logo

మోదీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

ప్రధాని మోదీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు యెండెలా లక్ష్మీనారాయణ అన్నారు.

Published : 29 Apr 2024 12:28 IST

బీర్కూర్‌ : ప్రధాని మోదీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు యెండెలా లక్ష్మీనారాయణ అన్నారు. బీర్కూర్‌లో మండల పార్టీ కార్యాలయంలో పలు పార్టీలకు చెందిన యువకులు ఆయన సమక్షంలో భాజపాలో చేరారు. వారికి ఆయన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జహీరాబాద్‌ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. బూత్‌ల వారీగా విస్తృత ప్రచారం చేయాలని నాయకులకు సూచించారు. ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షుడు నాగేళ్ల సాయికిరణ్‌, మండల నాయకులు యోగేశ్వర్‌, శ్రీనివాస్‌ మాధవ్‌ యాదవ్‌, తదితరులు ఉన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని