ఆ వ్యాఖ్యలు సలసలా ‘కాగె’
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘లేకుంటే’ మరో వ్యక్తి ఆ స్థానాన్ని భర్తీ చేయలేడన్నట్లు భాజపా ప్రచారం చేసుకుంటోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజు కాగె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
రాజు కాగె
బెళగావి, న్యూస్టుడే : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘లేకుంటే’ మరో వ్యక్తి ఆ స్థానాన్ని భర్తీ చేయలేడన్నట్లు భాజపా ప్రచారం చేసుకుంటోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజు కాగె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాగెవాడ తాలూకా మమదాపుర గ్రామ ఎన్నికల ప్రచారసభలో ఆయన మాట్లాడారు. మోదీనే లేకుంటే దేశంలో 140 కోట్ల మంది ప్రజలు ఉన్నారని, వారిలో ఎవరో ఒకరు ప్రధాని అవుతారని వ్యాఖ్యానించారు. అధికారం, హోదా ఎవరికీ శాశ్వతం కాదన్నారు. ‘ఇతర పార్టీల సభలకు వచ్చి మోదీ... మోదీ అంటూ నినాదాలు చేస్తుంటారు. నిత్యం మోదీనే పట్టుకుని ఏమిచేస్తారు? కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం బాగుంది అంటారు. కేంద్రంలో మోదీ రావాలని అంటారు. మోదీ ఇక్కడకు వచ్చి సమస్యలను పరిష్కరిస్తారా? ఇక్కడ మేమే సమస్యలను ఆలకించి పరిష్కరించాలి. మోదీ రూ.3 వేల కోట్ల విలువైన విమానంలో తిరుగుతారు. రూ.4 లక్షల విలువైన సూటు వేసుకుంటారు. మేము గొర్రెలం కాదు. మాకూ (కాంగ్రెస్) అన్ని విషయాలు తెలుసు. నాకు అవకాశం వచ్చినా సమర్థవంతమైన పాలనను ఈ దేశానికి అందించగలనన్న ఆత్మవిశ్వాసం ఉంది’ అని ఆయన పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (16/05/24)
-
సముద్రం ముప్పు.. థాయ్లాండ్ రాజధానిని తరలించాల్సిందేనా..?
-
అక్కడి ప్రజలు చెప్పుల్లేకుండానే నడుస్తారు.. ఎందుకో తెలుసా?
-
దీనిని ఎవరు ఓకే చేశారో..?: కింగ్ ఛార్లెస్ చిత్తరువుపై భిన్నాభిప్రాయాలు
-
‘గర్జనకు సిద్ధం’.. బైడెన్ సవాలును స్వీకరించిన ట్రంప్!
-
టీమ్ఇండియా కొత్త కోచ్ రేసులో స్టీఫెన్ ఫ్లెమింగ్.. సీఎస్కే స్పందనిదే