మగువలే నిర్ణేతలు
పాలమూరులోని రెండు లోక్సభా స్థానాల్లో అభ్యర్థుల గెలుపోటముల్ని మహిళా ఓటర్లే ప్రభావితం చేయనున్నారు.
రెండు లోక్సభ స్థానాల్లో మహిళా ఓటర్లే అధికం
ప్రత్యేక దృష్టి సారిస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు
ఈనాడు, మహబూబ్నగర్, దేవరకద్ర గ్రామీణం, న్యూస్టుడే : పాలమూరులోని రెండు లోక్సభా స్థానాల్లో అభ్యర్థుల గెలుపోటముల్ని మహిళా ఓటర్లే ప్రభావితం చేయనున్నారు. మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గాల్లోని మొత్తం ఓటర్లలో సగానికిపైగా మగువలే ఉండటమే దీనికి కారణం. ప్రధాన పార్టీల అభ్యర్థులు మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంపై దృష్టి సారిస్తున్నారు. మహిళా ఓటర్లను మెప్పించగలిగితే గెలుపు అవకాశాలు సులభమవుతాయని పార్టీలు భావిస్తున్నాయి. మహబూబ్నగర్ పరిధిలో 16,80,417 మంది ఓటర్లు ఉండగా వీరిలో 8,48,293 (50.48 శాతం) మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఈ లోక్సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. నాగర్కర్నూల్ పరిధిలో మొత్తం 17,34,773 మంది ఓటర్లుండగా వీరిలో 8,70,694 (50.19 శాతం) మహిళలు ఉన్నారు. ఈ లోక్సభ స్థానం పరిధిలో కల్వకుర్తి, కొల్లాపూర్ మినహా మిగతా ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లలో అతివలే అధిక సంఖ్యలో ఉన్నారు. మహిళా ఓటర్లను ఆకర్షించడానికి పార్టీలు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి.
గ్యారంటీ పథకాలు వివరిస్తూ.. : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి మహిళా ఓటర్లపై ప్రధానంగా దృష్టి పెట్టింది. గతేడాది డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ అధికారంలోకి రావడంతో వారికోసం ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేస్తోంది. ఈ అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేసి మహిళా ఓటర్లను తమవైపు తిప్పుకోవచ్చని కాంగ్రెస్ ముఖ్యులు భావిస్తున్నారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా రాబోయే రోజుల్లో నెలకు రూ.2,500 అందించే పథకాన్ని కూడా అమలు చేస్తామని వివరిస్తున్నారు. కేంద్రంలో మోదీ సిలిండర్ ధర పెంచితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాయితీపై రూ.500కే గ్యాస్ను అందిస్తుందని ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికి మహబూబ్నగర్లో కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్రెడ్డి తన మేనిఫెస్టోకు సంబంధించిన అంశాలపై ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ను ఏర్పాటు చేశారు. ఇందులో మహిళలకు సంబంధించిన పథకాలను చేర్చడానికి ప్రణాళికలు తయారు చేశారు. నాగర్కర్నూల్లోనూ మహిళా ఓటర్లపై మల్లు రవి ప్రత్యేకంగా దృష్టి సారించారు.
గత పథకాలను వివరిస్తూ..
భారాస సైతం మహిళా ఓటర్లపై ప్రత్యేక దృష్టి సారించింది. గత పదేళ్లలో అనేక పథకాల ద్వారా అతివలు లబ్ధి పొందారని వివరించే ప్రయత్నం చేస్తున్నారు. షాదీముబారక్, కల్యాణలక్ష్మి, ఒంటరి మహిళలకు పింఛన్లు వంటివి అమలు చేసిందని తమ ప్రభుత్వమే అని భారాస అభ్యర్థులు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. మహబూబ్నగర్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి, నాగర్కర్నూల్ అభ్యర్థి ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ తమ ప్రచారంలో మహిళా సంక్షేమంపై వివరిస్తున్నారు.
నారీ శక్తిపై భాజపా ప్రచారం..
మహిళా ఓటర్లను ఆకర్షించడానికి భాజపా ఆత్మనిర్భర్ నారీ శక్తిపై దృష్టి సారించింది. ఉమ్మడి జిల్లాలో ఈ కార్యక్రమంపై విసృత్తంగా ప్రచారం చేపడుతున్నారు. మహిళలకు భద్రత, సాధికారత కల్పించడానికి కేంద్రం మిషన్ శక్తి కార్యక్రమంపై పూర్తి అవగాహన కల్పిస్తున్నారు. స్వయం సహాయక సంఘాల ద్వారా అందిస్తున్న రుణాలు కేంద్రం నుంచి వస్తున్నట్లు చెబుతున్నారు. ముద్ర యోజన, లఖ్పతి దీదీ, సుకన్య సమృద్ధి యోజన, స్టాండ్ ఆఫ్ ఇండియా కార్యక్రమాలను భాజపా జనంలోకి తీసుకెళ్తున్నారు. వీటిని వివరించడానికి ప్రత్యేకంగా మహిళా మోర్చా కార్యకర్తలు రంగంలోకి దిగారు. ఇప్పటికే మహబూబ్నగర్లో డీకే అరుణ, నాగర్కర్నూల్లో భరత్ ప్రసాద్ అతివలకు మోదీ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను వివరిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాలమూరుకు అగ్రనేతలు
[ 04-05-2024]
పాలమూరులో ఎన్నికల ప్రచారానికి ప్రధాన పార్టీలకు చెందిన అగ్రనేతలు రానున్నారు. పోలింగ్ గడువు దగ్గర పడుతుండటంతో ఆయా పార్టీలు ప్రచారాన్ని ఉద్ధృతం చేశాయి. -
పీఎంశ్రీకి మరో 46 పాఠశాలలు
[ 04-05-2024]
సర్కారు బడుల బలోపేతమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పీఎంశ్రీ (ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైసింగ్ ఇండియా) యోజనను గత విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తోంది. -
పులులకు ఆవాసం.. గ్రామస్థులకు పునరావాసం
[ 04-05-2024]
ఆక్రమణలు, అభివృద్ధి పేర నానాటికి కుంచించుకు పోతున్న అటవీ ప్రాంతంతో అడవికి రారాజైన పెద్దపులుల ఉనికికి భంగం కలుగుతోంది. నల్లమలలో -
ఉత్తర భారతంలో భాజపాకు సగం సీట్లే
[ 04-05-2024]
ఉత్తర భారతదేశంలో జరిగిన ఎన్నికల్లో భాజపాకు సగం సీట్లు కూడా రావడం లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. -
పురపాలిక.. మేల్కోవాలిక!
[ 04-05-2024]
మహబూబ్నగర్ పురపాలక సంఘ భవనం పూర్తిగా దెబ్బతింది. భవనం పిల్లర్లు, సజ్జలు, గోడలు, మెట్లు పెచ్చులు ఊడుతున్నాయి. -
విలక్షణ పోరు.. ఇక్కడి తీరు
[ 04-05-2024]
నాగర్కర్నూలు లోక్సభ నియోజకవర్గం 1967లో ఏర్పాటైంది. ఇప్పటి వరకు 14సార్లు ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం 15వ సారి ఎన్నిక జరుగుతోంది. -
మళ్లీ మోసపోవద్దు
[ 04-05-2024]
గత శాసనసభ ఎన్నికల్లో ఆరు గ్యారంటీలు నమ్మి మోసిపోయినట్లుగా ఇపుడు మళ్లీ బుట్టలోపడొద్దని మహబూబ్నగర్ లోక్సభ స్థానం భాజపా అభ్యర్థి డీకే అరుణ అన్నారు. -
భాజపాతోనే భారత్ వికాసం : భరత్ ప్రసాద్
[ 04-05-2024]
దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే మోదీ విజన్తోనే సాధ్యమని నాగర్కర్నూల్ పార్లమెంట్ స్థానం భాజపా అభ్యర్థి భరత్ ప్రసాద్ పేర్కొన్నారు. -
ప్రవీణ్కుమార్ ప్రచారంలో ఉద్రిక్తత
[ 04-05-2024]
నాగర్కర్నూల్ జిల్లా బల్మూర్ మండల కేంద్రంలో చేపట్టిన భారాస ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ లోక్సభ ఎన్నికల ప్రచారం ఉద్రిక్తతకు దారి తీసింది. -
మోదీ హయాంలో దేశం 30 ఏళ్ల వెనుకబాటు
[ 04-05-2024]
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదేళ్ల పాలనలో దేశాన్ని ముప్పై ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. -
ప్రజాపాలన కాంగ్రెస్తోనే సాధ్యం
[ 04-05-2024]
రాష్ట్రంలో ప్రజాపాలనకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వెంటే జిల్లా ప్రజలు ఉన్నారని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి తెలిపారు. -
మంచినీటికి ముప్పుతిప్పలు
[ 04-05-2024]
జిల్లా కేంద్రమైన వనపర్తిలో తాగునీటి సమస్య రోజురోజుకు పెరిగిపోతోంది. పురపాలక సంఘంలోని పలు కాలనీలకు రామన్పాడు తాగునీటిని పూర్తిస్థాయిలో సరఫరా చేయడం లేదు. -
ఓటుకు తప్పని దూరాభారం
[ 04-05-2024]
ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం విస్తృత ప్రచారం చేస్తున్నా, కొన్ని తండాలవాసులు ఓటేయడానికి దూరం వెళ్లాల్సివస్తోంది. -
రేపటి నీట్కు 11 కేంద్రాలు
[ 04-05-2024]
వైద్యవిద్య కోర్సులో ప్రవేశాల కోసం ఈ నెల 5న నిర్వహించే నీట్కు ఉమ్మడి పాలమూరులో 11 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. -
ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఊరట
[ 04-05-2024]
ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించడానికి జిల్లా అధికారులు చర్యలు చేపట్టారు. విద్యార్థులకు ఈనెల 24 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
జగన్ను వెంటాడుతోన్న ఓటమి భయం..? తాడేపల్లి ప్యాలెస్లో వాస్తుమార్పులు!
-
అన్న వచ్చాడు.. బ్యాంకులో పింఛన్లు బంద్!
-
ముందు మీరు రాయ్బరేలీలో గెలవండి.. రాహుల్కు సలహా ఇచ్చిన చెస్ దిగ్గజం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు