janasena) అధినేత పవన్కల్యాణ్ (Pawan Kalyan)ను ఉద్దేశించి మాజీ మంత్రి, వైకాపా నేత ముద్రగడ పద్మనాభం చేసిన వ్యాఖ్యలను ఆమె కుమార్తె క్రాంతి ఖండించారు. -
ఆ యువకుడి వయసు 123 సంవత్సరాలట!
[ 03-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లకు భారత ఎన్నికల కమిషన్ జారీ చేస్తున్న గుర్తింపు కార్డుల్లో తప్పులు దొర్లడంతో పలువురు ఆందోళన చెందుతున్నారు. -
అన్నదాత అడగలేడనా.. ఇంత నిర్లక్ష్యం
[ 03-05-2024]
వైకాపా అయిదేళ్ల పాలనలో మార్కెట్ కమిటీలు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయి. వీటికి నిధులు ఇవ్వకపోవడం ఓ ఎత్తయితే, వసతుల కల్పన పైనా దృష్టి పెట్టలేదు. -
జగనన్న పాలనలో ‘సమగ్ర’ శిక్షా
[ 03-05-2024]
విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాం అంటూ గొప్పలు చెప్పే వైకాపా పాలనలో ఉద్యోగుల ఆశలు, హక్కులు ఎండమావులుగానే మిగిలిపోతున్నాయి. -
ఇంటి వద్దే ఓటు వేశారు
[ 03-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలివిడతగా గురువారం హోంఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లాల్లో మొత్తం 1,306 మందికి గాను 1,271 మంది ఇళ్లవద్దే ఓటుహక్కు వినియోగించుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీలత తెలిపారు. -
జగన్ కుతంత్రాలు... అవ్వాతాతలకు ఆగచాట్లు
[ 03-05-2024]
ఇంటింటికీ పింఛన్ల పంపిణీ సులువే. సరిపడా సిబ్బంది, అధికార యంత్రాంగం ఉంది. కానీ జగన్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే డ్రామాలాడుతోంది. 40 డిగ్రీలు దాటుతున్న మండే ఎండల్లో అవ్వాతాతలను, అభాగ్యులను బ్యాంకుల చుట్టూ తిప్పుతూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతోంది. -
ఎవరేమన్నారంటే!
[ 03-05-2024]
ఈ అయిదేళ్లలో ఏ వర్గానికీ సంపూర్ణ న్యాయం చేయకుండా వైకాపా ప్రభుత్వం పాలన సాగించింది. -
ఉత్తుత్తి అధికారి.. ఉంగరంతో పరారీ
[ 03-05-2024]
మసీదు సెంటర్ (కాకినాడ): కాకినాడ నగరం.. వైఎస్ఆర్ వంతెన. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న చోదకుడిని ఓ వ్యక్తి అకస్మాత్తుగా ఆపాడు. -
వంద పడకల ఆసుపత్రి.. శిలాఫలకంతో సరి
[ 03-05-2024]
మాది పేదల ప్రభుత్వం.. వారి కోసం కుటుంబ వైద్యుడు, జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలు నిర్వహిస్తున్నామని వైకాపా నాయకులు ప్రగల్భాలు పలికారు. అత్యవసర సేవలను మాత్రం గాలికొదిలేశారు. -
వైకాపా పాలనలోవాహన చోదకులకూ తిప్పలే..
[ 03-05-2024]
రవాణాశాఖ ద్వారా సక్రమంగా వివిధ సేవలు అందించడంలోనూ వైకాపా ప్రభుత్వం విఫలమైంది. అనాలోచిత నిర్ణయాలతో ఈ అయిదేళ్లలోనూ వాహనచోదకులను ముప్పుతిప్పలు పెట్టింది. -
భానుడి భగభగలు
[ 03-05-2024]
భానుడి భగభగలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. దీంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఉదయం 10 గంటలు దాటితే బయటకు రాలేకపోతున్నారు. -
రూ.2.40 కోట్ల నగదు స్వాధీనం
[ 03-05-2024]
ఎన్నికల నిబంధనలు అమల్లో ఉన్న సమయంలో ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకుండా ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో తరలిస్తున్న రూ.2.40 కోట్ల నగదును పోలీసులు గురువారం పట్టుకున్నారు. -
అయిదేళ్లు కాలువల్లో కన్నీళ్లుపారించారు..
[ 03-05-2024]
నిర్వహణకు నిధులివ్వరు.. ఆక్రమణలు పట్టించుకోరు.. రైతు కన్నీరు చూడరు.. ఇదీ అయిదేళ్ల వైకాపా పాలనలో అన్నదాత అవస్థ. -
‘జనసేన ప్రచారానికి మంత్రి అడ్డంకులు విచారకరం’
[ 03-05-2024]
స్థానిక మంత్రి దాడిశెట్టి రాజా నియోజకవర్గంలో జనసేన నాయకులు ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించే పార్టీ ప్రచారానికి సైతం అడ్డంకులు సృష్టించడం విచారకరమని తుని అసెంబ్లీ నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జులు మధు వీరేష్, సుంకర పావని ఆందోళన వ్యక్తం చేశారు. -
వైకాపా పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందలేదు: పురందేశ్వరి
[ 03-05-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందలేదని రాజమహేంద్రవరం కూటమి ఎంపీ అభ్యర్థి, భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఆరోపించారు. -
ఎంపీ అభ్యర్థుల ఖర్చుపై తొలి ఆడిటింగ్
[ 03-05-2024]
రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 12 మంది అభ్యర్థుల ఎన్నికల ఖర్చులపై తొలి ఆడిటింగ్ జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
-
ఘట్కేసర్లో దారుణం.. ఆస్తికోసం భర్తను గొలుసులతో బంధించి చిత్రహింసలు
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘అప్రమత్తంగా ఉండండి’ : ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన