ప్రభుత్వంపై విమర్శ.. రైతులకు భరోసా
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సుయాత్ర చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దానిని ఉమ్మడి జిల్లా నుంచే ప్రారంభించడంతో.. భారాస నేతలు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు.
మిర్యాలగూడ రోడ్షోలో పిడికిలి బిగించి నినదిస్తున్న కేసీఆర్. చిత్రంలో కంచర్ల కృష్ణారెడ్డి, మాజీ మంత్రి జగదీశ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే భాస్కర్రావు
ఈనాడు, నల్గొండ - న్యూస్టుడే, మిర్యాలగూడ, భానుపురి: లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సుయాత్ర చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దానిని ఉమ్మడి జిల్లా నుంచే ప్రారంభించడంతో.. భారాస నేతలు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా ఆయన నాగార్జునసాగర్ ప్రాజెక్టు కేఆర్ఎంబీకి అప్పగించిన దానిపై విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్, మరో మంత్రి కోమటిరెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బస్సుయాత్రకు మిర్యాలగూడ పట్టణాన్ని గులాబీమయం చేశారు. మాజీ మంత్రి జగదీశ్రెడ్డి, స్థానిక మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు నాలుగు రోజులుగా కేసీఆర్ రోడ్షో ఏర్పాట్లను పర్యవేక్షించారు. పట్టణంలోని కూడళ్ళలో భారీ హోర్డింగ్లు, గులాబీ రంగు తోరణాలు ఏర్పాటు చేశారు. కేసీఆర్ బస్సు యాత్ర పొడవునా పూలు చల్లారు. రోడ్షో సాయంత్రం ఉన్నా ప్రజలు, కార్యకర్తలు మధ్యాహ్నం నుంచే గ్రామాల నుంచి ట్రాక్టర్లు, ఆటోలు, కార్లు, ప్రత్యేక బస్సుల్లో మిర్యాలగూడ, సూర్యాపేటకు చేరుకున్నారు. మహిళలు బోనాలతో, కళాకారులు గుస్సాడీ నృత్యాలు, డీజేలతో బస్సుయాత్రకు స్వాగతం పలికారు. మిర్యాలగూడలో పలు కూడళ్లలో కళాకారుల ఆటాపాటా ఏర్పాటు చేశారు. హనుమాన్పేట కూడలి నుంచి రాజీవ్ కూడలి వరకు ఎక్కడ చూసినా జన సందోహం కనిపించింది. పట్టణంలోని తెలంగాణ చౌరస్తా వద్ద గుస్సాడీ నృత్య కళాకారుల ప్రదర్శనలను వందలాది మంది తిలకించారు. రాజీవ్ కూడలి నాలుగువైపులా గుంపులుగా నిలిచిన ప్రజలకు కేసీఆర్ అభివాదం చేస్తూ ప్రసంగించారు. సుమారు గంట మిర్యాలగూడలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి 18 నిమిషాలు మాట్లాడారు. ప్రజలతో మమేకం కావడానికే తాను బస్సుయాత్ర చేస్తున్నట్లు ప్రకటించిన మాజీ ముఖ్యమంత్రి ఈ మేరకు మిర్యాలగూడ నుంచి సూర్యాపేట మార్గంలో వెళ్తూ పలు చోట్ల బస్సును ఆపి స్థానికులతో ముచ్చటించారు. కాంగ్రెస్ పార్టీ హామీలతో ప్రజలను మోసం చేసిందని...దీనిపై ఉద్యమిద్దామని భారాస అండగా ఉంటుందని ప్రజలకు భరోసానిచ్చారు.
నకిరేకల్: మాజీ సీఎం కేసీఆర్కు స్వాగతం పలుకుతున్న భారాస శ్రేణులు
ప్రజల కష్టాలు తీర్చేందుకే పోరుబాట: మాజీ మంత్రి జగదీశ్రెడ్డి
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలు పడుతున్న కష్టాలు తీర్చేందుకే కేసీఆర్ మరోసారి ‘ పోరుబాట’ బస్సుయాత్ర కార్యక్రమం చేపట్టారని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. నల్గొండ లోక్సభ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి తరఫున ప్రచారంలో భాగంగా మిర్యాలగూడ రాజీవ్ కూడలిలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాలు మనవారికి దక్కాలంటే అందుకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటే మార్గమని కేసీఆర్ ఉద్యమించారన్నారు. పదేళ్లలో తెలంగాణను అన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించారన్నారు.
మిర్యాలగూడలో కార్నర్ మీటింగ్కు హాజరైన జనం
అవీ...ఇవీ
- సాయంత్రం 6.18 గంటలకు కేసీఆర్ మిర్యాలగూడ హనుమాన్పేట కూడలికి బస్సులో రాక
- 6.51 వరకు హనుమాన్పేట కూడలి నుంచి బస్సులో రోడ్షోతో రాజీవ్కూడలికి తరలివచ్చారు.
