నెరవేరని వస్త్రోత్పత్తి లక్ష్యం
ప్రభుత్వ పాఠశాలలు జూన్ 12న పునఃప్రారంభం కానున్నాయి. పాఠశాలలు తెరిచే నాటికి ఏకరూప దుస్తులు విద్యార్థులకు సిద్ధం చేయడం అసాధ్యమనిపిస్తోంది.
మే 15 వరకు గడువు పొడిగింపు
ఈనాడు డిజిటల్, సిరిసిల్ల
టెక్స్టైల్ పార్కులో షర్టింగ్ వస్త్రం సేకరిస్తున్న టెస్కో సిబ్బంది
ప్రభుత్వ పాఠశాలలు జూన్ 12న పునఃప్రారంభం కానున్నాయి. పాఠశాలలు తెరిచే నాటికి ఏకరూప దుస్తులు విద్యార్థులకు సిద్ధం చేయడం అసాధ్యమనిపిస్తోంది. పాఠశాల విద్యాశాఖ వస్త్రం సరఫరాను ఫిబ్రవరిలోనే తెలంగాణ చేనేత, సహకార సంస్థ (టెస్కో)కు ఆర్డరు ఇచ్చింది. దీనిలో 36 లక్షల మీటర్లు తంగళ్లపల్లి మండలం మండెపల్లి టెక్స్టైల్ పార్కులోని యూనిట్లకు, మరో మూడు లక్షల మీటర్లు సిరిసిల్ల పట్టణంలోని మరమగ్గాలకు కేటాయించారు. ఈసారి వస్త్రం నాణ్యతను దృష్టిలో ఉంచుకుని టెస్కోనే నూలు సరఫరా చేస్తోంది. వాస్తవానికి ఈ నెలాఖరులోగా ఉత్పత్తి లక్ష్యం, సేకరణ పూర్తి కావాలి. కానీ నేటికీ 15 లక్షల మీటర్లు పూర్తయింది. యూనిట్లకు ఇచ్చిన ఆర్డర్ల లక్ష్యంలో నిత్యం 50 వేల మీటర్ల పైన వస్త్రోత్పత్తి చేయాలి. కానీ 25 వేల మీటర్లకు మించడం లేదు. లక్ష్యం పూర్తి కాకపోవడంతో తాజాగా మే 15కు గడువు పొడిగించారు.
ఏకరూప దుస్తుల ఉత్పత్తిలో 67 శాతం పాలిస్టర్, 33 శాతం కాటన్ కలిసిన నూలును వినియోగించేవారు. ఇలా ఉత్పత్తి చేసిన తెలుపు రకం వస్త్రానికి డైయింగ్, ప్రింటింగ్తో పాటు ప్రాసెసింగ్ చేసేవారు. దీంతో నాణ్యత పరంగా ఏడాదికి మించి ఉండటం లేదు. వీటిని దృష్టిలో ఉంచుకుని ఈసారి వందశాతం కాటన్ నూలును రంగులతో సహా ఉత్పత్తి చేస్తుంది. దీని తర్వాత కేవలం ప్రాసెసింగ్ చేసి నేరుగా కుట్టించి ఇవ్వొచ్చు. ఈసారి నూలు కొనుగోలు కూడా పూర్తిగా టెస్కోనే చూసుకుంటుంది. డిజైన్లతో కూడిన బీములను నేరుగా వస్త్రోత్పత్తిదారులకు అందిస్తుంది. వీటిని పూర్తిగా ర్యాపియర్ మగ్గాలపైనే ఉత్పత్తి చేయడం వీలవుతుంది. అందుకే టెక్స్టైల్ పార్కులోని 48 యూనిట్లలోని మగ్గాలపై ఉత్పత్తి చేస్తున్నారు. ఇక్కడ కార్మికుల కొరత ఉంది. సిరిసిల్ల పట్టణంలో ఉన్నవి సాధారణ మగ్గాలు. వీటిపై పని చేసిన వారికి ర్యాపియర్ మగ్గాలు నడపడం తెలియదు. ఈ సమస్యను అధిగమించేందుకు చేనేత, జౌళిశాఖ ప్రత్యేకంగా కాల్సెంటర్ను ఏర్పాటు చేసింది. ఆసక్తితో ముందుకొచ్చిన కార్మికులకు ర్యాపియర్ మగ్గాలపై శిక్షణనిచ్చి ఉపాధి కల్పిస్తుంది. అయినప్పటికీ కార్మికుల కొరత తీరడం లేదు.
