logo

జిల్లాలో 12,86,241 మంది ఓటర్లు

జిల్లాలో 12,86,241 మంది ఓటర్లు ఉన్నారని డీఆర్వో బి.దయానిధి పేర్కొన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.

Published : 20 Apr 2024 03:17 IST

కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జిల్లాలో 12,86,241 మంది ఓటర్లు ఉన్నారని డీఆర్వో బి.దయానిధి పేర్కొన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. డీఆర్వో మాట్లాడుతూ పురుషులు 6,25,861, మహిళలు 6,60,352, ఇతరులు 28 మంది ఉన్నారన్నారు. 2113 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. 278 మంది ఓటర్లు నివాసం మార్పు చేయాల్సి ఉందన్నారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు సహకరించాలన్నారు. ఎన్నికల విభాగం పర్యవేక్షకులు డి.రామ్మూర్తి, డి.టి.రవిబాబు, ఎస్‌.తులసీరామ్‌, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు  పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని