పచ్చదనం గాలికొదిలేశారు.. ప్రజాధనం వృథా చేశారు..!
జగనన్న ఏలుబడిలో మొక్కలకూ రక్షణ కరవైంది. పచ్చదనాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో ఆర్భాటంగా ప్రారంభించిన ‘జగనన్న హరిత నగరాలు-గ్రీన్ సీటీ ఛాలెంజ్’ కార్యక్రమం ఆదిలోనే తుస్సుమంది.
లక్ష్యానికి దూరంగా జగనన్న హరిత నగరాలు..!
జగనన్న ఏలుబడిలో మొక్కలకూ రక్షణ కరవైంది. పచ్చదనాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో ఆర్భాటంగా ప్రారంభించిన ‘జగనన్న హరిత నగరాలు-గ్రీన్ సీటీ ఛాలెంజ్’ కార్యక్రమం ఆదిలోనే తుస్సుమంది. జిల్లాలోని పురపాలక సంఘాలు, శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో ప్రధాన రోడ్లు, కాలనీ రహదారులకు ఇరువైపులా గతేడాది ఆగస్టులో పెద్దఎత్తున మొక్కలు నాటారు. అవి ప్రస్తుతం చాలావరకు కనిపించడం లేదు. సంరక్షణ చర్యలను గాలికొదిలేయడంతో ప్రజాధనం వృథా అయింది. సుమారు 80 శాతం వరకు మొక్కల ఆనవాళ్లు లేకుండా పోయాయి.
న్యూస్టుడే, శ్రీకాకుళం నగరం, ఆమదాలవలస పట్టణం, పలాస, కాశీబుగ్గ, ఇచ్ఛాపురం
శ్రీకాకుళం
శ్రీకాకుళం నగరంలోని పలు ప్రాంతాల్లో రహదారులకు ఇరువైపులా 22 కి.మీ. మేర మొక్కలు నాటారు. రూ.1.68 కోట్ల వ్యయంతో 23 ప్యాకేజీలుగా విభజించి 14,187 మొక్కలు నాటారు. సంరక్షణ బాధ్యతను గుత్తేదారులు పట్టించుకోకపోవడంతో చాలా వరకు దెబ్బతిన్నాయి. చనిపోయిన మొక్కల స్థానంలో కొత్తవి నాటకున్నా నగరపాలక సంస్థ అధికారులు గుత్తేదారులకు బిల్లులు చెల్లించేశారు. ప్రస్తుతం చాలా చోట్ల మొక్కలు కనిపించడం లేదు. వాటికి దన్నుగా ఏర్పాటు చేసిన కర్రలు మాత్రమే దర్శనమిస్తున్నాయి. పీఎన్ కాలనీలో పరిస్థితిని చిత్రంలో చూడవచ్చు.
ఇచ్ఛాపురం
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్ఛాపురం పట్టణంలో నాలుగు చెరువు గట్లపై మొక్కలు నాటేందుకు రూ.5 లక్షలు చొప్పున కేటాయించారు. తీవ్ర వర్షాభావం, మొక్కలు సరఫరా చేయకపోవడంతో లక్ష్యం నెరవేరలేదు. తెదేపా హయాంలో పట్టణ వ్యాప్తంగా పలు వీధుల్లో మొక్కలు నాటారు. అవి చాలా వరకు వృక్షాలుగా ఎదిగి ప్రస్తుతం నీడనిస్తున్నాయి.
ఆమదాలవలస
ఆమదాలవలస పట్టణంలో ప్రధాన రహదారి, కృష్ణాపురం నుంచి పార్వతీశంపేట వరకు, మెట్టక్కివలస, సొట్టవానిపేట, గేదెలవానిపేట చెరువు గట్టు, తిమ్మాపురంలో ఎన్టీఆర్ కాలనీ, జగ్గుశాస్త్రులపేట, గేటు ప్రధాన రహదారి, తదితర ప్రాంతాల్లో సుమారు 600కుపైగా మొక్కలు నాటారు. సంరక్షణ కొరవడటంతో చాలా వరకు ఎండిపోయాయి. ఆమదాలవలస ప్రధాన రహదారి విభాగిని మధ్యలో ఎండిపోతున్న మొక్కలను ఈ చిత్రంలో చూడవచ్చు.
పలాస
ఈ చిత్రంలో కనిపిస్తున్నది పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘ పరిధిలోని ముత్యాలమ్మ కోనేరు. గతంలో ఇక్కడ నాటిన మొక్కలు ఇప్పుడు కనిపించట్లేదు. పురపాలిక పరిధిలోని పలు ప్రాంతాల్లో గతంలో సుమారు పది వేల మొక్కలు నాటారు. ఇందుకు రూ.1.70 లక్షలు ఖర్చు చేశారు. వాటికి నీరు పోసే బాధ్యతను ఎవరికీ అప్పగించకపోవడంతో చాలాచోట్ల ఆనవాళ్లు లేకుండాపోయాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉప్పొంగిన వనితోత్సాహం..!
[ 15-05-2024]
జిల్లా వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తారు. గత ఎన్నికల కంటే ఓటింగ్ శాతం పెరగడమే అందుకు నిదర్శనం. ఈసారి మహిళలు పెద్ద ఎత్తున ఓటేసేందుకు తరలి వచ్చారు. నేతల తలరాతలను నిర్ణయించడంలో వారి తీర్పే శాసనం కానుంది. పురుషుల కంటే వారి ఓట్లే ఎక్కువగా పోలయ్యాయి. -
గాలి కూటమి వైపే..!
[ 15-05-2024]
జిల్లా వ్యాప్తంగా సోమవారం అర్ధరాత్రి దాటే వరకు సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కొనసాగింది. పలుచోట్ల ఉద్రిక్తతల నడుమ ప్రక్రియ ముగిసింది. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో ఓటరు తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైంది.. అభ్యర్థులు ఫలితాల కోసం వేచి చూస్తున్నారు. -
మార్టులన్నారు.. మాట మార్చారు..!
[ 15-05-2024]
స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక స్వావలంబనకు మండలానికో మహిళా మార్టు ఏర్పాటు చేస్తామని గతంలో వైకాపా ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేసింది. ఆ తరువాత నియోజకవర్గానికి ఒకటేనని ప్రకటించింది. చివరకు పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన శ్రీకాకుళం, నరసన్నపేట నియోజకవర్గాల్లో మాత్రమే ఏర్పాటు చేసి ఊరుకుంది. -
తెదేపా కార్యకర్తపై దాడి
[ 15-05-2024]
మందస మండలం హరిపురంలో మంగళవారం తెదేపా కార్యకర్త కనగల రామారావుపై అదే గ్రామానికి చెందిన వైకాపా కార్యకర్త కర్ర అనిల్ దాడి చేశాడు. హరిపురంలోని 162 పోలింగ్ కేంద్రంలో రామారావు తెదేపా తరఫున ఏజెంటుగా ఉన్నారు. -
తెదేపాకు ఓటేశారని ఇంటికి తాళం
[ 15-05-2024]
తెదేపాకు ఓటేశారనే అక్కసుతో వైకాపా శ్రేణులు ఓ కుటుంబంపై కక్ష కట్టిన ఉదంతమిది. పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘం పరిధి చినబడాంకు చెందిన పి.మన్మధరావు భార్య సుజాతతో కలిసి ఓటు వేయడానికి విజయనగరం నుంచి వచ్చారు. -
తీర్పు భద్రం
[ 15-05-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లా ఓటర్ల తీర్పును ఎన్నికల అధికారులు భద్రపరిచారు. ఈవీఎంలు, వీవీప్యాట్లను ఎచ్చెర్ల మండలం చిలకపాలెం సమీపంలోని శ్రీ శివాని ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంల్లో మూడంచెల భద్రత నడుమ ఉంచారు. -
ముందే మేల్కొనకుంటే ముప్పే..!
[ 15-05-2024]
జాతీయ రహదారిలో లావేరు మండలం బుడుమూరు కూడలి సమీపంలో 2023 జూన్లో వ్యాన్ టైరు పేలి రోడ్డుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో విజయనగరం జిల్లా డెంకాడ మండలానికి చెందిన ముగ్గురు మృత్యవాత పడ్డారు. ఇందులో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. -
మోదీకి శుభాకాంక్షలు తెలిపేందుకు ప్రత్యేక వస్త్రం
[ 15-05-2024]
ప్రధానమంత్రి నరేంద్రమోదీ మూడోసారి పీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారని, ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు మోదీ, చంద్రబాబు, పవన్కల్యాణ్, లోకేశ్ ముఖ చిత్రాలతో ప్రత్యేక వస్త్రాన్ని తయారు చేస్తున్నట్లు లావేరు మండలంలోని వస్త్రపురికాలనీకి చెందిన బాసిన నాగేశ్వరరావు, లక్ష్మీ తెలిపారు. -
పాము కాటుకు యువకుడి బలి
[ 15-05-2024]
మండలంలోని పెద్దలవునిపల్లి గ్రామానికి చెందిన లఖినాన శివానందం (24) పాము కాటుకు గురై మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి భోజనాలు ముగిసిన తర్వాత శివానందం తల్లి పార్వతి, సోదరుడు పవన్ ఇంట్లో నిద్రపోయారు. అర్ధరాత్రి కట్ల పాము అతడిని కరిచింది. -
వైకాపా నేతలపై ఫిర్యాదు
[ 15-05-2024]
టెక్కలి పంచాయతీ కార్యాలయంలో సోమవారం ఎన్నికల సమయంలో జరిగిన ఘర్షణపై తెదేపా బూత్ ఏజెంట్ రెయ్యి ప్రీతిష్ చంద్ర టెక్కలి పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
మూడు రోజుల వరుస లాభాలకు విరామం.. నష్టాల్లో సూచీలు
-
14 నెలల క్రితమే గుర్తించినా.. 14 మంది ప్రాణాలు పోయే వరకు..
-
జేసీ ప్రభాకర్రెడ్డికి అస్వస్థత.. సికింద్రాబాద్ కిమ్స్లో చికిత్స
-
రఫాలో మాజీ సైన్యాధికారి మృతి.. భారత్కు ఐరాస క్షమాపణలు
-
400 సీట్లు గెలిస్తే.. భారత్లో పీవోకే విలీనం ఖాయం: హిమంత బిశ్వశర్మ
-
తుపాకీతో కాల్చుకొని.. సచిన్ సెక్యూరిటీగార్డు ఆత్మహత్య..!