నిఘా నేత్రం.. సమస్తం నిక్షిప్తం
సార్వత్రిక ఎన్నికల్లో ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిఘా వ్యవస్థను మరింత పటిష్ఠం చేసింది. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు సాంకేతికతను అందుబాటులోకి తెచ్చింది.
360 డిగ్రీల కెమెరాతో పర్యవేక్షణ
న్యూస్టుడే, నిజామాబాద్ అర్బన్
సార్వత్రిక ఎన్నికల్లో ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిఘా వ్యవస్థను మరింత పటిష్ఠం చేసింది. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు సాంకేతికతను అందుబాటులోకి తెచ్చింది. నగదు, మద్యం ఇతర వస్తువుల పంపిణీకి అడ్డుకట్ట వేసేందుకు ఇప్పటికే బృందాలను నియమించింది. కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి నియోజకవర్గాల్లో నిఘా బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రవేశపెట్టిన 360 డిగ్రీల కోణం కెమెరాల విధానాన్ని పార్లమెంటు ఎన్నికల్లోనూ వినియోగిస్తున్నారు.
రాష్ట్ర కార్యాలయానికి అనుసంధానం
నిఘా బృందాల వాహనాలకు 360 డిగ్రీల కోణం కెమెరాలు బిగించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వీటిని రూపొందించారు. ప్రతి నియోజకవర్గంలో తనిఖీ బృందాలకు ఈ వాహనాలు ఏర్పాటు చేశారు. వీటికి జియోట్యాగింగ్ ఏర్పాటు చేశారు. రాష్ట్ర, జిల్లా ఎన్నికల కార్యాలయాలకు అనుసంధానం చేశారు. ఆయా నియోజకవర్గంలో జరిగే ఘటనలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు వీక్షిస్తారు.
బృందాల ఏర్పాటు
నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గల్లో ప్రత్యేక నిఘా బృంధాలు పని చేస్తున్నాయి. పోలీసు, రెవెన్యూ, సహకార, ఇతర శాఖలను ఇందులో భాగస్వాములను చేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్లో పోలీసు అధికారి, ఒక వీడియోగ్రాఫర్, స్టాటిక్ సర్వైలెన్స్లో డిప్యూటీ తహసీల్దార్, పోలీసు, ఆబ్కారీ, అటవీ శాఖ సిబ్బంది ఉన్నారు. వీడియో సర్వైలైన్స్ బృందం ద్వారా వచ్చిన వీడియోలను వ్యూయింగ్ బృందం సభ్యులు నిశితంగా పరిశీలిస్తారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్(ఎంసీసీ) బృందంలో గెజిటెడ్ అధికారితో పాటు పోలీసు, వీడియోగ్రాఫర్ ఉంటారు. నియమావళి, ఉల్లంఘన, అభ్యర్థుల ప్రచారం, ఖర్చులపై వీరు నిఘా పెడతారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వృత్తి విద్యా కోర్సుల్లో దరఖాస్తుల ఆహ్వానం
[ 15-05-2024]
సెట్విన్ కింద వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు సెట్విన్ టీటీఐ తెలంగాణ ప్రభుత్వ కో-ఆర్డినేటర్ సయ్యద్ మొయిజుద్దీన్ ఒక ప్రకటనలో తెలిపారు. -
డీఎంహెచ్వోపై విచారణ
[ 15-05-2024]
ఆరోగ్య కేంద్రాల వైద్య అధికారులపై అనుచితంగా వ్యవహరించిన లక్ష్మణ్ సింగ్పై వైద్య శాఖ ఏడీ అమర్ సింగ్ బుధవారం విచారణ చేపట్టారు. -
విద్యార్థులు... విజ్ఞాన దీపికలు
[ 15-05-2024]
గిరిరాజ్ కళాశాల విద్యార్థులు పరిశోధనల్లో రాణిస్తున్నారు. ఇందూరు సాహిత్యం, చారిత్రక, పర్యాటక, ప్రజా సంక్షేమం విషయాల సేకరణ, క్షేత్ర పర్యటనలు వంటి అంశాల్లో రాణిస్తూ అబ్బురపరుస్తున్నారు. -
చివరి ఆయకట్టుకు నీరందించండి
[ 15-05-2024]
జిల్లాలోని ముఖ్యమైన ప్రాజెక్టుల్లో రామడుగు ఒకటి. ఈ ప్రాజెక్టు ఆయకట్టు ద్వారా ధర్పల్లి, డిచ్పల్లి, జక్రాన్పల్లి, భీంగల్, వేల్పూర్ మండలాల్లోని గ్రామాలకు రెండు పంటల నీరందిస్తున్నారు. -
ఈ గ్రామాలు ఆదర్శం
[ 15-05-2024]
లోక్సభ ఎన్నికల్లో కొన్ని గ్రామాలు ఆదర్శంగా నిలిచాయి. ఎన్నికల కమిషన్ ఎన్ని స్వీప్ కార్యక్రమాలు నిర్వహించినా కొన్ని గ్రామాల్లో సరాసరిగా 75 శాతం కంటే అధికంగా పోలింగ్ నమోదు కాలేదు -
ఆలోచన అదిరే!
[ 15-05-2024]
ఎండలు మండుతున్న తరుణంలో ద్విచక్రవాహనాలపై ప్రయాణమంటే భయపడాల్సిన పరిస్థితి. దీనికి ప్రత్యామ్నాయం ఆలోచించాడు పెద్దకొడప్గల్ మండలం వడ్లం గ్రామానికి చెందిన యువకుడు బోగేష్. ఈయన హైదరాబాద్లో ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తాడు. -
పైకి గాంభీర్యం.. లోలోన లెక్కలు
[ 15-05-2024]
నిజామాబాద్ లోక్సభ స్థానంలో విజయంపై ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. పోలింగ్ ముగిసి ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉండగా.. గెలుపుపై ఎవరికి వారు తమకు అనుకూలంగా చెప్పుకొంటున్నారు. -
ప్రవేశాల పెంపునకు కసరత్తు
[ 15-05-2024]
గురుకులాలు, కేజీబీవీలు, ఆదర్శ పాఠశాలల్ని కళాశాలలుగా ఆప్గ్రేడ్ చేయడంతో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకు విద్యార్థులు మొగ్గు చూపడం లేదని అధ్యాపకులు పేర్కొంటున్నారు. -
నేడు విచారణ
[ 15-05-2024]
కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి లక్ష్మణ్సింగ్ వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. -
ఆలస్యంగా కొనుగోళ్లు
[ 15-05-2024]
తల్లి బిడ్డలను కంటికి రెప్పలాగా ఎలా దాచుకుంటుందో.. అన్నదాతలు సైతం ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని కాపాడుకొని నానా అవస్థలు పడి కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తే లారీలు రాక వర్షానికి తడిసి ఎండిపోతుంటే పట్టించుకునే నాథుడే కరవయ్యారు. -
పెరిగిన ఓటింగ్తో ఉత్కంఠ
[ 15-05-2024]
హోరాహోరీగా సాగిన సార్వత్రిక సమరం ముగిసింది. జహీరాబాద్ లోక్సభ పరిధిలో 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 69.67 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఈ సారి 74.63 నమోదైంది. సుమారు ఐదుశాతం మేర పోలింగ్ పెరిగింది -
ఆమె కదిలింది
[ 15-05-2024]
లోక్సభ ఎన్నికల్లోనూ అసెంబ్లీ పోలింగ్ మాదిరిగానే ఓటర్లు పోటెత్తారు. నవంబరులో శాసనసభకు నిర్వహించిన ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఏడు స్థానాల్లో 12,39,568 ఓట్లు పోలయ్యాయి -
‘1.30 లక్షల మెజారిటీతో గెలుస్తాం’
[ 15-05-2024]
నిజామాబాద్ పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్ విజయం తథ్యమని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేశారు. -
ఉద్యోగిపై ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు
[ 15-05-2024]
విద్యుత్తు శాఖలో పనిచేసే ఉద్యోగి ఒక పార్టీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేశారనే విషయం ఆ శాఖలో గుప్పుమంటోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
సీఏఏ అమల్లోకి వచ్చాక తొలిసారి 14 మందికి భారత పౌరసత్వం
-
ఇలా చేయడం సరికాదు: ‘సెపరేషన్’ పోస్ట్ ట్రోల్స్పై జీవీ ప్రకాశ్
-
మూడు రోజుల వరుస లాభాలకు విరామం.. నష్టాల్లో సూచీలు
-
14 నెలల క్రితమే గుర్తించినా.. 14 మంది ప్రాణాలు పోయే వరకు..
-
జేసీ ప్రభాకర్రెడ్డికి అస్వస్థత.. సికింద్రాబాద్ కిమ్స్లో చికిత్స