- 6.54 గంటలకు కేసీఆర్ ప్రసంగం ప్రారంభించారు.
- టపాసులు ఆపాలని పలుమార్లు కేసీఆర్ చెబుతున్నా ఆపక పోవటంతో పోలీసులకు వినతి చేశారు.
- 7.12 గంటలకు కేసీఆర్ ప్రసంగం ముగిసింది.
- 8.55కి సూర్యాపేటకు చేరుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అభివృద్ధి వివరిస్తూ.. నాయకులను విమర్శిస్తూ..!
[ 04-05-2024]
మునుగోడు నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛ అయిన చండూరును రెవెన్యూ డివిజన్ చేసింది కేసీఆరేనని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. -
టెయిల్పాండ్ మట్టిపై అక్రమార్కుల కన్ను!
[ 04-05-2024]
మిర్యాలగూడ నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో నుంచి ఇటుక బట్టీలు, పలు ప్రైవేట్ భూముల్లో నింపేందుకు అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు. -
నేత..ఆత్మీయత
[ 04-05-2024]
అభ్యర్థులు ఎన్నికల్లో గెలవాలంటే అన్ని వర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పోలింగ్ తేదీ మరో పదిరోజుల గడువు మాత్రమే ఉండటంతో అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. -
మరో సందడి షురూ..!
[ 04-05-2024]
లోక్సభ ఎన్నికలు మరో వారం రోజులుండగానే.. ఇటీవల ఖాళీ అయిన నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నిక సందడి మొదలైంది. -
పరిశ్రమల స్థాపనతో యువత, మహిళలకు ఉపాధి
[ 04-05-2024]
‘ లోక్సభ నియోజకవర్గ వ్యాప్తంగా ఆహారశుద్ధి పరిశ్రమలు, ఆటోమొబైల్ పరిశ్రమల స్థాపనకు అవకాశాలున్నా.. గతంలో ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహించిన ఎంపీలు పట్టించుకోలేదు. -
హృదయాన్ని తాకిన అక్షరం
[ 04-05-2024]
మునుగోడు మండలం కొరటికల్ గ్రామానికి చెందిన ఐతగోని రవి, మమత దంపతుల కుమార్తె ఆరుషి (18 నెలలు). వీరిది నిరుపేద కుటుంబం. -
కూటమి గెలుపునకు కృషి చేయాలి
[ 04-05-2024]
దేశంలో ఇండియా కూటమి గెలుపు కోసం మిత్రపక్షాలన్నీ కృషి చేయాలని సీపీఐ జాతీయ సమితి కార్యవర్గ సభ్యుడు పల్లా వెంకటరెడ్డి అన్నారు. -
భాజపాకు చోటివ్వొద్దు: బీవీ రాఘవులు
[ 04-05-2024]
లౌకికవాదానికి, అభివృద్ధి మార్గానికి పేరుగాంచిన తెలంగాణ రాష్ట్రంలో భాజపాకు చొటివ్వొద్దని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ప్రజలను కోరారు. -
పుస్తకాలు వస్తున్నాయ్..!
[ 04-05-2024]
పాఠశాలలు తిరిగి తెరిచే నాటికి పాఠ్యపుస్తకాలు, సారూప్య దుస్తులు అందించాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. -
తప్పుడు ప్రచారం మానుకోవాలి: చామల
[ 04-05-2024]
ప్రత్యర్థులు తనపై చేస్తున్న తప్పుడు ఆరోపణలు మానుకోవాలని భువనగిరి లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. పట్టణ శివారులో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
నారసింహుడి సన్నిధిలో ఊంజల్ సేవోత్సవం
[ 04-05-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో స్వయంభువులైన పంచనారసింహులకు శుక్రవారం నిత్యపూజలతో పాటు అమ్మవారిని ఆరాధిస్తూ ప్రత్యేక క్రతువులను ఆలయ ఆచారంగా నిర్వహించారు. -
దేశ విచ్ఛిన్నానికి మోదీ ప్రభుత్వ ప్రయత్నం: మంత్రి ఉత్తమ్
[ 04-05-2024]
దేశ విచ్ఛిన్నానికి మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. మేళ్లచెరువు, దొండపాడు, చిలుకూరులో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో ఆయన ప్రసంగించారు.
తాజా వార్తలు (Latest News)
-
జగన్ను వెంటాడుతోన్న ఓటమి భయం..? తాడేపల్లి ప్యాలెస్లో వాస్తుమార్పులు!
-
అన్న వచ్చాడు.. బ్యాంకులో పింఛన్లు బంద్!
-
ముందు మీరు రాయ్బరేలీలో గెలవండి.. రాహుల్కు సలహా ఇచ్చిన చెస్ దిగ్గజం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు