కాంగ్రెస్ అభ్యర్థిగా రఘురాంరెడ్డి
ఖమ్మం లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థిగా రామసహాయం రఘురాంరెడ్డిని ఆ పార్టీ అధిష్ఠానం బుధవారం ప్రకటించింది. కాంగ్రెస్ శ్రేణుల నెలన్నర రోజుల ఉత్కంఠకు తెరపడింది.
- పుట్టిన తేదీ: 1961 డిసెంబర్ 19
- జన్మస్థలం: చేగొమ్మ, కూసుమంచి మండలం, ఖమ్మం జిల్లా
- తల్లిదండ్రులు: రామసహాయం జయమాల, సురేందర్రెడ్డి
- విద్యాభ్యాసం: హైదరాబాద్ నిజాం కళాశాలలో బీకామ్, ప్రస్తుతం వ్యాపారరీత్యా హైదరాబాద్లో నివాసముంటున్నారు.
- రఘురాంరెడ్డికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు వినాయక్రెడ్డి సినీ నటుడు దగ్గుబాటి వెంకటేష్ పెద్ద కుమార్తె ఆశ్రితను వివాహమాడారు. చిన్న కుమారుడు అర్జున్రెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమార్తె స్వప్నిరెడ్డిని పెళ్లి చేసుకున్నారు.
ఈటీవీ- ఖమ్మం: ఖమ్మం లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థిగా రామసహాయం రఘురాంరెడ్డిని ఆ పార్టీ అధిష్ఠానం బుధవారం ప్రకటించింది. కాంగ్రెస్ శ్రేణుల నెలన్నర రోజుల ఉత్కంఠకు తెరపడింది. రాజకీయ దిగ్గజం రామసహాయం సురేందర్రెడ్డి కుమారుడు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియ్యంకుడైన రఘురాంరెడ్డిని అనూహ్య పరిణామాల మధ్య కాంగ్రెస్ టికెట్ వరించింది.
హేమాహేమీలు పోటీపడ్డా.. అనేక మలుపులు, చర్చోపచర్చల అనంతరం కాంగ్రెస్ అధిష్ఠానం చివరకు రఘురాంరెడ్డి వైపే మొగ్గుచూపింది. స్క్రీనింగ్ కమిటీ, కేంద్ర ఎన్నికల కమిటీ పలుమార్లు సమావేశమైనప్పటికీ ఖమ్మం అభ్యర్థి ఎంపికపై పీటముడి తప్పలేదు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క సతీమణి మల్లు నందిని, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు తుమ్మల యుగంధర్, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్రెడ్డి టికెట్ ఆశించటం, పలువురు సీనియర్లు సైతం రేసులోకి రావటంతో అభ్యర్థి ఎంపిక పార్టీకి క్లిష్టంగా మారింది. అయినా ఏకాభిప్రాయ సాధనే ధ్యేయంగా ముఖ్యనేతలతో అధిష్ఠానం సంప్రదింపులు జరిపింది. ఓవైపు నామినేషన్ల గడువుకు సమయం సమీపిస్తున్నప్పటికీ అభ్యర్థి తేలకపోవడంతో చివరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రంగంలోకి దిగారు. బెంగళూరులో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో అభ్యర్థి ఎంపికపై సమాలోచనలు జరిపారు. మంత్రి తుమ్మలతో ఫోన్లో సంప్రదించి ఆయన అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాత రఘురాంరెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ ఏఐసీసీ ప్రకటన వెలువరించింది.
నేడు నామినేషన్ దాఖలు.. కాంగ్రెస్ అభ్యర్థిగా రఘురాంరెడ్డి గురువారం నామినేషన్ వేయనున్నారు. ఖమ్మం లోక్సభ కాంగ్రెస్ ఎన్నికల ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న పొంగులేటి వియ్యంకుడికే టికెట్ దక్కటంతో అట్టహాసంగా నామపత్రాలు దాఖలు చేసేందుకు కాంగ్రెస్ శ్రేణులు సమాయత్తమవుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జన జాతరకు సర్వం సిద్ధం
[ 04-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ ఉద్ధృతం చేస్తోంది. ఖమ్మం లోక్సభ స్థానంలో పార్టీ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి గెలుపే లక్ష్యంగా ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. -
ఓట్ల పండుగ.. బాధ్యతలు మెండుగా!
[ 04-05-2024]
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల నిర్వహణ అత్యంత కీలకమైన అంశం. పౌరులు తమకు నచ్చిన నాయకులను ఎన్నుకునే ప్రక్రియలో ఓటరు నమోదు నుంచి ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు అధికార యంత్రాంగం కీలకంగా వ్యవహరిస్తుంది. -
ప్రభుత్వాన్ని కూల్చే దమ్ము ఎవరికీ లేదు: తుమ్మల
[ 04-05-2024]
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే దమ్ము ఎవరికీ లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ఖమ్మం నగరంలో శుక్రవారం నిర్వహించిన రోడ్షోలో తుమ్మల మాట్లాడారు. -
‘ప్రజాదరణను ఓటుబ్యాంకుగా మల్చుకోవాలి’
[ 04-05-2024]
భారాసపై ప్రజల్లో ఉన్న ఆదరణను ఓటుబ్యాంకుగా మల్చుకోవాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఖమ్మంలోని భారాస జిల్లా కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన బూత్ కమిటీ సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
భారాసలో కుదుపు
[ 04-05-2024]
లోక్సభ ఎన్నికల సమయంలో ఖమ్మంలో వలసలు భారాసను కుదిపేస్తున్నాయి. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో కార్పొరేటర్లు కాంగ్రెస్లోకి వరుస కట్టడం ఆ పార్టీకి మింగుడు పడటం లేదు. -
భాజపా గెలిస్తేనే ఖమ్మం అభివృద్ధి: తాండ్ర
[ 04-05-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో భాజపా గెలిస్తేనే నగరం సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని ఆపార్టీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. ఖమ్మం టూటౌన్లో శుక్రవారం నిర్వహించిన రోడ్షోలో ఆయన మాట్లాడారు. -
టేబుల్ టెన్నిస్లో పేట విద్యార్థుల సత్తా
[ 04-05-2024]
‘క్రీడలు ఏవైనా పతకాలు మనకే’ అన్నట్లు కొంతకాలంగా అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నారు అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల విద్యార్థులు. తాజాగా రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్లో ‘పేట’ విద్యార్థులు ఛాంపియన్లుగా నిలిచారు. -
నీటిసంపులో పడి బాలుడు మృతి
[ 04-05-2024]
ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మూడేళ్ల బాలుడు దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన పెనుబల్లి మండలం లంకాసాగర్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. -
కేంద్రంలో ఇండియా కూటమిదే అధికారం: తుమ్మల
[ 04-05-2024]
‘రాష్ట్రంలో గత ప్రభుత్వం స్కీముల పేరిట అన్ని పథకాలను స్కాములుగా మార్చి ఆర్థికంగా విధ్వంసం సృష్టించింది.. దేశసమైక్యతను దెబ్బతీసిన భాజపా ఈ ఎన్నికల్లో ఓడిపోతుంది.. -
దేశ సుభిక్షానికి మోదీ పాలన అవసరం
[ 04-05-2024]
దేశ సుభిక్షానికి మోదీ పాలన మళ్లీ అవసరమని మహబూబాబాద్ లోక్సభ స్థానం భాజపా అభ్యర్థి సీతారాంనాయక్ తెలిపారు. మణుగూరు, అశ్వాపురంలో శుక్రవారం ప్రచారం చేశారు. -
రెప్పపాటు నిర్లక్ష్యంతో ప్రాణాలు గాలిలో!
[ 04-05-2024]
చిన్నపాటి నిర్లక్ష్యంతో క్షణాల్లో సంభవించే విద్యుత్తు ప్రమాదాలు ఏకంగా ప్రాణనష్టాన్ని తెచ్చిపెడతాయి. విద్యుదాఘాతాలు నిండు నూరేళ్ల జీవితాన్ని ఎలా బలితీసుకుంటాయి? దానివల్ల బాధిత కుటుంబాలు ఎలా నష్టపోతున్నాయో గుర్తించేందుకు ఎన్నో ఘటనలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. -
మోసపూరిత హామీలతో అధికారంలోకి కాంగ్రెస్: నామా
[ 04-05-2024]
అసెంబ్లీ ఎన్నికల్లో మోసపూరిత హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఖమ్మం లోక్సభ స్థానం భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అన్న వచ్చాడు.. బ్యాంకులో పింఛన్లు బంద్!
-
ముందు మీరు రాయ్బరేలీలో గెలవండి.. రాహుల్కు సలహా ఇచ్చిన చెస్ దిగ్గజం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!