బడిగంట మోగేది నేడే
మరికొద్ది గంటల్లో బడిగంట మోగనుంది. బడిఈడు పిల్లలతో పాఠశాలలన్నింటా పూర్వ సందడి నెలకొంటుంది. ఇప్పటికే ఉపాధ్యాయులు సర్కారు బడుల్లో సంసిద్ధతా కార్యక్రమాలను చేపడుతున్నారు. అరకొరగా వచ్చిన పాఠ్యపుస్తకాలను, జగనన్న విద్యాకానుక కిట్లను పంపిణీకి అందుబాటులో పెట్టుకున్నారు.
పాఠశాలల విలీనం.. ఉపాధ్యాయుల బదిలీలపై అస్పష్టతే
ఈనాడు డిజిటల్, అనకాపల్లి, న్యూస్టుడే, నక్కపల్లి
మరికొద్ది గంటల్లో బడిగంట మోగనుంది. బడిఈడు పిల్లలతో పాఠశాలలన్నింటా పూర్వ సందడి నెలకొంటుంది. ఇప్పటికే ఉపాధ్యాయులు సర్కారు బడుల్లో సంసిద్ధతా కార్యక్రమాలను చేపడుతున్నారు. అరకొరగా వచ్చిన పాఠ్యపుస్తకాలను, జగనన్న విద్యాకానుక కిట్లను పంపిణీకి అందుబాటులో పెట్టుకున్నారు. కొత్త విద్యా సంవత్సరంలో నూతన జాతీయ విద్యా విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అరకొరగానే.. : జిల్లాకు పాఠ్యపుస్తకాలు, జగనన్న విద్యాకానుక కిట్లు పూర్తిస్థాయిలో రాలేదు.. వచ్చిన వరకు మండల విద్యావనరుల కేంద్రాలకు తరలించారు. ఈ ఏడాది ప్రైవేటు పాఠశాలలకు ప్రభుత్వమే పాఠ్యపుస్తకాలను అమ్ముతోంది. దీనికోసం వారి నుంచి ముందే ఇండెంట్ తీసుకుంది. అయితే పాఠశాలలు తెరుచుకునే రోజు వచ్చినా ఇంకా 60 శాతం పుస్తకాల కొరత ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఎలాగో నెట్టుకొచ్చినా ప్రైవేటు పాఠశాలల్లో వెంటనే పుస్తకాలతో కుస్తీలు మొదలుపెట్టిస్తుంటారు. ఇప్పుడవి తగినన్ని లేకపోవడంతో పాత పుస్తకాలు ఎవరినైనా అడిగి తెచ్చుకోవాలని పిల్లలకు సూచిస్తున్నారు. జగనన్న విద్యాకానుక కిట్ల పరిస్థితి అంతే. 3.62 లక్షల మందికి ఈ ఏడాది కిట్లు పంపిణీ చేయాలి.. ఏకరూప దుస్తులు, బూట్లు 50 శాతం మందికి ఇంకా రాలేదు.
విలీనంపై ఆందోళనలు.. : గతేడాది 250 మీటర్ల దూరంలోని 147 పాఠశాలల్లో 3,4,5 తరగతులను విలీనం చేశారు. ఈ ఏడాది ఒక కిలోమీటరు దూరంలో ఉన్న పాఠశాలలను విలీనం చేయనున్నారు. అలాగే మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలను విలీనం చేసే ఆలోచన చేస్తున్నారు. ఇలా మొత్తం 479 పాఠశాలల వరకు మ్యాపింగ్ చేశారు. వీటిలో అనువైన వాటినే కలపాలని, మిగతా వాటిని యథావిధిగా నడపాలని భావిస్తున్నారు. ఇంతవరకు వాటిపై అధికారికంగా స్పష్టత ఇవ్వడం లేదు. ఈ విలీనంపై తల్లిదండ్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికే అనకాపల్లి, బుచ్చెయ్యపేట, చోడవరంలో ఆందోళనలు చేపట్టారు. చాలావరకు ఏ పాఠశాలను ఎక్కడ విలీనం చేస్తుంది ఇప్పటికీ తల్లిదండ్రులకు సమాచారం లేదు. పిల్లలను దూరంగా పంపించడానికి పునరాలోచనలో పడుతున్నారు.
గురువులు గరం..గరం..
జీవో నంబర్ 117 ప్రకారం క్రమబద్ధీకరణ చేస్తే ఉమ్మడి జిల్లాలో సుమారు 1500 పోస్టులు మిగిలిపోతాయి. 1:30 ప్రకారం ఇద్దరు ఉపాధ్యాయులున్న పాఠశాలల్లో ఒకరిని మిగులు చూపించి పోస్టు రద్దు చేయబోతున్నారు. అర్హత ఉన్నవారిని సబ్జెక్ట్ టీచర్లగా పదోన్నతి కల్పిస్తామని చెబుతున్నారు. ఎప్పుడు చేసేది స్పష్టం చేయడం లేదు. సెలవుల్లో బదిలీలు చేపట్టాల్సింది పాఠశాలలు ప్రారంభమయ్యాక చేస్తే ఎలానని ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు పాఠశాలల నిర్వహణలో తమపై సచివాలయ సిబ్బందికి పెత్తనాన్ని ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
పండగ వాతావరణంలో..
