ఒకే కుటుంబం నుంచి అయిదుగురు ఎమ్మెల్యేలు
ఆదివాసీల కోసం కేటాయించిన పొట్టంగి నియోజకవర్గంలో పంగి కుటుంబం ఎక్కువసార్లు విజయం సాధించింది. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో ఆ కుటుంబం నుంచే ఎక్కువమంది ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించారు.
నియోజకవర్గంలో పంగి కుటుంబం రికార్డు
చంద్రమా శాంత (పాత చిత్రం), జయరామ్ పంగి, ప్రఫుల్ల కుమార్ పంగి
సిమిలిగడ, న్యూస్టుడే: ఆదివాసీల కోసం కేటాయించిన పొట్టంగి నియోజకవర్గంలో పంగి కుటుంబం ఎక్కువసార్లు విజయం సాధించింది. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో ఆ కుటుంబం నుంచే ఎక్కువమంది ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించారు. కొరాపుట్ జిల్లాలో పొట్టంగి ప్రాంతానికి చెందిన పంగి కుటుంబానికి తొలి నుంచే రాజకీయంలో మంచిపట్టుంది. 1957లో ఆ కుటుంబం నుంచి మలు శాంత మొదటిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిపొందారు. ఆయన స్ఫూర్తితో ముసురీ పంగి 1961లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి పొట్టంగి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తండ్రి ఆశయాలతో రాజకీయంపై ఆసక్తితో జయరామ్ పంగి జనతా పార్టీలో చేరి 1977లో ఎమ్మెల్యేగా గెలిచారు. 1990లో జనతాదళ్ అభ్యర్థిగా, 2000, 2024లో బిజద అభ్యర్థిగా పోటీచేసి జయరామ్ విజయం సాధించారు. 2009లో కొరాపుట్ ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయన మేనత్త చంద్రమా శాంత 1980, 1985లో పొట్టంగి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. జయరామ్ అన్న కుమారుడు ప్రఫుల్ల కుమార్ పంగి 2014లో గెలుపొందారు. జయరామ్ కుమారుడు అశోక్ కుమార్ పంగి కొరాపుట్ జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. రెండో కుమారుడు జగత్ జ్యోతి సమితి అధ్యక్షుడిగా, కుమార్తె అంబికా సమితి సభ్యురాలుగా పనిచేశారు. కుటుంబంలో ప్రతి ఒక్కరూ అధికారంలో ఉంటూ ప్రజాసేవ చేసిన అనుభవం ఉంది. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ ద్వారా జయరామ్ టికెట్ ఆశించినా ఫలితం లేకపోయింది. ప్రఫుల్లకు బిజద తరఫున అవకాశం లభించింది. పొట్టంగిలో పంగి కుటుంబం నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలుగా పనిచేశారు. 13 సార్లు జరిగిన ఎన్నికల్లో 9 సార్లు ఈ కుటుంబ సభ్యులే ఎమ్మెల్యేలుగా నెగ్గడం విశేషం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘బ్రహ్మపుర’ విజేత ఎవరు?
[ 04-05-2024]
ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రాతినిధ్యం వహిస్తున్న గంజాం జిల్లాలోని బ్రహ్మపుర లోక్సభ స్థానం ప్రతిష్ఠాత్మకమైంది. -
నేడు జయశంకర్, రేపు నడ్డా, ఎల్లుండి ప్రధాని మోదీ రాష్ట్రానికి రాక
[ 04-05-2024]
విదేశాంగ మంత్రి ఎస్.జయశంకర్ శనివారం రెండు రోజుల రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. -
ఉమ్మర్కోట్లో విజయం ఎవరిదో?
[ 04-05-2024]
గత ఐదేళ్ల క్రితం వరకు బిజదకు కంచుకోటైన ఉమ్మర్కోట్ నియోజకవర్గంలో ఈసారి ఎవరు విజయం సాధిస్తారోనని ఉత్కంఠ నెలకొంది. -
కాంగ్రెస్ విజయాన్ని ఏ శక్తి ఆపలేదు: భట్టి
[ 04-05-2024]
కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్రలు చేసి, పేద, బడుగు వర్గాల ప్రజల మనస్సులు దోచిన రాహుల్గాంధీ ప్రధాని కానున్నారని, కాంగ్రెస్ విజయాన్ని ఏ శక్తి ఆపలేదని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. -
సుజాతపై ఈసీ కొరడా
[ 04-05-2024]
మిషన్ శక్తి శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి సుజాత కార్తికేయన్ను ప్రజాసంబంధాలు లేని శాఖకు తక్షణం బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
బిజదలో చేరిన జనా సామల్
[ 04-05-2024]
ఒడియా సినీనటి, భాజపా నేత జనా సామల్ శుక్రవారం ఆ పార్టీని వీడి బిజదలో చేరారు. -
నీరివ్వరా?.. ఓటు వేయం
[ 04-05-2024]
గుక్కెడు నీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని రాయగడ సమితి లైలై పంచాయతీ ఖర్జీసాహి గ్రామస్థులు శుక్రవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. -
తెలుగులో ప్రచారం
[ 04-05-2024]
ఎన్నికల దగ్గర పడుతుండడంతో ప్రచారాల హోరు పెరిగింది -
చరవాణుల వెలుగులో అంత్యక్రియలు
[ 04-05-2024]
జయపురంలోని జయనగర్ ప్రాంతంలో ఉన్న భూత్నాధ్ శ్మశానంలో విద్యుత్తు దీపాలు లేకపోవడంతో చీకట్లోనే అంత్యక్రియలు జరుపుతున్న పరిస్థితి.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణలో భూవివాదం.. తెరపైకి ఏపీ మంత్రి బొత్స కుమారుడి పేరు
-
జగన్ను వెంటాడుతోన్న ఓటమి భయం..? తాడేపల్లి ప్యాలెస్లో వాస్తుమార్పులు!
-
అన్న వచ్చాడు.. బ్యాంకులో పింఛన్లు బంద్!
-
ముందు మీరు రాయ్బరేలీలో గెలవండి.. రాహుల్కు సలహా ఇచ్చిన చెస్ దిగ్గజం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్