హామీలు విస్మరించిన భాజపా
పేదలు, మధ్యతరగతి కుటుంబాల భవిష్యత్తుకు ఈ లోక్సభ ఎన్నికలు నిర్ణయాత్మకమైనవని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు.
మోదీపై విరుచుకుపడిన సిద్ధు
కడూరులో నిర్వహించిన సమావేశానికి హాజరైన స్థానికులు
శివమొగ్గ, న్యూస్టుడే : పేదలు, మధ్యతరగతి కుటుంబాల భవిష్యత్తుకు ఈ లోక్సభ ఎన్నికలు నిర్ణయాత్మకమైనవని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. ‘ఇండియా షైనింగ్’ అంటూ గతంలో ప్రచారానికి వెళ్లి భాజపా ఓడినట్లే.. ఈసారి ‘విససిత భారత్’ పేరిట ప్రచారం చేసుకుంటున్న మోదీకి ఓటమి తప్పదన్నారు. హాసన, చిక్కమగళూరు-ఉడుపి, శివమొగ్గ అభ్యర్థులకు మద్దతుగా కడూరు, బాణావర తదితర ప్రాంతాల్లో నిర్వహించిన బహిరంగ సభల్లో సిద్ధు సోమవారం మాట్లాడారు. ఖాళీ చెంబు ఇచ్చిన భాజపాకు మద్దతు ఇచ్చి మీ ఓటు ఘనతను పోగొట్టుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రజల సమస్యలకు స్పందించే కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాలని కోరారు. పదేళ్లుగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ అబద్ధపు హామీలిస్తూ అందరినీ వంచించారని దుయ్యబట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. ఈసారి ఘోరంగా ఓడిపోతామని తెలుసుకునే కర్ణాటకలో అబద్ధపు ప్రచారం, మతం ఆధారంగా ఓట్లు వేయాలని ప్రచారం చేసుకుంటున్నారని భాజపా నేతలను దుయ్యబట్టారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని నమ్మించి, వారి ఖర్చులను మూడు రెట్లు పెంచేశారని ఆరోపించారు. ఇంధనం, గ్యాసు, ఎరువుల ధర పెంపు సామాన్యునిపై పిడుగుపాటేనన్నారు. ప్రధాని తన స్థాయిని తగ్గించుకుని మాట్లాడుతున్నారని నిందించారు. హిందూ మహిళల మంగళసూత్రాన్ని తెంపి, ముస్లిం మహిళలకు ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆయన వ్యాఖ్యానించడం తగదన్నారు. ప్రధానిగా ఉన్న వ్యక్తి కుల, మతాలను ఉటంకించి ప్రచారం చేసుకోవడం గతంలో ఎక్కడా చూడలేదన్నారు. కర్ణాటకతో పాటు దేశానికి భాజపా చిప్ప, చెంబులను మాత్రమే ఇచ్చిందన్నారు. మాజీ ప్రధాని దేవేగౌడ చెబుతున్న అబద్ధాలను విని సిగ్గుపడ్డానని చెప్పారు. మోదీని మించి ఆయన అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో దేశంలో రూ.76 వేల కోట్ల రైతుల రుణాలను మాఫీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మోదీ మాత్రం శ్రీమంతులు, పారిశ్రామికవేత్తలు చేసిన రూ.15 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేశారని నిప్పులు చెరిగారు. ఓటర్లకు రూ.1.25 లక్షలు కావాలా, ఖాళీ చెంబు కావాలా.. అని ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అద్వితీయ పలితం ఎవరికో
[ 04-05-2024]
కన్నడనాట రెండో విడత ఎన్నికల కోసం కొనసాగుతున్న ప్రచారంలో జాతీయ నేతల సందడి క్రమంగా తగ్గనుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్ షా, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇప్పటికే ఉత్తర ప్రాంతంలోని అన్ని నియోజకవర్గాలనూ చుట్టేశారు. -
నడివీధిలో ఆమెను స్తంభానికి కట్టేసి..
[ 04-05-2024]
కర్ణాటకలోని బెళగావి జిల్లా వంటెమూరి గ్రామంలో గత ఏడాది డిసెంబరులో చోటుచేసుకున్న ఓ అమానుష ఘటన ప్రజలు మరచిపోకనే.. హావేరి జిల్లాలో అదే తరహా ఘటన కలకలం రేపింది. -
మోదీ నాటకాలు చెల్లవ్
[ 04-05-2024]
ప్రధానమంత్రి నరేంద్రమోదీ చక్కని నాటక కళాకారుడని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎద్దేవా చేశారు. ‘ఈవెంట్ మేనేజరు’గా కూడా ఆయన చక్కగా పని చేస్తారని విమర్శించారు. -
తల్లి హత్యకేసు.. సామాజిక శిక్ష ఖరారు
[ 04-05-2024]
తల్లిని కొట్టి హత్య చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న అనిల్ (35) అనే నిందితుడికి కర్ణాటక ఉన్నత న్యాయస్థానం ఆరు నెలలు సమాజ సేవను శిక్షగా విధించింది. -
దేశద్రోహులతో ముప్పు
[ 04-05-2024]
ఈ ఎన్నికల్లో మేమంతా ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని సైన్యంగా మారడం పూర్వజన్మ సుకృతం..నా సంకల్పం రాష్ట్రంలోని 28 స్థానాల్లో విజయం సాధించి మోదీకి శక్తినందించడం అని రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బి.వై.విజయేంద్ర పేర్కొన్నారు. -
అంతేలేని యువనేత ఆగడాలు
[ 04-05-2024]
కర్ణాటకలో ఓ వైపు ఎన్నికల కోలాహలం కొనసాగుతుండగా.. మరోవైపు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ, ఆయన తండ్రి ఎమ్మెల్యే హెచ్డీ రేవణ్ణ తాలూకూ అశ్లీల వీడియోలు, వాటి ఆధారంగా నమోదైన కేసులు రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి. -
రాహుల్గాంధీ వద్ద ఆధారాలు ఉన్నాయా..!
[ 04-05-2024]
ప్రజ్వల్ అశ్లీల వీడియోల కేసు ఇంకా దర్యాప్తులో ఉంది. నేరం నిరూపణ కాలేదు..అవి నిజమైనవో కాదో..అయితే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ మాత్రం ప్రజ్వల్ రేవణ్ణవి దాదాపు 400 వీడియోలు ఉన్నట్లు చెబుతున్నారు. -
కేంద్రమే ప్రజ్వల్ను రక్షిస్తోంది: సిద్ధు
[ 04-05-2024]
లైంగిక దౌర్జన్యానికి పాల్పడిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను కేంద్ర ప్రభుత్వం రక్షిస్తోందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆరోపించారు. ప్రజ్వల్ వద్ద ఉన్న దౌత్య పాస్పోర్టును రద్దు చేస్తే అతను ఏ దేశంలోనూ ఉండేందుకు అవకాశం ఉండన్నారు. -
శిరసిలో ఐటీ దాడులు
[ 04-05-2024]
పీసీసీ సభ్యుడు, శిరసిలో పారిశ్రామికవేత్త దీపక్ దొడ్డూరు, ఆయన ఆప్తులు శివరాం హెగ్డే, అనిల్ ముష్టగిల నివాసాలపై ఆదాయ పన్ను శాఖ అధికారులు శుక్రవారం ఉదయం దాడులు నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
జగన్ను వెంటాడుతోన్న ఓటమి భయం..? తాడేపల్లి ప్యాలెస్లో వాస్తుమార్పులు!
-
అన్న వచ్చాడు.. బ్యాంకులో పింఛన్లు బంద్!
-
ముందు మీరు రాయ్బరేలీలో గెలవండి.. రాహుల్కు సలహా ఇచ్చిన చెస్ దిగ్గజం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు