హత్యోన్మాదంపై నిరసన వెల్లువ
హుబ్బళ్లి- ధార్వాడ విద్యార్థిని నేహా హీరేమఠ్ హత్యను ఖండిస్తూ వివిధ సంఘాలు ఇచ్చిన పిలుపునకు ధార్వాడలోని వర్తక, వాణిజ్య సంస్థల ప్రతినిధులు స్పందించారు
మైసూరు ఆందోళనకారులను ఉద్దేశించి మాట్లాడుతున్న బీవై విజయేంద్ర
హుబ్బళ్లి, న్యూస్టుడే : హుబ్బళ్లి- ధార్వాడ విద్యార్థిని నేహా హీరేమఠ్ హత్యను ఖండిస్తూ వివిధ సంఘాలు ఇచ్చిన పిలుపునకు ధార్వాడలోని వర్తక, వాణిజ్య సంస్థల ప్రతినిధులు స్పందించారు. శాంతియుతంగా ప్రదర్శనలు నిర్వహించారు. మైసూరులో భాజపా అధ్యక్షుడు విజయేంద్ర నేతృత్వంలో పార్టీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ప్రతి జిల్లా కేంద్రంలో ఏబీవీపీ కార్యకర్తలు, హిందూ సంఘాల సభ్యులు, విద్యార్థులు నేహాకు మద్దతుగా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ధార్వాడ, తుమకూరు, దావణగెరె, హావేరి, శివమొగ్గ, చిత్రదుర్గ, బళ్లారి, కలబురగి, మండ్య, బాగలకోటె, విజయనగర, విజయపుర, రామనగర, మండ్య, తదితర జిల్లాల్లోనూ వివిధ సంఘాల సభ్యులు ధర్నా చేశారు. హుబ్బళ్లిలో భాజపా కార్యకర్తలు టైర్లు, ముఖ్యమంత్రి చిత్రపటాలను కాల్చి నిరసన వ్యక్తం చేశారు. తుమకూరులో విపక్ష నాయకుడు ఆర్.అశోక్, బళ్లారిలో మాజీ ఎమ్మెల్యే సోమశేఖరరెడ్డి నేతృత్వంలో ధర్నా, నిరసన ప్రదర్శనలు చేపట్టారు. నేహా తండ్రికి కాంగ్రెస్ పార్టీపై నమ్మకం పోయిందని విజయపురలో లోక్సభ సభ్యుడు రమేశ్ జిగజిణగి ఆరోపించారు. కేసు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని విమర్శించారు.
విద్యార్థిని నేహా హత్య కేసు దర్యాప్తును సీవోడీకి అప్పగించామని హోం మంత్రి డాక్టర్ పరమేశ్వర్ తెలిపారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో చర్చించి ఈ నిర్ణయాన్ని తీసుకున్నామన్నారు. నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపట్టి పది రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని కోరామని చెప్పారు. ఆయన సోమవారం బెంగళూరులో విలేకరులతో మాట్లాడుతూ హుబ్బళ్లి పోలీసుల నుంచి సీవోడీ అధికారులు ఇప్పటికే దర్యాప్తు బాధ్యతలు స్వీకరించారని తెలిపారు. హత్య వెనుక కుట్ర కోణం ఉంటే దర్యాప్తు అనంతరం అన్నీ వెలుగులోకి వస్తాయన్నారు. హత్యకు సంబంధించి తాను చేసిన వ్యాఖ్యలు నేహా తల్లిదండ్రులను బాధించి ఉంటే, బేషరతుగా క్షమాపణలు చెబుతానని పేర్కొన్నారు. భాజపా నాయకులు విద్యార్థిని హత్య కేసును తమ రాజకీయాలకు వినియోగించుకుంటున్నట్లు దుయ్యబట్టారు. వారి సామాజిక మాధ్యమాల ఖాతాలను పరిశీలిస్తే ఈ విషయం తేటతెల్లమవుతుందని అన్నారు.
రాజకీయ రంగు..
నేహా హత్య ఘటన రాజకీయ మలుపు తీసుకుంది. ఎన్నికల సమయం కావడంతో విజయపుర ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాళ్, నమో బ్రిగేడ్ సంస్థ వ్యవస్థాపకుడు చక్రవర్తి సూలిబెలె తదితరులు హుబ్బళ్లిలో నిరంజన్ హీరేమఠను కలసి సాంత్వన పలికారు. హత్యను ముస్లిం సంఘాలు అన్నీ ఖండించినా.. దానికి రాజకీయ రంగు పులిమేందుకు భాజపా, హిందూ సంఘాలు ప్రయత్నిస్తున్నాయని సీనియరు సాహితీవేత్త డాక్టర్ కె.షరీఫా ఆవేదన వ్యక్తం చేశారు. భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా హుబ్బళ్లికి రావడం, ఇది లవ్ జిహాద్ అంటూ శ్రీరామసేన వ్యవస్థాపకుడు ప్రమోద్ ముతాలిక్ వ్యాఖ్యలు చేయడాన్ని ఆమె ఖండించారు. కొద్ది నెలల కిందట ఎయిర్ ఇండియా ఉద్యోగి ప్రవీణ్ చౌగులె తన ప్రేమను నిరాకరించిన అయనా, ఆమె తల్లి, అక్క, సోదరుడ్ని హత్య చేసినా, ఎవరూ మాట్లాడలేదని, రుక్సానా అనే యువతిని వివాహం చేసుకుని, ఒక బిడ్డ కలిగిన తర్వాత ఆమెను హత్య చేసిన ప్రదీప్ అనే యువకుడి వ్యవహారాన్ని ఎవరూ ఖండించలేదని వాపోయారు. రాజకీయాల కోసమే దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆక్రోశించారు.