కూలి నిర్ణయంతో...
సాధారణ ముతక రకం పాలిస్టర్ ఉత్పత్తుల్లో మీటరకు రెండు రూపాయలకు మించి కూలి గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదు. పాఠశాల వస్త్రోత్పత్తుల తయారీకి మీటరుకు రూ. 4.25లుగా నిర్ణయించారు. దీంతో పట్టణంలోని సుమారు 200 మంది కార్మికులకు ఇక్కడ ఉపాధి లభిస్తుంది. ఏకరూప దుస్తుల ఆర్డర్ల లక్ష్యంపై చేనేత, జౌళిశాఖ ఆర్డీడీ అశోక్ కుమార్ను ‘ఈనాడు’ సంప్రదించింది. టెస్కో వస్త్ప్రోత్తుల సేకరణ ప్రారంభించింది. సేకరించిన వస్త్రాన్ని ప్రాసెసింగ్ పూర్తి చేసుకుని పాఠశాలలకు సరఫరాకు సిద్ధం చేస్తున్నారు. మే 15లోపు లక్ష్యం పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పట్టుకున్న సొత్తు రూ. 9.17 కోట్లు
[ 16-05-2024]
పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కరీంనగర్ నియోజకవర్గ పరిధిలో పోలీసులు, ఎన్నికల పర్యవేక్షణ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో నగదుతో పాటు ఇతర వస్తువులు పట్టుబడ్డాయి. -
శిథిల వంతెనపై తప్పని ప్రయాణం!
[ 16-05-2024]
రామడుగు మండల కేంద్రంలోని మోతెవాగుపై వంతెన శిథిలమవడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. 1983లో నిర్మించిన వంతెన వరదలకు ఇరువైపులా మట్టి కొట్టుకుపోయింది. -
యువత ఓటింగ్ 37.31 శాతమే!
[ 16-05-2024]
ఓటు హక్కును వినియోగించుకోవడంలో యువత నిర్లిప్తత ప్రదర్శించినట్లు పోలింగ్ సరళిని బట్టి తెలుస్తోంది.. -
తక్కువ వ్యయంతో అధిక ఫలితాల సాధనకు కృషి
[ 16-05-2024]
సాగులో తక్కువ వ్యయంతో అధిక ఫలితాలు సాధించేందుకు రైతాంగానికి కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా శాస్త్రవేత్తలు అవగాహన చేస్తున్నారని జమ్మికుంట కేవీకే సీనియర్ శాస్త్రవేత్త ఎన్.వెంకటేశ్వర్రావు అన్నారు. -
ఇంకుడుగుంతపై నిర్లక్ష్యం
[ 16-05-2024]
నగరంలోని భగత్నగర్లో ఒకరు కొత్తగా జీ+2 ఇంటి నిర్మాణం కోసం అనుమతి తీసుకొని పనులు పూర్తి చేశారు. ఆ సమయంలో ఇంకుడుగుంత నిర్మించేందుకు ఫీజు కూడా చెల్లించారు. -
స్వతంత్రుల ప్రభావమెంత?
[ 16-05-2024]
ప్రతి లోక్సభ ఎన్నికల్లో బరిలో దిగుతున్న స్వతంత్రులు ఓట్ల సాధనలో మాత్రం నామమాత్రంగానే నిలుస్తున్నారు.. ఈసారీ ప్రధాన పార్టీల అభ్యర్థులు తప్పితే మిగతా వారు ప్రచార ప్రక్రియపై దృష్టి పెట్టింది తక్కువ. -
పరిసరాల పరిశుభ్రతే రక్ష
[ 16-05-2024]
వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో వ్యాధుల ముప్పు పొంచిఉంది. విష జ్వరాల బారినుంచి కాపాడుకునేందుకు పరిసరాల పరిశుభ్రత పాటించడం అత్యంత ఆవశ్యకం. -
డీజిల్ ట్యాంకర్ బోల్తా పడి ఒకరి దుర్మరణం
[ 16-05-2024]
కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారిపై బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డీజిల్ ట్యాంకర్ బోల్తా పడిన ఘటనలో ప్రమాదవశాత్తు శంకరపట్నం మండలం తాడికల్ గ్రామానికి చెందిన పూదరి శ్రీనివాస్(39) దుర్మరణం చెందాడు. -
ఆదర్శలో ఇంటర్ ప్రవేశాలు
[ 16-05-2024]
ఆంగ్లమాధ్యమంలో విద్యాబోధన.. అధునాతనమైన తరగతి గదులు, ప్రయోగశాలలు.. నిష్ణాతులైన అధ్యాపకులతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నెలకొల్పిన ఆదర్శ పాఠశాలల్లోని ఇంటర్ తరగతులకు ఆదరణ పెరుగుతోంది. -
భూసారం.. పరీక్షలతో ఫలం
[ 16-05-2024]
రైతులందరి భూముల్లోని సారాన్ని తెలుసుకునేలా మట్టిపరీక్షలను తప్పనిసరి చేస్తామని ఇటీవలే రాష్ట్ర వ్యవసాయశాఖమంత్రి ప్రకటించటంతో అన్నదాతల్లో ఆశలు రేకెత్తాయి. -
సగం మందికే ఉపాధి
[ 16-05-2024]
వేసవి తాపంతోపాటు ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నప్పటికీ ఉపాధి పనులకు కూలీల జాతర కొనసాగుతుంది. -
బోర్డులే తప్ప.. కనిపించని ఆటలు
[ 16-05-2024]
గ్రామీణ, పట్టణ ప్రాంత విద్యార్థులు, యువతలోని క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు గత ప్రభుత్వం పల్లెలు, పట్టణాల్లో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసింది. -
పాఠ్య పుస్తకాలొస్తున్నాయ్
[ 16-05-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేసే పాఠ్యపుస్తకాలు జిల్లాకు చేరుకున్నాయి. 2023-24 విద్యా సంవత్సరంలో డిసెంబరు నాటికి ప్రభుత్వ పాఠశాలల్లో యూడైస్లో నమోదైన విద్యార్థుల సంఖ్య ఆధారంగా వీటిని సరఫరా చేసింది. -
ఉత్పత్తిదారులకు నూలు.. నేతన్నలకు మేలు
[ 16-05-2024]
జాతీయ, అంతర్జాతీయ విపణిలో నూలు ధరల హెచ్చుతగ్గులు జిల్లా వస్త్రోత్పత్తి పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. -
చివరి దశకు యాసంగి రైతుబంధు పంపిణీ
[ 16-05-2024]
జిల్లాలో యాసంగి సీజన్కు సంబంధించి రైతుబంధు నగదు జమ చివరి దశకు చేరుకుంది. అయిదెకరాలలోపు భూమి కలిగిన రైతులకు పెట్టుబడి సొమ్ము గతంలోనే ఖాతాల్లో వేయగా ఆపై విస్తీర్ణం కలిగిన అన్నదాతలకు సాయం జమ చేస్తున్నట్లు ఇటీవల సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. -
నత్తనడకన పనులు.. రాకపోకలకు ఇబ్బందులు
[ 16-05-2024]
రద్దీ మార్గంలో లెవెల్ క్రాసింగ్లు ఎత్తివేసేందుకు రైల్వే శాఖ మంజూరు చేసిన పై వంతెన(ఆర్వోబీ)ల నిర్మాణం నత్తనడకన సాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
నిన్న ద్రవిడ్.. ఇప్పుడు మరో సీనియర్.. హెడ్కోచ్ పదవిపై నిరాసక్తత?
-
గాయంతోనే కేన్స్కు ఐశ్వర్యరాయ్.. వీడియో వైరల్
-
నరేశ్ గోయల్ సతీమణి కన్నుమూత
-
శ్రీశైలం వెళ్తుండగా బొలెరో వాహనం బోల్తా.. 15 మంది భక్తులకు గాయాలు
-
350 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్.. 22,310 పైన నిఫ్టీ
-
పోలీస్స్టేషన్లోనే కానిస్టేబుల్ ఆత్మహత్య!