రానున్న ఐదురోజులు వడగాల్పులు: కలెక్టరు హెచ్చరిక
రానున్న ఐదు రోజులు నారాయణపేట జిల్లాలో తీవ్రమైన వడగాల్పులతో పాటు ఉష్ణ్రోగ్రతలు రికార్డు స్థాయిలో 45డిగ్రీలకు చేరుకునే ప్రమాదం ఉన్నందున జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష కోరారు.
కలెక్టర్ కోయ శ్రీహర్ష
నారాయణపేట(పాతబస్టాండ్), న్యూస్టుడే : రానున్న ఐదు రోజులు నారాయణపేట జిల్లాలో తీవ్రమైన వడగాల్పులతో పాటు ఉష్ణ్రోగ్రతలు రికార్డు స్థాయిలో 45డిగ్రీలకు చేరుకునే ప్రమాదం ఉన్నందున జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష కోరారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించారు. బయటకు తప్పనిసరై రావాల్సి ఉంటే తలకు టోపీలు, రూమాలు, గొడుగులు వినియోగించాలన్నారు. రోజూ కనీసం ఐదు లీటర్ల మంచినీరు తాగాలని సూచించారు. నలుపు, ముదురు రంగు, మందంగా ఉండే దుస్తులు ధరించాలన్నారు కాఫీ, టీలు వేడి వాతావరణంలో తాగడం తగ్గిస్తే మేలని కలెక్టరు అభిప్రాయపడ్డారు. మజ్జిగ, కొబ్బరినీళ్లు తాగడం ఆరోగ్యానికి శ్రేయస్కరమని కలెక్టరు శ్రీహర్ష అన్నారు. ఎవరైన వడదెబ్బకు గురైతే శరీరాన్ని చల్లని తడిగుడ్డతో శరీర ఉష్ణోగ్రత 101డిగ్రీల కంటే తక్కువ స్థాయికి వచ్చే వరకు తుడుస్తూ ఉండాలన్నారు. సమీప ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించాలని కోరారు. వైద్య సిబ్బంది ప్రథమ చికిత్స కిట్లుతో ప్రజలకు అందుబాటులో ఉండాలని కలెక్టరు సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేటితో ప్రచారానికి తెర
[ 11-05-2024]
పాలమూరులో సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి శనివారంతో తెర పడనుంది. సాయంత్రం 5 గంటల తర్వాత సభలు, సమావేశాలు, ఇంటింటి ప్రచారం అన్నింటికీ ముగింపు పలకాలి. -
భాజపాలో కొత్త జోష్
[ 11-05-2024]
సభకు ఎలాంటి అంతరాయం లేకుండా పోలీసుశాఖ పటిష్ఠ ఏర్పాట్లు చేయడంతో సభ సాఫీగా ముగిసిపోయింది. ఏ ప్రాంతం నుంచి వచ్చిన వాహనాలను అక్కడి సమీపంలో పార్కింగ్ చేయించడం, ట్రాఫిక్ ఆంక్షల మూలంగా సభ సజావుగా ముగిసింది. -
పాలమూరు ఆత్మగౌరవ ఎన్నికలివీ.
[ 11-05-2024]
సార్వత్రిక ఎన్నికలు ఇద్దరి మధ్యనో, మూడు పార్టీల మధ్యనో జరుగుతున్నవి కాదని.. పాలమూరు ఆత్మగౌరవానికి, ఈ ప్రాంత 70 ఏళ్ల వెనకబాటుతనానికి, వలస పోతున్న వారి కోసం జరుగుతున్నవని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. -
పొరపాటుతో స్వతంత్రం.. తారుమారు
[ 11-05-2024]
చిన్న పొరపాట్లతో సమీకరణలు, ఫలితాలు మారుతుంటాయి. 2004లో నాగర్కర్నూల్ ఎంపీ స్థానానికి కేఎస్ రత్నంను తెరాస అభ్యర్థిగా ప్రకటించినా సకాలంలో భీపాం అందించకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా రంగంలో నిలువాల్సి వచ్చింది. -
ఏ అభ్యర్థి ఓటు ఎక్కడ..?
[ 11-05-2024]
పార్లమెంట్కు దేశంలోని ఏ లోక్సభ స్థానం నుంచైనా పోటీ చేయవచ్చని తెలిసిందే. నియోజకవర్గంలోనే ఓటు ఉండాలన్న నిబంధన కూడా ఏమీ లేదు. -
ప్రవీణ్కుమార్ను గెలిపించుకుందాం: చల్లా
[ 11-05-2024]
స్థానికుడైన ప్రవీణ్కుమార్ను గెలిపించుకుందామని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి పిలుపునిచ్చారు. -
భాజపాపై కాంగ్రెస్, భారాస విష ప్రచారం తగదు
[ 11-05-2024]
రిజర్వేషన్లను మార్చే హక్కు, అధికారం ఏ పార్టీలకు లేదని, ఎస్సీ వర్గీకరణ విషయంలో భాజపా నిర్ణయం స్థిరంగా ఉన్నదని స్పష్టం చేశారు. -
చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు
[ 11-05-2024]
నాగర్కర్నూల్, షాద్నగర్, నారాయణపేట, వనపర్తి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్టు చేసినట్లు ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపారు. -
ఓటు సద్వినియోగంతోనే సమస్యలకు పరిష్కారం
[ 11-05-2024]
బల్మూర్ మండలంలో చేపట్టనున్న శ్రీ ఉమామహేశ్వర జలాశయంతో బలహీన వర్గాల ప్రజలు అధికంగా భూములను కోల్పోతున్నారని బాధితులు ఆందోళన బాట బట్టారు. -
మద్యం రేషన్కు గేట్లెత్తారు !
[ 11-05-2024]
నిన్నటివరకు రేషన్ పద్ధతిన సరఫరా చేసిన మద్యానికి శుక్రవారం ఒక్కరోజు గేట్లెత్తేయడంతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రూ. 25 కోట్ల మేర అమ్మకాలు జరిగాయి.
తాజా వార్తలు (Latest News)
-
రామ్తో నెట్ఫ్లిక్స్ వెబ్సిరీస్?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!