logo

రూ.2 లక్షల నగదు పట్టివేత

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజోలి శివారులోని సుంకేసుల జలాశయం వద్ద శనివారం నిర్వహించిన తనిఖీల్లో రూ.2 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

Published : 20 Apr 2024 20:42 IST

రాజోలి: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజోలి శివారులోని సుంకేసుల జలాశయం వద్ద శనివారం నిర్వహించిన తనిఖీల్లో రూ.2 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజోలి గ్రామానికి చెందిన హరిబాబు నగదుకు తీసుకొని కర్నూలు వైపు వెళ్తున్నాడు. సుంకేసుల డ్యాం వద్ద ఎస్ఎస్ బృందం వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా, నగదుకు సంబంధించి ఎలాంటి పత్రాలు లేవని గుర్తించారు. రూ.50 వేలకు పైగా నగదును తీసుకెళ్తే తప్పనిసరిగా సంబంధిత పత్రాలు వెంట తీసుకురావాలని అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని