థర్మల్ ఆందోళనకారులు గుర్తున్నారా జగన్?
అధికార కాంక్షతో పాదయాత్ర, ఎన్నికల సభల్లో జగన్ ‘మాట తప్పను.. మడమ తిప్పను’ అని పదే పదే చెప్పేవారు.
బీల జీవో రద్దు కాలేదు.. కేసులూ ఎత్తేయలేదు
రేపు, మాపని ఐదేళ్లూ సరి పెట్టేశారు
అధికార కాంక్షతో పాదయాత్ర, ఎన్నికల సభల్లో జగన్ ‘మాట తప్పను.. మడమ తిప్పను’ అని పదే పదే చెప్పేవారు. వైకాపా శ్రేణులు సైతం అన్న బాటలోనే నడిచి ప్రజలకు నచ్చజెప్పి ఓట్లు వేయించారు.. సారు గద్దెనెక్కిన తర్వాత హామీలు అమలు చేయకపోవడంతో కంగు తినడం సామాన్యుల వంతైంది. ఇదే అనుభవం థర్మల్ ఆందోళనకారులకూ ఎదురైంది.
న్యూస్టుడే, సోంపేట
థర్మల్ విద్యుత్తు కేంద్రం భూమిపూజ పనులను అడ్డుకోవడానికి వచ్చిన వారిని తరుముతున్న పోలీసులు (పాతచిత్రం)
‘కొద్ది రోజులు ఆగండి.. మనం అధికారంలోకి వస్తున్నాం. ‘బీల సమస్య పరిష్కరించి థర్మల్ ఆందోళనకారులపై పెట్టిన కేసులన్నీ ఎత్తేద్దాం. జీవో 329 రద్దు చేసి చిత్తడి నేలల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం’ అని జగన్ పాదయాత్రలో థర్మల్ వ్యతిరేక ఉద్యమకారులకు ఇచ్చిన హామీ నేరవేర్చకపోవడంతో బీల ప్రాంత ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు..
వైకాపా ప్రభుత్వానికి పట్టని రైతుల మొర
సోంపేట బీల ప్రాంతంలో థర్మల్ విద్యుత్తు కేంద్రం ఏర్పాటుకు 2008లో ఇక్కడ 973 ఎకరాలను కేటాయిస్తూ అప్పటి ప్రభుత్వం 1107 జీవో విడుదల చేసింది. కంపెనీ అదనంగా 600కు పైగా ఎకరాలను రైతుల నుంచి కొనుగోలు చేసింది. విశిష్ట చిత్తడి నేలలు కలిగిన బీలలో థర్మల్ విద్యుత్తు కేంద్రం ఏర్పాటు చేస్తే జీవవైవిధ్యం, పర్యావరణం, భూగర్భ జలాలకు ముప్పు ఏర్పడుతుందని.. వ్యవసాయం, కొబ్బరి తోటల సాగుకు సమస్యలు తలెత్తుతాయని ఈ ప్రాంత ప్రజలు ప్రాణాలొడ్డి పోరాడారు. సోంపేట కాల్పుల ఘటన తర్వాత 2010లో కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీ పలుమార్లు అధ్యయనం చేసి విశిష్ట చిత్తడి నేలలు కలిగిన ఈ ప్రాంతాన్ని సంరక్షించాల్సిన బాధ్యత ఉందని నివేదిక ఇచ్చింది.
తెదేపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడి ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తూ థర్మల్ విద్యుత్తు కేంద్రం అనుమతులు, 1107 జీవోను రద్దు చేసింది. ఆహార శుద్ధి, వ్యవసాయాధారిత పరిశ్రమల ఏర్పాటుకు వీలుగా 329 జీవో విడుదల చేసింది. ఈ ప్రాంత ప్రజలు, ఉద్యమకారులు కొత్త జీవోను వ్యతిరేకించారు. ఈలోగా పాదయాత్రకు వచ్చిన జగన్మోహన్రెడ్డి దృష్టికి ఉద్యమకారుల బృందం సమస్యను తీసుకెళ్లగా కొద్ది రోజులు ఆగితే జీవో రద్దు చేసుకుందామన్నారు. తరువాత పలుమార్లు ముఖ్యమంత్రిని కలిసినా ప్రయోజనం లేకపోయింది.
సామాన్యులు ప్రాణాలొడ్డి పోరాడింది ఈ బీల భూముల కోసమే
కేసులతో ఇబ్బందులు
- థర్మల్ విద్యుత్తు కేంద్రం భూమి పూజ పనులను అడ్డుకోవడానికి 2010 జులై 14న రైతులు, మత్స్యకారులు, ఇతర వర్గాల ప్రజలు పెద్దఎత్తున బీలకు తరలివచ్చారు.
- పెద్దఎత్తున్న ఆందోళన వ్యక్తం చేయడంతో పోలీసులు తుపాకులను ఎక్కుపెట్టారు. కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా 11 మంది గాయపడ్డారు. తరువాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. ఠీఛార్జిలో వెయ్యి మంది వరకు ప్రజలు తీవ్రంగా గాయపడి దీర్ఘకాలిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రజల చేతిలో 126 మంది పోలీసులు గాయపడ్డారు.
- 723 మంది ఆందోళనకారులపై పోలీసులు కేసులు పెట్టారు. అంతకు ముందు వివిధ ఘటనలకు సంబంధించి ఉద్యమ నాయకుల్లో ఒకొక్కరు 50 వరకు కేసులు ఎదుర్కొన్నారు.
