పెరిగిన ఓటర్లు.. 8,758
కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఓటర్లు పెరిగారు. ఫిబ్రవరి నెల 8వ తేదీన విడుదలైన ఓటరు ముసాయిదా తుది జాబితాతో పోలిస్తే ప్రస్తుతం ఓటు వేసే వారి సంఖ్య పెరిగింది.
ఈనాడు, కరీంనగర్ : కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఓటర్లు పెరిగారు. ఫిబ్రవరి నెల 8వ తేదీన విడుదలైన ఓటరు ముసాయిదా తుది జాబితాతో పోలిస్తే ప్రస్తుతం ఓటు వేసే వారి సంఖ్య పెరిగింది. ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలతో ఇటీవల కొత్తగా ఓటు నమోదు చేసుకోవడంతోపాటు అనర్హుల ఏరివేత ప్రక్రియను అధికారులు నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పోలింగ్ బూత్ స్థాయి అధికారుల పర్యవేక్షణలు మార్పులు, చేర్పుల ప్రక్రియ కొనసాగింది. ఇక అందివచ్చిన అవకాశాన్ని కొత్త ఓటర్లు అందుకున్నారు. 18 ఏళ్లు నిండిన వారు కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తంగా 8,758 ఓట్లు పెరగడం గమనార్హం. ఇదే సమయంలో ఆయా నియోజకవర్గాల పరిధిలో డబుల్ ఓటర్లు సహా ఇతర అనర్హులవి జాబితా నుంచి తొలగించారు. వీటితోపాటు గ్రామాల్లో, పట్టణాల్లో మరణించిన వారి వివరాలను తీసుకుని వాటిని కూడా జాబితా నుంచి తీసేశారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఇలా మొత్తంగా 15,399 మందివి తొలగించారు. ఇవి పోనూ కొత్తగా 24,097 మంది కొత్త ఓటర్లు పుట్టుకొచ్చారు. వీరంతా ఈ ఎన్నికల్లో తొలి ఓటును వినియోగించుకోనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ష్.. ఇక నిశ్శబ్దం!
[ 12-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారానికి తెరపడింది.. మైకులు మూగబోయాయి.. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించి పార్టీలు ఇన్నాళ్ల ప్రచార సందడిని ఉన్నపళంగా నిలిపివేశాయి. శ -
భారీ మెజార్టీతో భాజపాదే విజయం
[ 12-05-2024]
‘కేసీఆర్.. నీకు శ్రీరాముడి గురించి ఏమి తెలుసు? ముస్లిం ఓట్లే కావాలా? హిందువుల ఓట్లు వద్దా? గతంలోనూ హిందుగాళ్లు, బొందుగాళ్లు అంటే సంజయన్న ఏమి చేసిండో తెలుసు కదా..’’ అని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. -
లక్ష మెజారిటీతో కాంగ్రెస్ గెలుపు ఖాయం
[ 12-05-2024]
లోక్సభ ఎన్నికలలో కరీంనగర్ స్థానంలో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావును లక్ష ఓట్ల మెజారిటీతో ప్రజలు గెలిపిస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. -
మోసగించే పార్టీలకు బుద్ధి చెప్పాలి : కేటీఆర్
[ 12-05-2024]
‘పదేళ్లలో తెలంగాణ ఎట్లుండే.. ఇప్పుడెట్లైంది.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రం ఆగమైపోయింది.. కాంగ్రెస్, భాజపా మాటలకు మోసపోతే గోసపడతారని కేసీఆర్ ఆనాడే చెప్పారు.. -
పార్లమెంటు ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
[ 12-05-2024]
ఈనెల 13న జరగనున్న పార్లమెంటు ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి పమేలా సత్పతి వెల్లడించారు. -
విద్యుత్తు సరఫరాలో ఇబ్బందులుండొద్దు
[ 12-05-2024]
పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని ఎన్పీడీసీఎల్ వరంగల్ సీజీఎం చౌహాన్ అధికారులను ఆదేశించారు. -
ఎన్నికలు ప్రశాంతంగా జరగాలి
[ 12-05-2024]
జిల్లాలో లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ అన్నారు. శనివారం ఎన్నికల విధుల్లో పాల్గొనే పోలీసు అధికారులు, సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. -
ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలి
[ 12-05-2024]
వానాకాలం సీజన్కు అవసరమైన ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్ షేక్యాస్మిన్బాషా అన్నారు. శనివారం కలెక్టరేట్లో వ్యవసాయశాఖ అధికారులు విత్తనాలు, -
పోలింగ్ సామగ్రి పంపిణీకి సిద్ధం
[ 12-05-2024]
జిల్లాలో లోక్సభ ఎన్నికల పోలింగ్ సామగ్రి, ఓటింగ్ యంత్రాల పంపిణీకి సర్వం సిద్ధం చేశారు. జగిత్యాల నియోజకవర్గానికి జగిత్యాల మినీ స్టేడియంలో, ధర్మపురి నియోజకవర్గానికి ధర్మపురి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, -
పోలింగ్ సిబ్బంది మూడో దశ యాదృచ్ఛికీకరణ పూర్తి
[ 12-05-2024]
లోక్సభ ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్ సిబ్బంది మూడో దశ యాదృచ్ఛికీకరణ పూర్తి చేసినట్లు కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ తెలిపారు. సమీకృత పాలనా ప్రాంగణంలో శనివారం ఆన్లైన్లో ర్యాండమైజేషన్ చేపట్టారు. -
ముగిసిన ఈఏపీసెట్
[ 12-05-2024]
సెంటినరీకాలనీలోని జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ(ఈఏపీసెట్) ప్రవేశ పరీక్షలు శనివారం ముగిశాయి. అయిదు రోజులుగా పరీక్షలు జరుగుతున్నాయి. -
స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణే లక్ష్యం
[ 12-05-2024]
ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేసినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ పేర్కొన్నారు. -
భద్రత కట్టుదిట్టం
[ 12-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేందుకు జిల్లాకు భారీగా పోలీసు బలగాలను రప్పించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. -
ఓటింగ్ శాతాన్ని పకడ్బందీగా నమోదు చేయాలి
[ 12-05-2024]
ఈ నెల 13న జరిగే లోక్సభ ఎన్నికల ఓటింగ్ శాతాన్ని ఎప్పటికప్పుడు పకడ్బందీగా నమోదు చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. -
ఇరువురి వాదనలపై ఆర్డీవోకు నివేదిక
[ 12-05-2024]
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారనే ఫిర్యాదు మేరకు శనివారం నగర పాలక సంస్థ కార్యాలయంలో జరిగిన విచారణకు భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ తరఫున న్యాయవాదులు హాజరయ్యారు.