Sangareddy: భార్యను వేధిస్తున్న అపరిచితుణ్ని భర్తే పట్టించాడు
అంతర్జాలం విస్తృతంగా అందుబాటులోకి వచ్చాక రకరకాల నేరాలు, మోసాలు పెరుగుతున్నాయి. అశ్లీల చిత్రాలు, వీడియోలతో కొందరు మృగాళ్లు, ఆడపిల్లలను, మహిళలను వేధింపులకు గురిచేస్తున్నారు.
ఈనాడు, సంగారెడ్డి: అంతర్జాలం విస్తృతంగా అందుబాటులోకి వచ్చాక రకరకాల నేరాలు, మోసాలు పెరుగుతున్నాయి. అశ్లీల చిత్రాలు, వీడియోలతో కొందరు మృగాళ్లు, ఆడపిల్లలను, మహిళలను వేధింపులకు గురిచేస్తున్నారు. చాలా మంది బయటకు చెప్పుకోలేక తమలో తామే కుంగిపోతుండడాన్ని ఆసరాగా చేసుకొంటున్న నిందితులు మరింత చెలరేగిపోతుండడం గమనార్హం.
సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణానికి చెందిన ప్రైవేటు ఉద్యోగి భార్యకు ఓ వ్యక్తి అశ్లీల చిత్రాలను వాట్సాప్ చేశాడు. ఆమె ఆ విషయాన్ని వెంటనే భర్తకు తెలిపింది. ఆమెకు ధైర్యం చెప్పిన భర్త.. నిందితుణ్ని సాంకేతికత సాయంతో తానే గుర్తించి చాకచక్యంగా పోలీసుల వద్దకు రప్పించి పట్టించడం విశేషం. ఇందుకుగాను అతను కొన్ని యాప్ల సాయం తీసుకున్నారు. నిందితుడి ఫోన్ నంబరును ఎవరెవరు ఎన్ని రకాలుగా తమ ఫోన్లలో నమోదు చేసుకున్నారో గుర్తించారు.
అతడు మెదక్ పక్కనే ఉన్న పల్లెటూరుకు చెందిన వ్యక్తని తెలిసింది. మిత్రులతో కలిసి రెండు రోజుల క్రితం ఆ ఊరికి వెళ్లారు. సాంకేతికత ఆధారంగా సేకరించిన అతడి ఫొటోను గ్రామస్థులకు చూపించారు. రుణం చెల్లించడంలేదని చెప్పడంతో.. అతడు సంగారెడ్డి సమీపంలోనే నివసిస్తున్నాడని చెప్పి చిరునామాతోపాటు, అతడి బంధువు ఫోన్ నంబరు ఇచ్చారు. బాధితులు ఫిర్యాదు ఇస్తున్నారని తెలిస్తే నిందితుడు పారిపోతాడని గ్రహించి.. బంధువుకు చివరి వరకు రుణం ఎగ్గొట్టాడనే చెబుతూ వచ్చారు. మావాడు చాలా మంచోడు.. మేమే వస్తున్నాం పోలీస్స్టేషన్కు అంటూ అతన్ని తీసుకొని వారి బంధువులు సోమవారం సంగారెడ్డి గ్రామీణ పోలీస్టేషన్కు వచ్చారు. అప్పటికే ఆధారాలతో సిద్ధంగా ఉన్న బాధితురాలి భర్త పోలీసుల సమక్షంలో వాటిని అందరికీ చూపించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు నేరం అంగీకరించాడు. ఆధారాలను పరిశీలించి కేసు నమోదు చేస్తామని సీఐ నవీన్కుమార్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాగల వారం రోజులు..
[ 04-05-2024]
ఎన్నికల ప్రచారం ముగిసేందుకు మరో వారం రోజులే ఉండడంతో... రాజకీయ పార్టీలు ముమ్మర ప్రచారానికి సమాయత్తమవుతున్నాయి. -
నిఘా తగ్గి.. అక్రమాలు పెరిగి
[ 04-05-2024]
అధికారులంతా ఎన్నికల విధుల్లో బిజీగా ఉండటంతో అక్రమార్కులు విజృంభిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇసుక వ్యాపారం జోరుగా సాగుతోంది. -
సంచరిస్తున్న చిరుత.. ప్రజలు జాగ్రత్త
[ 04-05-2024]
అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. -
వనిత చేతిలో నేతల భవిత
[ 04-05-2024]
మహిళలు ఇంటిని చక్కబెట్టడమే కాదు.. ఓటు ద్వారా సమాజంలో మార్పు కాంక్షించడంలో ముందు వరుసలో ఉంటారు. -
హస్తం హామీలకు రూ.3లక్షల కోట్లు కావాలి
[ 04-05-2024]
రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేరాలంటే రూ.3 లక్షల కోట్లు కావాలని, మంత్రిగా పనిచేసిన అనుభవంతో చెబుతున్నానని రాష్ట్ర శాసనసభ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి తెలిపారు. -
కాంగ్రెస్ పాలనతోనే దేశం క్షేమం
[ 04-05-2024]
దేశాన్ని క్షేమంగా ఉంచడం కాంగ్రెస్కే సాధ్యమని, పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. -
పేదల సంక్షేమం మాతోనే సాధ్యం: జగ్గారెడ్డి
[ 04-05-2024]
కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పేద ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి జరుగుతుందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు. -
పౌరులు పొరపడితే.. అభ్యర్థులకు గ్రహపాటే
[ 04-05-2024]
ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అభ్యర్థులు పోటా పోటీగా ప్రచారం చేస్తున్నారు. -
ఓటింగ్ శాతం పెంపునకు ప్రాధాన్యం
[ 04-05-2024]
జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికలకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా యంత్రాంగం ముందుకు సాగుతోంది. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. -
శిక్ష తప్పదు తస్మాత్ జాగ్రత్త!
[ 04-05-2024]
అన్ని పార్టీలు లోక్సభ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించాలన్న పట్టుదలతో ప్రచారంతో దూసుకెళ్తున్నాయి. -
త్రిముఖ పోరు..ప్రచార జోరు
[ 04-05-2024]
ఓ వైపు ఎండలు మండుతున్నప్పటికీ.. మరో వైపు విజయమే లక్ష్యంగా నేతలు ప్రచారాన్ని ఉద్ధృతం చేశారు. -
ఆరు గ్యారంటీల పేరుతో మోసం: హరీశ్రావు
[ 04-05-2024]
ఆరు గ్యారంటీల పేరుతో అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసగించినట్లు మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. -
పార్టీలు మారే వారికి ఓటెయొద్దు: రాజాసింగ్
[ 04-05-2024]
పార్టీలు మారే వారికి ఓటెయ్యవద్దని, ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుకైన భాజపా అభ్యర్థి రఘునందన్రావును గెలిపించాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. -
దుబ్బాకలో లోకల్ దారి
[ 04-05-2024]
నియోజకవర్గంలోని ఓటర్లందరినీ ఒకేరకమైన హామీతో ప్రసన్నం చేసుకోవాలనుకుంటే కొంత ఇబ్బందే. -
పెళ్లి రోజే అనంత లోకాలకు
[ 04-05-2024]
ద్విచక్రవాహనాలు ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన జగదేవపూర్ మండలం తీగుల్లో చోటుచేసుకుంది.