తెలంగాణ గాంధీ కేసీఆర్: చింతా ప్రభాకర్
ప్రాణాల సైతం లెక్కచేయకుండా తెలంగాణ కోసం పోరాడిన కేసీఆర్ తెలంగాణ గాంధీ అని సంగారెడ్డి ఎమ్మెల్యే, భారాస జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ అన్నారు.
భారాస జిల్లా కార్యాలయంలో జెండా ఎగురవేస్తున్న సంగారెడ్డి ఎమ్మెల్యే ప్రభాకర్
ప్రాణాల సైతం లెక్కచేయకుండా తెలంగాణ కోసం పోరాడిన కేసీఆర్ తెలంగాణ గాంధీ అని సంగారెడ్డి ఎమ్మెల్యే, భారాస జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ అన్నారు. భారాస ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కందిలోని జిల్లా కార్యాలయ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అమలుకు సాధ్యం కాని హామీలిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. భారాస లోక్సభ అభ్యర్థి వెంకట్రాంరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. లోక్సభ ఎన్నికల్లో మెదక్ గడ్డపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. జిన్నారం మండలం గడ్డపోతారంలో జిన్నారం, గుమ్మడిదల, ఐడీఏ బొల్లారం పురపాలికల్లో నిర్వహించిన భారాస ఆవిర్భావ దినోత్సవం, కార్యకర్తల సమావేశాల్లో పాల్గొని మాట్లాడారు. జహీరాబాద్లో భారాస ఆవిర్భావ దినోత్సవాన్ని శ్రేణులు ఘనంగా నిర్వహించారు. స్థానికంగా నిర్వహించిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కె.మాణిక్రావు, నియోజకవర్గ సమన్వయకర్త దేవీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
న్యూస్టుడే, కంది, జిన్నారం, జహీరాబాద్
మాట్లాడుతున్న పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రామ్తో నెట్ఫ్లిక్స్ వెబ్సిరీస్?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!