బరిలో నిలవాలంటే.. పరిశీలన దశ దాటాల్సిందే!
గుజరాత్లోని సూరత్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. సదరు అభ్యర్థి నామినేషన్ పత్రాల్లోని సంతకాలు తమవి కావని ముగ్గురు ప్రతిపాదకులు రిటర్నింగ్ అధికారి (ఆర్ఓ)కి అఫిడవిట్లు సమర్పించారు.
గుజరాత్లోని సూరత్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. సదరు అభ్యర్థి నామినేషన్ పత్రాల్లోని సంతకాలు తమవి కావని ముగ్గురు ప్రతిపాదకులు రిటర్నింగ్ అధికారి (ఆర్ఓ)కి అఫిడవిట్లు సమర్పించారు. అందుకే నామినేషన్ తిరస్కరణకు గురైంది. కాంగ్రెస్ ప్రత్యామ్నాయ అభ్యర్థి నామినేషన్ సైతం తిరస్కరణకు గురవటంతో భాజపా అభ్యర్థి ఏకగ్రీవంగా విజయం సాధించినట్టయ్యింది.
ఈనాడు డిజిటల్, కొత్తగూడెం
తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ జోరందుకుంది. ఈనెల 18 నుంచి నామినేషన్ల క్రతువు కొనసాగుతుండగా.. ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లో వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు నామపత్రాలు దాఖలు చేస్తున్నారు. గురువారం వరకు నామినేషన్లు సమర్పించటానికి గడువుంది. 26న నామపత్రాలను అధికారులు పరిశీలించనున్నారు. నామినేషన్లు అధికారుల పరిశీలనలో నిలిస్తేనే ఆయా అభ్యర్థులు బరిలో నిలవవచ్చు. ఏమాత్రం తేడా వచ్చినా నామపత్రాలు తిరస్కరణకు గురయ్యే ఆస్కారముంటుంది. అందుకే నామపత్రాల పరిశీలన ప్రక్రియ ప్రాధాన్యం సంతరించుకుంది.
నిర్దేశిత సమయంలో..
ప్రజాప్రాతినిధ్య చట్టం- 1951లోని సెక్షన్ 30 ప్రకారం.. రిటర్నింగ్ అధికారి నోటిఫికేషన్లో పేర్కొన్న తేదీ, ప్రదేశం, సమయంలో మాత్రమే నామపత్రాల పరిశీలన జరుగుతుంది. అల్లర్లు, బహిరంగ హింస, ఆర్ఓ కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడినప్పుడు మినహా నామినేషన్ల పరిశీలన ప్రక్రియను వాయిదా వేయటానికి వీల్లేదు. అభ్యర్థులు దాఖలు చేసిన ప్రతి నామినేషన్ను సంబంధిత ఆర్ఓ పరిశీలిస్తారు. నామపత్రాలను ఆమోదించటం, తిరస్కరించటం వంటివి ఆర్ఓ పరిధిలో ఉంటాయి. ఒకవేళ నామినేషన్ తిరస్కరణకు గురైతే అందుకు గల కారణాలను రాతపూర్వకంగా తెలియజేస్తారు. అభ్యర్థుల నామపత్రాలను పరిశీలించటానికి కావాల్సిన అన్నిరకాల సౌకర్యాలను రిటర్నింగ్ అధికారి కల్పిస్తారు.
నామినేషన్ల పరిశీలన కార్యక్రమానికి వీరికి మాత్రమే అనుమతి
- నామినేషన్ వేసిన అభ్యర్థి
- అభ్యర్థి ఎన్నికల ఏజెంట్
- అభ్యర్థి ప్రతిపాదకులు ఒకరు (స్వతంత్ర అభ్యర్థి.. నాలుగు సెట్ల నామపత్రాలు దాఖలు చేస్తే ప్రతిపాదకుల సంఖ్య 40 అవుతుంది. అయినప్పటికీ ఒక ప్రతిపాదకుడు మాత్రమే హాజరవటానికి అవకాశముంటుంది)
- అభ్యర్థి చేత రాతపూర్వకంగా అమోదం పొందిన మరోవ్యక్తి.
తిరస్కరణకు కారణాలు..
- పరిశీలన తేదీలోగా ఎన్నికల సంఘం నిర్దేశించిన అర్హతలను అభ్యర్థులు కలిగి ఉండకపోవటం.
- నామపత్రాల్లో అభ్యర్థి, ప్రతిపాదించిన వ్యక్తుల సంతకం నిజమైనది కాకపోవటం.
- నామినేషన్ వేసిన అభ్యర్థి తన ఓటుహక్కును సంబంధిత ఓటరు జాబితాలో చూపకపోవటం.
- నామపత్రంలోని అన్ని కాలమ్స్ను పూరించకపోవటం.
- ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో పోటీచేసే అభ్యర్థులు సంబంధిత కుల ధ్రువపత్రం చూపించకపోవటం.
- అభ్యర్థి తన వయస్సుకు సంబంధించిన సమాచారం నామపత్రాల్లో పొందుపరచకపోవటం.తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించటం.
రిటర్నింగ్ అధికారిదే తుది నిర్ణయం
అభ్యర్థుల నామపత్రాలను పరిశీలించి అమోదించటం లేదా తిరస్కరించటం ఆర్ఓ ముఖ్య విధి. నామినేషన్ల పరిశీలన అనంతరం ఆర్ఓ తీసుకున్న నిర్ణయమే అంతిమం. ఒకసారి తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం రిటర్నింగ్ అధికారికి సైతం ఉండదు. నామపత్రాల పరిశీలన కార్యక్రమం పూర్తైన తర్వాత చెల్లుబాటయ్యే అభ్యర్థుల జాబితాను రూపొందిస్తారు. దానిని నోటీసు బోర్డులో ఉంచుతారు. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిశాక బరిలో నిలిచే అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జన జాతరకు సర్వం సిద్ధం
[ 04-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ ఉద్ధృతం చేస్తోంది. ఖమ్మం లోక్సభ స్థానంలో పార్టీ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి గెలుపే లక్ష్యంగా ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. -
ఓట్ల పండుగ.. బాధ్యతలు మెండుగా!
[ 04-05-2024]
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల నిర్వహణ అత్యంత కీలకమైన అంశం. పౌరులు తమకు నచ్చిన నాయకులను ఎన్నుకునే ప్రక్రియలో ఓటరు నమోదు నుంచి ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు అధికార యంత్రాంగం కీలకంగా వ్యవహరిస్తుంది. -
ప్రభుత్వాన్ని కూల్చే దమ్ము ఎవరికీ లేదు: తుమ్మల
[ 04-05-2024]
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే దమ్ము ఎవరికీ లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ఖమ్మం నగరంలో శుక్రవారం నిర్వహించిన రోడ్షోలో తుమ్మల మాట్లాడారు. -
‘ప్రజాదరణను ఓటుబ్యాంకుగా మల్చుకోవాలి’
[ 04-05-2024]
భారాసపై ప్రజల్లో ఉన్న ఆదరణను ఓటుబ్యాంకుగా మల్చుకోవాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఖమ్మంలోని భారాస జిల్లా కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన బూత్ కమిటీ సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
భారాసలో కుదుపు
[ 04-05-2024]
లోక్సభ ఎన్నికల సమయంలో ఖమ్మంలో వలసలు భారాసను కుదిపేస్తున్నాయి. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో కార్పొరేటర్లు కాంగ్రెస్లోకి వరుస కట్టడం ఆ పార్టీకి మింగుడు పడటం లేదు. -
భాజపా గెలిస్తేనే ఖమ్మం అభివృద్ధి: తాండ్ర
[ 04-05-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో భాజపా గెలిస్తేనే నగరం సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని ఆపార్టీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. ఖమ్మం టూటౌన్లో శుక్రవారం నిర్వహించిన రోడ్షోలో ఆయన మాట్లాడారు. -
టేబుల్ టెన్నిస్లో పేట విద్యార్థుల సత్తా
[ 04-05-2024]
‘క్రీడలు ఏవైనా పతకాలు మనకే’ అన్నట్లు కొంతకాలంగా అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నారు అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల విద్యార్థులు. తాజాగా రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్లో ‘పేట’ విద్యార్థులు ఛాంపియన్లుగా నిలిచారు. -
నీటిసంపులో పడి బాలుడు మృతి
[ 04-05-2024]
ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మూడేళ్ల బాలుడు దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన పెనుబల్లి మండలం లంకాసాగర్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. -
కేంద్రంలో ఇండియా కూటమిదే అధికారం: తుమ్మల
[ 04-05-2024]
‘రాష్ట్రంలో గత ప్రభుత్వం స్కీముల పేరిట అన్ని పథకాలను స్కాములుగా మార్చి ఆర్థికంగా విధ్వంసం సృష్టించింది.. దేశసమైక్యతను దెబ్బతీసిన భాజపా ఈ ఎన్నికల్లో ఓడిపోతుంది.. -
దేశ సుభిక్షానికి మోదీ పాలన అవసరం
[ 04-05-2024]
దేశ సుభిక్షానికి మోదీ పాలన మళ్లీ అవసరమని మహబూబాబాద్ లోక్సభ స్థానం భాజపా అభ్యర్థి సీతారాంనాయక్ తెలిపారు. మణుగూరు, అశ్వాపురంలో శుక్రవారం ప్రచారం చేశారు. -
రెప్పపాటు నిర్లక్ష్యంతో ప్రాణాలు గాలిలో!
[ 04-05-2024]
చిన్నపాటి నిర్లక్ష్యంతో క్షణాల్లో సంభవించే విద్యుత్తు ప్రమాదాలు ఏకంగా ప్రాణనష్టాన్ని తెచ్చిపెడతాయి. విద్యుదాఘాతాలు నిండు నూరేళ్ల జీవితాన్ని ఎలా బలితీసుకుంటాయి? దానివల్ల బాధిత కుటుంబాలు ఎలా నష్టపోతున్నాయో గుర్తించేందుకు ఎన్నో ఘటనలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. -
మోసపూరిత హామీలతో అధికారంలోకి కాంగ్రెస్: నామా
[ 04-05-2024]
అసెంబ్లీ ఎన్నికల్లో మోసపూరిత హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఖమ్మం లోక్సభ స్థానం భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అన్న వచ్చాడు.. బ్యాంకులో పింఛన్లు బంద్!
-
ముందు మీరు రాయ్బరేలీలో గెలవండి.. రాహుల్కు సలహా ఇచ్చిన చెస్ దిగ్గజం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!