ఇప్పటికే బడుల్లో సంసిద్ధత కార్యక్రమాలు చేపట్టాం. పండగ వాతావరణంలో విద్యార్థులకు ఆహ్వానం పలకబోతున్నాం. తొలిరోజు నుంచే జగనన్న విద్యాకానుక పంపిణీ మొదలవుతుంది. విద్యా ప్రమాణాలపై మొదటి నెల నుంచే పర్యవేక్షణ ఉంటుంది. పాఠశాలల విలీనం, మిగులు ఉపాధ్యాయుల జాబితాలు ఇంకా తుదిదశలో ఉన్నాయి. విద్యాబోధనకు ఇబ్బంది లేకుండా కార్యక్రమాలను చేపడతాం.
- లింగేశ్వరరెడ్డి, డీఈవో, అనకాపల్లి
ఏయే పాఠశాలలు విలీనమవుతున్నాయో ఇప్పటికీ తేల్చకపోవడం విద్యార్థుల తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. మరోవైపు జీవో నంబర్ 117 గురువుల్లో గందరగోళం సృష్టిస్తోంది. క్రమబద్దీకరణ పేరుతో ఎక్కడికి సర్దుబాటు చేస్తారో తెలియడం లేదంటున్నారు. ఈ నేపథ్యంలోనే సర్కారు బడి తలుపులు మంగళవారం తెరుచుకుంటున్నాయి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా పాదాలు.. విశాఖ నిండా దందాలు!!
[ 04-05-2024]
అధికారంలోకి రాగానే విశాఖలో జగన్ రుషికొండపై విధ్వంసం చేస్తే.. వైకాపా కార్పొరేటర్లు ఊరికే ఉంటారా? విలువైన ప్రాజెక్టులు..భూములు ముఖ్య నేతలు కొల్లగొడుతుంటే కార్పొరేటర్లు కళ్లు మూసుకుంటారా? అన్నకు మించిన దందాలకు తెగబడ్డారు. -
జననేతనన్నావు.. జలమేదీ జగన్?
[ 04-05-2024]
బటన్లు నొక్కే జగన్కు జనాల బాధలు పట్టడం లేదు. ఈ అయిదేళ్లలో తాగునీటి పథకాలకు పార్టీ రంగులు వేసి ప్రచారం చేసుకోవాలని చూశారు తప్ప ప్రజల గొంతు తడిపే ప్రయత్నమే చేయలేదు. వైకాపా పాలనలో గ్రామాల్లో కొత్తగా నీళ్ల కుండీలను నిర్మించిందీ లేదు. -
పేదల పొట్టకొట్టిన జగమొండి
[ 04-05-2024]
అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆకలితో ఉన్నవారి కడుపునింపడంలోనూ రాజకీయాలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్కే దక్కుతుంది. ఓపక్క పేదల పక్షపాతినని ఊదరగొడుతూనే మరోవైపు అదే పేదల పొట్టకొట్టారు. -
అభివృద్ధా.. విధ్వంసమా!!
[ 04-05-2024]
స్వర్ణాంధ్ర సాకార యాత్రలో భాగంగా శుక్రవారం నగరంలో బాలకృష్ణ రోడ్షో నిర్వహించారు. జాలారిపేట నుంచి మొదలైన రోడ్డు షో వెంకోజిపాలెం, డెయిరీ ఫాం కూడలి, రవీంద్రనగర్, చినగదిలి మీదుగా సాగింది. -
జగన్ సమర్పించు క్లాప్ దోపిడీ..!
[ 04-05-2024]
జగన్ ప్రభుత్వంలో దోపిడీ విధానాలు కోకొల్లలు. ఇంటింటి నుంచి చెత్తను సేకరించే క్లాప్ వాహనాల్లో కూడా వైకాపా కీలక నేతలు దండుకుంటున్నారు. -
సామాన్య భక్తులే లక్ష్యంగా..
[ 04-05-2024]
గత చందనోత్సవ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈసారి సామాన్య భక్తులందరికీ సులువుగా అప్పన్న నిజరూప దర్శనం కలిగేలా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణ తెలిపారు. -
ఎంవీవీ కార్యాలయంలో తనిఖీల కలకలం
[ 04-05-2024]
విశాఖ తూర్పు నియోజకవర్గం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ కార్యాలయంలో ఎన్నికల కమిషన్ బృందాలు ఆకస్మిక తనిఖీలు చేపట్టాయి. -
‘సీబీసీఎన్సీ’ ధూళి ప్రమాదకరం..!
[ 04-05-2024]
నగరం నడిబొడ్డున ఉన్న సీబీసీఎన్సీ (ది కన్వెన్షన్ బాప్టిస్ట్ చర్చ్ ఆఫ్ ది నార్తన్ సర్కార్స్)లో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ చేపడుతున్న భారీ గృహ నిర్మాణ ప్రాజెక్టులో గృహాలు, ఇతర ఆస్తులను కొనుగోలు చేసి మోసపోవద్దని సీబీసీఎన్సీ ప్రతినిధి దాసరి యాకోబ్ తాడేపల్లి పత్రికా ప్రకటన ఇచ్చారు. -
చందనోత్సవ టికెట్ల విక్రయాలకు శ్రీకారం
[ 04-05-2024]
ఈనెల 10వ తేదీన చందనోత్సవం సందర్భంగా అప్పన్న స్వామి నిజరూప దర్శన టికెట్ల విక్రయం శుక్రవారం నుంచి ప్రారంభించారు. సింహగిరిపై జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణ, దేవస్థానం ఈవో సింగల శ్రీనివాసమూర్తి, ఆర్జేసీ సుబ్బారావు సంబంధిత వెబ్సైట్ను ప్రారంభించారు. -
ప్రజా సహకారంతో కూటమి గెలుపు : శ్రీభరత్
[ 04-05-2024]
తెదేపా కూటమి గెలుపునకు అన్ని వర్గాలు సహకరించాలని విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ , గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు కోరారు. -
కూటమితో మెరుగైన పాలన : గణబాబు
[ 04-05-2024]
తెదేపా కూటమితో మెరుగైన పాలన అందుతుందని పశ్చిమ ఎమ్మెల్యే పి.గణబాబు అన్నారు. శుక్రవారం ఆయన 92వ వార్డు ఇందిరానగర్, గణేశ్నగర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
పేదలను వేధిస్తున్న సైకో జగన్
[ 04-05-2024]
పింఛన్ల కోసం బ్యాంకుల వద్ద పడిగాపులు కాసే వారి చిత్రాలను టీవీల్లో చూసి జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నాడని ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ ఆరోపించారు. -
కూటమి ప్రభుత్వం రావడం ఖాయం
[ 04-05-2024]
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని పేట కూటమి అభ్యర్థిని వంగలపూడి అనిత అన్నారు. జల్లూరు, సుంకపూరు, బాపిరాజు కొత్తపల్లి, రామచంద్రపాలెం, సన్యాసిరాజుపాలెం, పాములవాక, బోడపాలెం తదితర గ్రామాల్లో శుక్రవారం కూటమి నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
జగనన్న జాగాలు.. జోరుగా బేరాలు
[ 04-05-2024]
వైకాపా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జగనన్న లేఅవుట్లలో ఇళ్ల స్థలాలు, జగనన్న కాలనీల్లో పక్కా ఇళ్ల క్రయవిక్రయాలు జోరుగా జరుగుతున్నాయి. -
పిల్లలను చదివించే బాధ్యత తీసుకుంటాం
[ 04-05-2024]
మీ ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం కింద ఏడాదికి రూ.15 వేలు ఇస్తూ వారిని చదివించే బాధ్యత తీసుకుంటామని ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, తెదేపా జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు పేర్కొన్నారు. -
అదనపు ఈవీఎంల ర్యాండమైజేషన్ పూర్తి
[ 04-05-2024]
విశాఖ లోక్సభ నియోజకవర్గ పరిధిలో అదనంగా వినియోగించనున్న ఈవీఎంల (సప్లిమెంటరీ) ర్యాండమైజేషన్ను శుక్రవారం పూర్తి చేశారు. -
సర్వీసు ఓటర్లకు ఆన్లైన్లో పోస్టల్ బ్యాలెట్
[ 04-05-2024]
విశాఖ జిల్లాకు చెందిన సర్వీసు ఓటర్లకు ఆన్లైన్లో పోస్టల్ బ్యాలెట్లను పంపారు. జిల్లాలోని ఏడు అసెంబ్లీ, ఒక లోక్సభ స్థానానికి ఈనెల 13న జరగనున్న ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య తేలింది. -
పోస్టల్ బ్యాలెట్ కోసం ఆరు కేంద్రాలు
[ 04-05-2024]
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు, సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు జిల్లాలో ఆరు ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశామని పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారిణి రోజారాణి పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
హైబ్రిడ్ పిచ్ల మీద ఐపీఎల్ మ్యాచ్లు... సరికొత్త ప్రయోగం ఫలిస్తుందా?
-
నడివీధిలో ఆమెను స్తంభానికి కట్టేసి..
-
తాడేపల్లిలో డ్రగ్స్.. గోప్యంగా ఉంచిన అధికారులు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జగనాసురుడి పన్నాగం.. పండుటాకుల విలాపం
-
హైదరాబాద్లో దారుణం.. పార్కింగ్ గొడవతో కక్షగట్టి ఏడాది తర్వాత హత్య