14 సార్లు పొడిచాడు..
నేహాను తొమ్మిదిసార్లు పొడిచిన ఫయాజ్.. ఆమెను హత్య చేశాడని మొదట భావించారు. మరణోత్తర పరీక్షల్లో ఆమెను మొత్తం 14 సార్లు పొడిచాడని గుర్తించారు. మరణోత్తర పరీక్షల నివేదికను కిమ్స్ వైద్యులు పోలీసులకు సోమవారం అందజేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అద్వితీయ పలితం ఎవరికో
[ 04-05-2024]
కన్నడనాట రెండో విడత ఎన్నికల కోసం కొనసాగుతున్న ప్రచారంలో జాతీయ నేతల సందడి క్రమంగా తగ్గనుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్ షా, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇప్పటికే ఉత్తర ప్రాంతంలోని అన్ని నియోజకవర్గాలనూ చుట్టేశారు. -
నడివీధిలో ఆమెను స్తంభానికి కట్టేసి..
[ 04-05-2024]
కర్ణాటకలోని బెళగావి జిల్లా వంటెమూరి గ్రామంలో గత ఏడాది డిసెంబరులో చోటుచేసుకున్న ఓ అమానుష ఘటన ప్రజలు మరచిపోకనే.. హావేరి జిల్లాలో అదే తరహా ఘటన కలకలం రేపింది. -
మోదీ నాటకాలు చెల్లవ్
[ 04-05-2024]
ప్రధానమంత్రి నరేంద్రమోదీ చక్కని నాటక కళాకారుడని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎద్దేవా చేశారు. ‘ఈవెంట్ మేనేజరు’గా కూడా ఆయన చక్కగా పని చేస్తారని విమర్శించారు. -
తల్లి హత్యకేసు.. సామాజిక శిక్ష ఖరారు
[ 04-05-2024]
తల్లిని కొట్టి హత్య చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న అనిల్ (35) అనే నిందితుడికి కర్ణాటక ఉన్నత న్యాయస్థానం ఆరు నెలలు సమాజ సేవను శిక్షగా విధించింది. -
దేశద్రోహులతో ముప్పు
[ 04-05-2024]
ఈ ఎన్నికల్లో మేమంతా ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని సైన్యంగా మారడం పూర్వజన్మ సుకృతం..నా సంకల్పం రాష్ట్రంలోని 28 స్థానాల్లో విజయం సాధించి మోదీకి శక్తినందించడం అని రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బి.వై.విజయేంద్ర పేర్కొన్నారు. -
అంతేలేని యువనేత ఆగడాలు
[ 04-05-2024]
కర్ణాటకలో ఓ వైపు ఎన్నికల కోలాహలం కొనసాగుతుండగా.. మరోవైపు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ, ఆయన తండ్రి ఎమ్మెల్యే హెచ్డీ రేవణ్ణ తాలూకూ అశ్లీల వీడియోలు, వాటి ఆధారంగా నమోదైన కేసులు రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి. -
రాహుల్గాంధీ వద్ద ఆధారాలు ఉన్నాయా..!
[ 04-05-2024]
ప్రజ్వల్ అశ్లీల వీడియోల కేసు ఇంకా దర్యాప్తులో ఉంది. నేరం నిరూపణ కాలేదు..అవి నిజమైనవో కాదో..అయితే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ మాత్రం ప్రజ్వల్ రేవణ్ణవి దాదాపు 400 వీడియోలు ఉన్నట్లు చెబుతున్నారు. -
కేంద్రమే ప్రజ్వల్ను రక్షిస్తోంది: సిద్ధు
[ 04-05-2024]
లైంగిక దౌర్జన్యానికి పాల్పడిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను కేంద్ర ప్రభుత్వం రక్షిస్తోందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆరోపించారు. ప్రజ్వల్ వద్ద ఉన్న దౌత్య పాస్పోర్టును రద్దు చేస్తే అతను ఏ దేశంలోనూ ఉండేందుకు అవకాశం ఉండన్నారు. -
శిరసిలో ఐటీ దాడులు
[ 04-05-2024]
పీసీసీ సభ్యుడు, శిరసిలో పారిశ్రామికవేత్త దీపక్ దొడ్డూరు, ఆయన ఆప్తులు శివరాం హెగ్డే, అనిల్ ముష్టగిల నివాసాలపై ఆదాయ పన్ను శాఖ అధికారులు శుక్రవారం ఉదయం దాడులు నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
అన్న వచ్చాడు.. బ్యాంకులో పింఛన్లు బంద్!
-
ముందు మీరు రాయ్బరేలీలో గెలవండి.. రాహుల్కు సలహా ఇచ్చిన చెస్ దిగ్గజం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!