- జులై 14 ఘటనకు సంబంధించిన కేసును నాన్చుతూ రావడంతో యువత, ఇతర వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ప్రాంత యువత ఉపాధి, ఉద్యోగాల కోసం ఇతర దేశాలకు వెళ్తుంటారు. థర్మల్ కేసుతో పాస్పోర్టు, ఇతర అంశాలకు సంబంధించిన అనుమతులు రాకపోవడంతో జీవనోపాధి కష్టంగా మారింది. 14 ఏళ్లుగా ఎటూ కదల్లేని పరిస్థితి నెలకొందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
హామీ ఇచ్చి విస్మరించారు..
బీల ప్రాంతానికి సంబంధించి 329 జీవో, ఆందోళనకారులపై పెట్టిన పోలీసు కేసు రద్దు చేస్తామని జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చి విస్మరించారు. ఆయనను పలుమార్లు కలిసి సమస్యను వివరించగా పరిశీలనలో ఉందని.. త్వరలో రద్దు అవుతుందని చెప్పారే తప్ప పరిష్కరించలేదు. యువత తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇతర దేశాల్లో ఉపాధి పొందడానికి కేసు ఆటంకంగా మారింది.
డాక్టర్ వై.కృష్ణమూర్తి, అధ్యక్షుడు, పర్యావరణ పరిరక్షణ సంఘం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎండలో మాడిస్తే.. మీ కళ్లు చల్లబడ్డాయా?
[ 03-05-2024]
మాది గార మండలం తూలుగు పంచాయతీ జాఫ్రాబాదు గ్రామం. ఆటోలో 7 కి.మీ. ప్రయాణించి ఎండలో గార మండల కేంద్రానికి వచ్చాం. బ్యాంకులో డబ్బులు ఇవ్వట్లేదు. -
పసుపు దండు ఉత్సాహం
[ 03-05-2024]
పాతపట్నం నియోజకవర్గంలో పసుపుదండు ఉత్సాహం ఉరకలెత్తింది.. ఏ దారి చూసినా పసుపు జెండాలే రెపరెపలాడాయి. -
దేవుడా.. ఇదేం పాలన..?
[ 03-05-2024]
నోరెత్తితే దేవుడి పేరు పలికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయిదేళ్ల పాలనలో ఆ భగవంతుడి ఆలనాపాలన సైతం పట్టించుకోలేదు.. -
మన్యం మౌన రోదన.. వినిపించలేదా జగనన్న..!
[ 03-05-2024]
అత్యవసరమైతే వారి కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఆసుపత్రికి వెళ్లాలంటే డోలీనే గతి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దేవుడి మీద భారం వేయాల్సిందే. ఇదీ జిల్లాలోని గిరిజన గ్రామాల్లో పరిస్థితి. ఇందుకు ప్రధాన కారణం ఆయా ప్రాంతాలకు సరైన రహదారి సౌకర్యాలు లేకపోవడం. -
ఏళ్లుగా అదే పరిస్థితి.. సాగు నీరందని దుస్థితి
[ 03-05-2024]
వజ్రపుకొత్తూరు, నందిగాం మండలాలను కలిపి ఉన్న వంశధార 60 ఆర్ఎల్ కాలువపై పలు చోట్ల సిమెంట్ పనులు పాడై కనీస మరమ్మత్తులకు నోచుకోవడంలేదు. -
కిడ్నీ రోగుల కుటుంబాలకు అండగా నిలవండి
[ 03-05-2024]
ఉద్దానంలో మూత్రపిండాల రోగులకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అండగా నిలవాలని ఇచ్ఛాపురం నియోజకవర్గ జనసేన సమన్వయకర్త దాసరి రాజు విజ్ఞప్తి చేశారు. -
చంద్రన్నతోనే సంక్షేమం
[ 03-05-2024]
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే గ్రామాల అభివృద్ధి జరిగిందని, వైకాపా పాలనలో విధ్వంసం చోటు చేసుకుందని తెదేపా నాయకులు తెలిపారు. -
ఒక్క రోడ్డయినా వేసినపాపాన పోలేదు
[ 03-05-2024]
ఇచ్ఛాపురం, పలాస పట్టణాల్లో రహదారులు అధ్వానంగా మారాయి. కీలక మార్గాలు ఛిద్రమై, గోతులతో నిండి ఉండడంతో ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. -
ఇసుక మూటలే.. కాంక్రీట్ గోడ..!
[ 03-05-2024]
ఎల్ఎన్పేట మండలంలో వంశధార నది వద్ద మెగా రక్షిత మంచినీటి పథకం బావుల నుంచి నీరు సరఫరా చేసే వంతెన శిథిలమైంది.
తాజా వార్తలు (Latest News)
-
భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదు: హైకోర్టు సంచలన తీర్పు
-
50 గంటల బ్యాటరీ లైఫ్తో నాయిస్ పాప్ బడ్స్.. ధర ఫీచర్లివే..!
-
ఆ ముగ్గురి వల్లే మేం గెలిచాం.. ప్రతి ఓవరూ సవాలే: ట్రావిస్ హెడ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
హెచ్డీ రేవణ్ణ, ప్రజ్వల్పై కిడ్నాప్, అత్యాచారం కేసులు..
-
పిఠాపురంలో పవన్కే జై.. ముద్రగడ కుమార్తె కీలక వ్యాఖ్యలు