కుటుంబ పాలనను తరిమికొట్టాలి
ఉమ్మడి నల్గొండ జిల్లాకు మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి కుటుంబాలతో పాటూ జానారెడ్డి కుటుంబం చేసిందేమీ లేదని కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి విమర్శించారు.
భాజపా నామినేషన్ ర్యాలీలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి
నల్గొండలో మాట్లాడుతున్న కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి చిత్రంలో పార్టీ ఎంపీ అభ్యర్థి సైదిరెడ్డి,
జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్రెడ్డి, తదితరులు
ఈనాడు, నల్గొండ - న్యూస్టుడే, నీలగిరి : ఉమ్మడి నల్గొండ జిల్లాకు మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి కుటుంబాలతో పాటూ జానారెడ్డి కుటుంబం చేసిందేమీ లేదని కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి విమర్శించారు. ఇక్కడి కుటుంబ రాజకీయాలను ఎన్నికల్లో ఓడించి తరమికొట్టాలని పిలుపునిచ్చారు. భాజపా అభ్యర్థి సైదిరెడ్డికి మద్దతుగా నల్గొండలో సోమవారం నిర్వహించిన నామినేషన్ ర్యాలీకి ఆయన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుతో పాటుగా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గడియారం చౌరస్తాలో నిర్వహించిన రోడ్షోలో ఆయన మాట్లాడారు.‘‘ సీఎం రేవంత్ మాటలు తప్ప చేసిందేమీ లేదు. రాహుల్గాంధీకి, మోదీకి పోటీ ఉందా? కేంద్రంలో మరోసారి భాజపా జెండా ఎగరడం ఖాయం. మూడోసారి మోదీ ప్రధాని కావడం ఖాయం. యువతకు, మహిళలకు ఉపాధి కల్పించే విధంగా మోదీ పాలన సాగుతోంది. భాజపా ప్రజాప్రతినిధులు లేకున్నా ఈ ప్రాంతానికి మోదీ రహదారులు ఇచ్చారు. ఇక్కడ ఏదైనా అభివృద్ధి జరిగింది అంటే కేవలం అది ప్రధాని మోదీ హయాంలోనే’’నన్నారు. భాజపా అభ్యర్థి సైదిరెడ్డి మాట్లాడుతూ తనను గెలిపిస్తే నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతామన్నారు. కేంద్రంలో భాజపా అధికారంలోకి వస్తే వ్యవసాయంపై ఆధారపడిన ఉమ్మడి నల్గొండలో పారుతున్న కృష్ణా నదితో ఇతర నదులను అనుసంధానం చేసి ఇక్కడ నీటి సమస్య లేకుండా చూస్తామన్నారు. జిల్లాకు అవసరమయ్యే ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను తీసుకొస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్, భారాస మాటలను ప్రజలు నమ్మడం లేదని...ఆ పార్టీలు చేసిన మోసాలను గుర్తించి భాజపా వైపు చూస్తున్నారన్నారు.
భారీ ర్యాలీ..
నల్గొండలో నిర్వహించిన సభలో పాల్గొన్న భాజపా నాయకులు, కార్యకర్తలు
నామినేషన్ కార్యక్రమం సందర్భంగా కేంద్ర మంత్రి కిరణ్రిజిజు, ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, పార్టీ అభ్యర్థి సైదిరెడ్డితో పాటూ నాయకులు సోమవారం సాయంత్రం నల్గొండ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మర్రిగూడ బైపాస్లో ఉన్న లక్ష్మి గార్డెన్ నుంచి గడియారం చౌరస్తా వరకు రోడ్షో చేసిన నాయకులు అనంతరం ప్రసంగించారు. మహిళలు, యువతులు కోలాటం ఆడుతూ ర్యాలీకి స్వాగతం పలికారు. భాజపా అభ్యర్థికి మద్దతుగా ఎంఆర్పీఎస్ నాయకులు ర్యాలీలో పాల్గొన్నారు. అంతకుముందు భాజపా అభ్యర్థి సైదిరెడ్డి తన రెండోసెట్ నామినేషన్ను పార్లమెంటు రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందనకు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు, జిల్లా పార్టీ అధ్యక్షుడు వర్షిత్రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీనివాస్గౌడ్, పార్లమెంటు కో కన్వీనర్ రామరాజు యాదవ్తో కలిసి సమర్పించారు. రోడ్షోలో భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కన్మంతరెడ్డి శ్రీదేవి రెడ్డి, గోలి అమరేందర్రెడ్డి, గార్లపాటి జితేంద్రకుమార్, బండారు ప్రసాద్, పోతేపాక సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అభివృద్ధి వివరిస్తూ.. నాయకులను విమర్శిస్తూ..!
[ 04-05-2024]
మునుగోడు నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛ అయిన చండూరును రెవెన్యూ డివిజన్ చేసింది కేసీఆరేనని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. -
టెయిల్పాండ్ మట్టిపై అక్రమార్కుల కన్ను!
[ 04-05-2024]
మిర్యాలగూడ నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో నుంచి ఇటుక బట్టీలు, పలు ప్రైవేట్ భూముల్లో నింపేందుకు అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు. -
నేత..ఆత్మీయత
[ 04-05-2024]
అభ్యర్థులు ఎన్నికల్లో గెలవాలంటే అన్ని వర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పోలింగ్ తేదీ మరో పదిరోజుల గడువు మాత్రమే ఉండటంతో అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. -
మరో సందడి షురూ..!
[ 04-05-2024]
లోక్సభ ఎన్నికలు మరో వారం రోజులుండగానే.. ఇటీవల ఖాళీ అయిన నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నిక సందడి మొదలైంది. -
పరిశ్రమల స్థాపనతో యువత, మహిళలకు ఉపాధి
[ 04-05-2024]
‘ లోక్సభ నియోజకవర్గ వ్యాప్తంగా ఆహారశుద్ధి పరిశ్రమలు, ఆటోమొబైల్ పరిశ్రమల స్థాపనకు అవకాశాలున్నా.. గతంలో ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహించిన ఎంపీలు పట్టించుకోలేదు. -
హృదయాన్ని తాకిన అక్షరం
[ 04-05-2024]
మునుగోడు మండలం కొరటికల్ గ్రామానికి చెందిన ఐతగోని రవి, మమత దంపతుల కుమార్తె ఆరుషి (18 నెలలు). వీరిది నిరుపేద కుటుంబం. -
కూటమి గెలుపునకు కృషి చేయాలి
[ 04-05-2024]
దేశంలో ఇండియా కూటమి గెలుపు కోసం మిత్రపక్షాలన్నీ కృషి చేయాలని సీపీఐ జాతీయ సమితి కార్యవర్గ సభ్యుడు పల్లా వెంకటరెడ్డి అన్నారు. -
భాజపాకు చోటివ్వొద్దు: బీవీ రాఘవులు
[ 04-05-2024]
లౌకికవాదానికి, అభివృద్ధి మార్గానికి పేరుగాంచిన తెలంగాణ రాష్ట్రంలో భాజపాకు చొటివ్వొద్దని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ప్రజలను కోరారు. -
పుస్తకాలు వస్తున్నాయ్..!
[ 04-05-2024]
పాఠశాలలు తిరిగి తెరిచే నాటికి పాఠ్యపుస్తకాలు, సారూప్య దుస్తులు అందించాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. -
తప్పుడు ప్రచారం మానుకోవాలి: చామల
[ 04-05-2024]
ప్రత్యర్థులు తనపై చేస్తున్న తప్పుడు ఆరోపణలు మానుకోవాలని భువనగిరి లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. పట్టణ శివారులో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
నారసింహుడి సన్నిధిలో ఊంజల్ సేవోత్సవం
[ 04-05-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో స్వయంభువులైన పంచనారసింహులకు శుక్రవారం నిత్యపూజలతో పాటు అమ్మవారిని ఆరాధిస్తూ ప్రత్యేక క్రతువులను ఆలయ ఆచారంగా నిర్వహించారు. -
దేశ విచ్ఛిన్నానికి మోదీ ప్రభుత్వ ప్రయత్నం: మంత్రి ఉత్తమ్
[ 04-05-2024]
దేశ విచ్ఛిన్నానికి మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. మేళ్లచెరువు, దొండపాడు, చిలుకూరులో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో ఆయన ప్రసంగించారు.