logo

లారీని ఢీకొట్టిన కారు.. మంటలు చెలరేగి ఒకరు సజీవదహనం

సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది.  ముత్తంగి ఔటర్‌ రింగు రోడ్డు వద్ద ఆగి ఉన్న లారీని.. సుల్తాన్‌పూర్ వైపు నుంచి వచ్చిన కారు వెనుక నుంచి ఢీకొట్టింది.

Updated : 25 Apr 2024 09:45 IST

పటాన్‌చెరు: సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ముత్తంగి ఔటర్‌ రింగు రోడ్డు వద్ద ఆగి ఉన్న లారీని.. సుల్తాన్‌పూర్ వైపు నుంచి వచ్చిన కారు వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. లారీ డ్రైవర్‌ అప్రమత్తమై వెంటనే కిందికి దిగాడు. ఈ ఘటనలో కారులోని వ్యక్తి సజీవ దహనమయ్యాడు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలు ఆర్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని