అంజనాద్రిపై సర్వత్రా ఆసక్తి
దశాబ్దకాలం కిందటి వరకు ఆ ప్రాంతం స్థానికులకు మాత్రమే పరిచయం. ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన అలనాటి విజయనగర సామ్రాజ్య రాజధాని నగరమైన హంపీకి కూత వేటు దూరంలో ఉన్న అంజనాద్రికి రామాయణ కాలంతో విడదీయరాని
దిగువన నిర్మించనున్న హనుమ క్షేత్రం ఊహాచిత్రం
బెంగళూరు (ఎలక్ట్రానిక్ సిటీ), న్యూస్టుడే: దశాబ్దకాలం కిందటి వరకు ఆ ప్రాంతం స్థానికులకు మాత్రమే పరిచయం. ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన అలనాటి విజయనగర సామ్రాజ్య రాజధాని నగరమైన హంపీకి కూత వేటు దూరంలో ఉన్న అంజనాద్రికి రామాయణ కాలంతో విడదీయరాని అనుబంధం ఉంది. రామాయణంలో ప్రధాన ఘట్టమైన సీతాపహరణ సందర్భంలో శ్రీరామచంద్రుడితో స్నేహం చేసిన హనుమంతుడి జన్మస్థలం అంజనాద్రే. అయోధ్యలో రామాలయం రూపుదిద్దుకుంటున్న సమయంలో శ్రీరామ బంటు హనుమ జన్మస్థలమైన అంజనాద్రిని అదే స్థాయిలో అభివృద్ధి చేయాలనేది భక్తుల ఆశయం. ఈ దిశగా ప్రభుత్వం అడుగులేస్తోంది. సి.పి.యోగీశ్వర్ పర్యాటక మంత్రిగా ఉన్న సమయంలో అంజనాద్రి అభివృద్ధికి బృహత్ ప్రణాళికను రూపొందించారు. ఈ మహా గిరిధామాన్ని చేరుకునేందుకు తీగ మార్గం ఏర్పాటు, కొండపైన వివిధ అభివృద్ధి పనులను చేపట్టనున్నట్లు అప్పట్లో వెల్లడించారు. పనులన్నింటికీ రూ.500 కోట్ల వరకు వ్యయం అవుతాయని అంచనా. ఇటీవల హుబ్బళ్లిలో నిర్వహించిన భాజపా కార్యవర్గ సమావేశంలో అంజనాద్రి అభివృద్ధి అంశం ప్రముఖంగా చర్చకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ కొండ అభివృద్ధికి కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఆహ్వానించాలనే ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రధాని రాష్ట్రాన్ని సందర్శించే అవకాశాలున్న నేపథ్యంలో- ఆ సమయంలోనే అంజనాద్రి అభివృద్ధి పనులను ఆయనతోనే ప్రారంభించాలనే ఆలోచనలో కమలనాథులున్నట్లు సమాచారం. అంజనాద్రిని ప్రధాని సందర్శించేందుకు పరిస్థితులు అనుకూలించని పక్షంలో వర్చువల్ ద్వారా ఆ ప్రక్రియను చేపట్టాలని ఆలోచిస్తున్నారు. ప్రధాని పర్యటనకు సంబంధించి ఇంకా ఎలాంటి తుదినిర్ణయం తీసుకోనప్పటికీ ప్రయత్నాలు మాత్రం కొనసాగుతున్నాయని పార్టీ నాయకులు తెలిపారు.అంజనాద్రి దిగువన హనుమాన్ జన్మభూమి ట్రస్ట్ ఆధ్వర్యంలో 216 మీటర్ల హనుమంతుడి విగ్రహాన్ని నెలకొల్పడంతో పాటు దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో రామాయణ థీమ్ పార్క్ను అభివృధ్ధి చేయాలని సంకల్పించారు. ఈ పనులన్నీ పూర్తయితే అంజనాద్రి ఓ అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా ఆకర్షిస్తుందని భావిస్తున్నారు.
గిరిధామం పైనుంచి చూస్తే కనిపించే తుంగభద్ర నది
హంపీ సమీపంలోని అంజనాద్రి గిరిధామం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హాసనలో మానహననం?
[ 02-05-2024]
ఎన్నికల వేళ రాష్ట్ర రాజకీయాల చూపంతా హాసనవైపు మళ్లింది. ప్రచార సంబంధంలేని వ్యవహారం.. అందరి సామాజిక మాధ్యమాలనూ ముంచెత్తుతోంది. కొందరు మహిళలతో స్థానిక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ వ్యవహరించిన తీరే చర్చకు కారణం. -
నేతల దూకుడు.. మాటల చెడుగుడు
[ 02-05-2024]
మరో నాలుగు రోజుల్లో బహిరంగ ప్రచారం ముగుస్తుండటంతో జాతీయ నేతలు ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. కొద్ది సమయంలోనే ఎక్కువ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ అభ్యర్థుల తరఫున ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. -
ఆ పాస్పోర్ట్ రద్దు చేయండి
[ 02-05-2024]
మహిళలపై లైంగిక దౌర్జన్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ రాజకీయ పాస్పోర్ట్ను రద్దు చేయాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బుధవారం ఓ లేఖ రాశారు. -
ఉమేశ్ జాదవ్కు అస్వస్థత
[ 02-05-2024]
కలబురగి-బెంగళూరు రహదారిపై బుధవారం ధర్నా చేస్తున్న సమయంలో లోక్సభ సభ్యుడు ఉమేశ్ జాదవ్ కళ్లుతిరిగి పడిపోయారు. చికిత్స కోసం ఆయనను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు. -
తల్లీ, కుమారుడి సన్యాసదీక్ష
[ 02-05-2024]
రాజధాని నగరంలో ప్రముఖ వ్యాపారి మనీశ్ భార్య, కుమారుడు ఇద్దరూ జైన సన్యాస దీక్ష స్వీకరించారు. ఆయన భార్య స్వీటీ (30), కుమారుడు హృధన్ జైన్ (11)లకు జైన గురువులు దీక్ష ఇచ్చారు. -
పూర్వ గోవింద ‘కీర్తన’
[ 02-05-2024]
శ్రీరామ కోటి తరహాలో బెంగళూరుకు చెందిన కీర్తన (17) అనే బాలిక ‘గోవింద కోటి’ని రాసి తిరునగరి తిరుమలలో ఓ మెరుపు మెరిసిన వేళ.. కన్నడిగుల అభినందనలు వెల్లువెత్తాయి. -
‘సిద్ధు నాకు మద్దతిచ్చారు’
[ 02-05-2024]
శాసనసభ ఎన్నికల్లో సిద్ధరామయ్య, డి.కె.శివకుమార్ గంగావతి, బళ్లారిలో తనతో చేతులు కలిపి మద్దతు ఇచ్చారని శాసనసభ్యుడు గాలి జనార్దన్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వారు ఆ ఎన్నికల్లో ఇక్కడికి ప్రచారానికి రాలేదన్నారు. -
ఆ వ్యాఖ్యలు సలసలా ‘కాగె’
[ 02-05-2024]
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘లేకుంటే’ మరో వ్యక్తి ఆ స్థానాన్ని భర్తీ చేయలేడన్నట్లు భాజపా ప్రచారం చేసుకుంటోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజు కాగె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
పాకిస్థానీ యువత.. మోదీలాంటి నేతనే కోరుతోంది
[ 02-05-2024]
పాకిస్థానీ యువత సైతం ప్రధాని నరేంద్రమోదీ లాంటి నేతను కోరుకుంటోందని భాజపా నేత సి.టి.రవి పేర్కొన్నారు. ఆయన బుధవారం గంగావతిలో భాజపా అభ్యర్థి ప్రచారసభలో పాల్గొని మాట్లాడారు. -
విజయం.. ఓ వెన్నదోసె!
[ 02-05-2024]
దావణగెరె.. కన్నడిగుల మాంచెస్టర్ నగరిగా ఒకనాడు ప్రసిద్ధి! లెక్కకు మించిన వస్త్ర పరిశ్రమలతో.. వేలాది కార్మికులతో.. నిత్యం ఎర్రజెండాల రెపరెపలతో కళకళలాడిన నగరి నేడు ఆధునికీకరణ దిశగా అడుగులు వేసింది. ఇప్పుడు దావణగెరె పేరుచెబితే.. కన్నడిగులు లొట్టలేసుకుంటారు.