logo

కేంద్రపడ బిజదలో భగ్గుమన్న అసంతృప్తి

పార్టీకి విధేయులుగా ఉన్నవారిని పక్కన పెట్టి ఫిరాయింపు నేతలకు ఎన్నికల బరిలో దించడంతో కేంద్రపడ జిల్లా బిజదలో అసంతృప్తి భగ్గుమంది.

Published : 23 Apr 2024 02:50 IST

పార్టీకి గీతాంజలి రాజీనామా.. భాజపాలో చేరిక

గీతాంజలిశెఠికి స్వాగతిస్తున్న భాజపా నేతలు

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: పార్టీకి విధేయులుగా ఉన్నవారిని పక్కన పెట్టి ఫిరాయింపు నేతలకు ఎన్నికల బరిలో దించడంతో కేంద్రపడ జిల్లా బిజదలో అసంతృప్తి భగ్గుమంది. సోమవారం జిల్లా జడ్పీ అధ్యక్షురాలు గీతాంజలిశెఠి పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి భాజపాలో చేరారు. ఆమె విలేకరులతో మాట్లాడుతూ... గతంలో ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ విలువలకు అద్దం పట్టేవారని, అంకితభావంతో పనిచేసే వారిని గౌరవించేవారని, ఇప్పుడా పరిస్థితి లేదని చెప్పారు. ఇలాంటి కారణాలతోనే నిన్నగాక మొన్న మాజీ ఎమ్మెల్యే సిప్రామల్లిక్‌ బిజదను వీడి కాంగ్రెస్‌ చెయ్యి అందుకున్న సంగతి తెలిసిందే. పీసీసీ ఉపాధ్యక్షునిగా ఉన్న గణేశ్వర బెహరా ఆ పార్టీని వీడి బిజదలో చేరడంతో ఆయనను సీఎం కేందప్రడ అసెంబ్లీ అభ్యర్థిగా చేయడాన్ని బిజద శ్రేణులు జీర్ణించుకోలేకపోయాయి. కాంగ్రెస్‌ వీడి వచ్చిన ఈయనకు అభ్యర్థి చేయడం, మాజీ మంత్రి శశిభూషణ్‌ బెహరాను పక్కన పెట్టడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని