లంచం కేసులో ఎస్సై, కానిస్టేబుల్ సస్పెన్షన్
లంచం కేసులో డబ్బులు తీసుకున్నట్లు అవినీతి నిరోధక శాఖ(అనిశా) విచారణలో తేలడంతో మెదక్ గ్రామీణ ఎస్సై, కానిస్టేబుల్ను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్-1 ఐజీ రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు.
న్యూస్టుడే-మెదక్, మెదక్ రూరల్: లంచం కేసులో డబ్బులు తీసుకున్నట్లు అవినీతి నిరోధక శాఖ(అనిశా) విచారణలో తేలడంతో మెదక్ గ్రామీణ ఎస్సై, కానిస్టేబుల్ను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్-1 ఐజీ రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. మెదక్ పట్టణం అవుసులపల్లికి చెందిన చంద్రం గత నెలలో అక్రమంగా ఇసుక తరలించడంతో గ్రామీణ పోలీసులు అతని ట్రాక్టర్ను పట్టుకొని కేసు నమోదు చేశారు. ట్రాక్టర్ విడిపించేందుకు రూ.20 వేలు లంచం ఇవ్వాలని ఠాణా కానిస్టేబుల్ సురేందర్ డిమాండ్ చేయగా, చంద్రం రూ.15 వేలు చెల్లించారు. మిగిలిన రూ.5 వేల కోసం ఒత్తిడి చేయడంతో గత నెల 19న కానిస్టేబుల్ సురేందర్కు రూ.5 వేలు ఇస్తుండగా, అనిశా అధికారులు పట్టుకున్న విషయం విధితమే. ముందుగా ఇచ్చిన రూ.15వేలు సార్కి ఇచ్చానని కానిస్టేబుల్ సురేందర్ విచారణలో వెల్లడించారని అనిశా డీఎస్పీ ఆనంద్ అప్పట్లో వెల్లడించారు. ఈ క్రమంలో ఈనెల 19న అనిశా అధికారులు గ్రామీణ ఎస్సై, కానిస్టేబుల్ బాసిత్ను మెదక్లో విచారించారు. రూ.15వేల లంచం విషయంలో వీరి పాత్ర ఉన్నట్టు రుజువు కావడంతో సోమవారం ఎస్సై అమర్, కానిస్టేబుల్ బాసిత్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయాన్ని అదనపు ఎస్పీ మహేందర్ ‘న్యూస్టుడే’తో ధ్రువీకరించారు.
2018 నుంచి విధులు...
2023 జులైలో ఎస్సై అమర్ గ్రామీణ ఠాణా ఎస్సైగా రాగా, కానిస్టేబుల్ బాసిత్ 2018 నుంచి ఇక్కడే విధులు నిర్వహిస్తుండటం గమనార్హం. కానిస్టేబుల్ బాసిత్ మధ్యలో రెండు నెలలు జిల్లాలోని హవేలీఘనపూర్లో విధులు నిర్వహించి, తిరిగి గ్రామీణ ఠాణాకు వచ్చారు. ప్రస్తుతం అతను స్టేషన్ రైటర్గా కొనసాగుతున్నారు. మండలంలోని ఆయా గ్రామాల్లో ఇసుక వ్యాపారం చేసే వారి వద్ద నుంచి బాసిత్ పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తాడని ఆరోపణలు ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాగల వారం రోజులు..
[ 04-05-2024]
ఎన్నికల ప్రచారం ముగిసేందుకు మరో వారం రోజులే ఉండడంతో... రాజకీయ పార్టీలు ముమ్మర ప్రచారానికి సమాయత్తమవుతున్నాయి. -
నిఘా తగ్గి.. అక్రమాలు పెరిగి
[ 04-05-2024]
అధికారులంతా ఎన్నికల విధుల్లో బిజీగా ఉండటంతో అక్రమార్కులు విజృంభిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇసుక వ్యాపారం జోరుగా సాగుతోంది. -
సంచరిస్తున్న చిరుత ప్రజలు జాగ్రత్త
[ 04-05-2024]
అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. -
వనిత చేతిలో నేతల భవిత
[ 04-05-2024]
మహిళలు ఇంటిని చక్కబెట్టడమే కాదు.. ఓటు ద్వారా సమాజంలో మార్పు కాంక్షించడంలో ముందు వరుసలో ఉంటారు. -
హస్తం హామీలకు రూ.3లక్షల కోట్లు కావాలి
[ 04-05-2024]
రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేరాలంటే రూ.3 లక్షల కోట్లు కావాలని, మంత్రిగా పనిచేసిన అనుభవంతో చెబుతున్నానని రాష్ట్ర శాసనసభ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి తెలిపారు. -
కాంగ్రెస్ పాలనతోనే దేశం క్షేమం
[ 04-05-2024]
దేశాన్ని క్షేమంగా ఉంచడం కాంగ్రెస్కే సాధ్యమని, పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. -
పేదల సంక్షేమం మాతోనే సాధ్యం: జగ్గారెడ్డి
[ 04-05-2024]
కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పేద ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి జరుగుతుందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు. -
పౌరులు పొరపడితే.. అభ్యర్థులకు గ్రహపాటే
[ 04-05-2024]
ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అభ్యర్థులు పోటా పోటీగా ప్రచారం చేస్తున్నారు. -
ఓటింగ్ శాతంపెంపునకు ప్రాధాన్యం
[ 04-05-2024]
జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికలకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా యంత్రాంగం ముందుకు సాగుతోంది. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. -
శిక్ష తప్పదు తస్మాత్ జాగ్రత్త!
[ 04-05-2024]
అన్ని పార్టీలు లోక్సభ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించాలన్న పట్టుదలతో ప్రచారంతో దూసుకెళ్తున్నాయి. -
త్రిముఖ పోరు..ప్రచార జోరు
[ 04-05-2024]
ఓ వైపు ఎండలు మండుతున్నప్పటికీ.. మరో వైపు విజయమే లక్ష్యంగా నేతలు ప్రచారాన్ని ఉద్ధృతం చేశారు. -
ఆరు గ్యారంటీల పేరుతో మోసం: హరీశ్రావు
[ 04-05-2024]
ఆరు గ్యారంటీల పేరుతో అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసగించినట్లు మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. -
పార్టీలు మారే వారికి ఓటెయొద్దు: రాజాసింగ్
[ 04-05-2024]
పార్టీలు మారే వారికి ఓటెయ్యవద్దని, ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుకైన భాజపా అభ్యర్థి రఘునందన్రావును గెలిపించాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. -
దుబ్బాకలో లోకల్ దారి
[ 04-05-2024]
నియోజకవర్గంలోని ఓటర్లందరినీ ఒకేరకమైన హామీతో ప్రసన్నం చేసుకోవాలనుకుంటే కొంత ఇబ్బందే. -
పెళ్లి రోజే అనంత లోకాలకు
[ 04-05-2024]
ద్విచక్రవాహనాలు ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన జగదేవపూర్ మండలం తీగుల్లో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
అన్న వచ్చాడు.. బ్యాంకులో పింఛన్లు బంద్!
-
ముందు మీరు రాయ్బరేలీలో గెలవండి.. రాహుల్కు సలహా ఇచ్చిన చెస్ దిగ్గజం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!