వెంటాడుతున్న అకాల వర్ష భయం
అన్నదాతలు వరి గింజలు పూర్తిగా ఎండకుండానే... కమతాలు తడారకుండానే వరి కోతలు చేపడుతున్నారు. అకాల వర్షాల భయంతో ఎంత ఖర్చుకైనా వెనుకాడకుండా ముమ్మరం చేశారు. వరి కోత యంత్రాలకు భారీగా వ్యయం చేస్తున్నారు.
కమతాలు తడారకుండానే వరి కోతలు
ఎల్లారెడ్డిపేటలో వరిని కోస్తున్న ట్రాక్ యంత్రం
న్యూస్టుడే, ఎల్లారెడ్డిపేట : అన్నదాతలు వరి గింజలు పూర్తిగా ఎండకుండానే... కమతాలు తడారకుండానే వరి కోతలు చేపడుతున్నారు. అకాల వర్షాల భయంతో ఎంత ఖర్చుకైనా వెనుకాడకుండా ముమ్మరం చేశారు. వరి కోత యంత్రాలకు భారీగా వ్యయం చేస్తున్నారు. అదేవిధంగా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలు, మిల్లులు, ఇళ్లకు తరలించేందుకు ట్రాక్టర్ల రవాణా ఛార్జీలు సైతం తడిసిమోపెడవుతున్నాయి. ఫలితంగా పంట పెట్టుబడి వ్యయం పెరుగుతుండటంతో ఆందోళనకు గురవుతున్నారు.
80 శాతం పూర్తి: జిల్లాలో యాసంగి సీజన్లో 1,74,750 ఎకరాల్లో వరి సాగు చేశారు. ఇప్పటి వరకు 75 నుంచి 80 శాతం వరి కోతలు అయ్యాయి. వచ్చే నెల 15 నుంచి 20 నాటికి మొత్తం పూర్తవుతాయని వ్యవసాయ శాఖ అధికారులు భావిస్తున్నారు. ఎకరానికి సగటున 25 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఈ లెక్కన జిల్లాలో దాదాపు 4.36 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని పౌరసరఫరాలశాఖ అధికారులు లెక్క కట్టారు. 259 కొనుగోలు కేంద్రాల ద్వారా 3.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
అన్నదాతకు వాత: వరి కోతలకు యంత్రాలపైనే రైతులు ఆధారపడుతున్నారు. టూవీలర్ హార్వెస్టర్ యంత్రానికి గంటకు రూ. 1,800 ఉండగా, ఇప్పుడు దానిని రూ. 2 వేలకు పెంచారు. అలాగే ఫోర్ వీలర్ యంత్రానికి గంటకు రూ. 2,400 నుంచి రూ. 2,500 వరకు, ట్రాక్ (చైన్) యంత్రానికి గంటకు రూ. 2,800 నుంచి రూ. 3 వేల వరకు యజమానులు వసూలు చేస్తున్నారు. పెద్ద కమతాల్లో ఎకరం వరి పొలం కోసేందుకు గంట నుంచి 1.20 గంటల సమయం పడుతుంది. అకాల వర్షం, వడగళ్ల వానల భయానికి కమతాలు తడారకముందే పైరును కోయిస్తున్నారు. ఇందుకు ఫోర్వీలర్, ట్రాక్ యంత్రాలనే ఎక్కువగా వినియోగిస్తున్నారు. తడి ఉన్న నేలల్లో యంత్రాలు వేగంగా ముందుకు కదలక వరి కోతకు సమయం ఎక్కువ పడుతుందని రైతులు చెబుతున్నారు. దీంతో అద్దె, ధాన్యాన్ని ట్రాక్టర్లతో తరలించేందుకు రవాణా ఛార్జీలు తడిసిమోపెడవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పశుగ్రాసం సేకరణలో భాగంగా ఎండుగడ్డిని కట్ట కట్టేందుకు బేలర్ యంత్రాలు, గడ్డి రవాణాకు ట్రాక్టర్ ఛార్జీలను యజమానులు పెంచుతున్నారని చెబుతున్నారు. అకాల వర్షాలు పొంచి ఉన్న నేపథ్యంలో వరి కోతలను త్వరగా ముగించేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు.
పెట్టుబడులే అధికం
మాకున్న ఎనిమిది ఎకరాల్లో వరి సాగు చేశాం. ట్రాక్ హార్వెస్టర్ మిషన్తో వరిని కోయిస్తే 12 గంటలైంది. సాధారణంగా ఎకరా విస్తీర్ణంలో సాగు మొదలుకొని పంట కోత వరకు సుమారు రూ. 23 వేల నుంచి రూ. 25 వేల వరకు పెట్టుబడి వ్యయం అవుతుంది. పురుగు మందుల పిచికారీ ఖర్చులు, ధాన్యం తరలింపు, రైతుల శ్రమ అదనం. వచ్చే ఆదాయంలో సగానికి పైగా పెట్టుబడికే పోతుంది.
సురేందర్రెడ్డి, రైతు, రాచర్ల బొప్పాపూర్
ఏడు ఎకరాలకు 9.30 గంటలు పట్టింది
నా సొంత భూమి 1.30 ఎకరాలుండగా, మరో 11 ఎకరాలు కౌలుకు తీసుకొని వరి పంట వేశాను. ఆకాశం మేఘావృతమవడంతో 7 ఎకరాలను ట్రాక్ యంత్రంతో కోయిస్తే 9.30 గంటల సమయం పట్టింది. మరో నాలుగు ఎకరాలను టూవీలర్తో కోయిస్తే 4.25 గంటలు తీసుకుంది. ఇంకా 2.2 ఎకరాల్లో కోయించాల్సి ఉంది. వరి కోతలకే ఎక్కువ ఖర్చు అవుతుంది.
ల్యాగల వినోద్, రైతు, రాచర్ల బొప్పాపూర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ష్.. ఇక నిశ్శబ్దం!
[ 12-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారానికి తెరపడింది.. మైకులు మూగబోయాయి.. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించి పార్టీలు ఇన్నాళ్ల ప్రచార సందడిని ఉన్నపళంగా నిలిపివేశాయి. శ -
భారీ మెజార్టీతో భాజపాదే విజయం
[ 12-05-2024]
‘కేసీఆర్.. నీకు శ్రీరాముడి గురించి ఏమి తెలుసు? ముస్లిం ఓట్లే కావాలా? హిందువుల ఓట్లు వద్దా? గతంలోనూ హిందుగాళ్లు, బొందుగాళ్లు అంటే సంజయన్న ఏమి చేసిండో తెలుసు కదా..’’ అని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. -
లక్ష మెజారిటీతో కాంగ్రెస్ గెలుపు ఖాయం
[ 12-05-2024]
లోక్సభ ఎన్నికలలో కరీంనగర్ స్థానంలో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావును లక్ష ఓట్ల మెజారిటీతో ప్రజలు గెలిపిస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. -
మోసగించే పార్టీలకు బుద్ధి చెప్పాలి : కేటీఆర్
[ 12-05-2024]
‘పదేళ్లలో తెలంగాణ ఎట్లుండే.. ఇప్పుడెట్లైంది.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రం ఆగమైపోయింది.. కాంగ్రెస్, భాజపా మాటలకు మోసపోతే గోసపడతారని కేసీఆర్ ఆనాడే చెప్పారు.. -
పార్లమెంటు ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
[ 12-05-2024]
ఈనెల 13న జరగనున్న పార్లమెంటు ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి పమేలా సత్పతి వెల్లడించారు. -
విద్యుత్తు సరఫరాలో ఇబ్బందులుండొద్దు
[ 12-05-2024]
పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని ఎన్పీడీసీఎల్ వరంగల్ సీజీఎం చౌహాన్ అధికారులను ఆదేశించారు. -
ఎన్నికలు ప్రశాంతంగా జరగాలి
[ 12-05-2024]
జిల్లాలో లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ అన్నారు. శనివారం ఎన్నికల విధుల్లో పాల్గొనే పోలీసు అధికారులు, సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. -
ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలి
[ 12-05-2024]
వానాకాలం సీజన్కు అవసరమైన ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్ షేక్యాస్మిన్బాషా అన్నారు. శనివారం కలెక్టరేట్లో వ్యవసాయశాఖ అధికారులు విత్తనాలు, -
పోలింగ్ సామగ్రి పంపిణీకి సిద్ధం
[ 12-05-2024]
జిల్లాలో లోక్సభ ఎన్నికల పోలింగ్ సామగ్రి, ఓటింగ్ యంత్రాల పంపిణీకి సర్వం సిద్ధం చేశారు. జగిత్యాల నియోజకవర్గానికి జగిత్యాల మినీ స్టేడియంలో, ధర్మపురి నియోజకవర్గానికి ధర్మపురి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, -
పోలింగ్ సిబ్బంది మూడో దశ యాదృచ్ఛికీకరణ పూర్తి
[ 12-05-2024]
లోక్సభ ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్ సిబ్బంది మూడో దశ యాదృచ్ఛికీకరణ పూర్తి చేసినట్లు కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ తెలిపారు. సమీకృత పాలనా ప్రాంగణంలో శనివారం ఆన్లైన్లో ర్యాండమైజేషన్ చేపట్టారు. -
ముగిసిన ఈఏపీసెట్
[ 12-05-2024]
సెంటినరీకాలనీలోని జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ(ఈఏపీసెట్) ప్రవేశ పరీక్షలు శనివారం ముగిశాయి. అయిదు రోజులుగా పరీక్షలు జరుగుతున్నాయి. -
స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణే లక్ష్యం
[ 12-05-2024]
ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేసినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ పేర్కొన్నారు. -
భద్రత కట్టుదిట్టం
[ 12-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేందుకు జిల్లాకు భారీగా పోలీసు బలగాలను రప్పించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. -
ఓటింగ్ శాతాన్ని పకడ్బందీగా నమోదు చేయాలి
[ 12-05-2024]
ఈ నెల 13న జరిగే లోక్సభ ఎన్నికల ఓటింగ్ శాతాన్ని ఎప్పటికప్పుడు పకడ్బందీగా నమోదు చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. -
ఇరువురి వాదనలపై ఆర్డీవోకు నివేదిక
[ 12-05-2024]
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారనే ఫిర్యాదు మేరకు శనివారం నగర పాలక సంస్థ కార్యాలయంలో జరిగిన విచారణకు భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ తరఫున న్యాయవాదులు హాజరయ్యారు.