విద్యావెలుగులు.. అభివృద్ధి జిలుగులు
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో మంగళవారం మంత్రి కేటీఆర్ పర్యటన కోలాహలంగా సాగింది. రూ.49 కోట్లతో పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
సందడిగా సాగిన మంత్రి కేటీఆర్ పర్యటన
ఈనాడు, వరంగల్, కమలాపూర్, న్యూస్టుడే
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో మంగళవారం మంత్రి కేటీఆర్ పర్యటన కోలాహలంగా సాగింది. రూ.49 కోట్లతో పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, తాటికొండ రాజయ్య, వొడితెల సతీశ్బాబు, ఎమ్మెల్సీలు కూర రఘోత్తంరెడ్డి, కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు, సీపీ రంగనాథ్, హనుమకొండ జడ్పీ ఛైర్మన్ డాక్టర్ సుధీర్కుమార్, కరీంనగర్ జడ్పీ ఛైర్పర్సన్ విజయ, తెలంగాణ బీసీ కమీషన్ ఛైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్రావు, కార్పొరేషన్ ఛైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి, భారాస నాయకులు గెల్లు శ్రీనివాస్, ఎంజేపీ గురుకులా రాష్ట్ర కార్యదర్శి మల్లయ్యభట్టు, గురుకులా ఆర్సీవో రాంరెడ్డి, బాలుర పాఠశాల ప్రిన్సిపల్ మల్లయ్య, బాలికల పాఠశాల ప్రిన్సిపల్ ప్రపుల్లాదేవి కమలాపూర్, గూడురు సర్పంచులు విజయ, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.
పర్యటన సాగిందిలా..
* ఉదయం 11.58 - హెలిప్యాడ్లో హెలికాప్టర్ దిగిన కేటీఆర్, మంత్రులకు ప్రజాప్రతినిధులు, అధికారులు స్వాగతం పలికారు.
* మధ్యాహ్నం 12.10 - భారీ సంఖ్యలో భారాస కార్యకర్తల మధ్య కేటీఆర్ రోడ్డు షో మొదలైంది. కోలాటాలు, బోనాలతో మహిళలు ఘన స్వాగతం పలికారు.
* 12.17 - ర్యాలీ కొద్దిగా ముందుకెళ్లగానే ఎన్ఎస్యూఐ కార్యకర్తలు కేటీఆర్ రోడ్డు షోను అడ్డుకునే ప్రయత్నం చేశారు. వీరిని పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు.
* 12.50 - తహశీల్దారు కార్యాలయం సమీపంలో వివిధ అభివృద్ధి పనులకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు.
* 1.03 - కుల సంఘాల భవన సముదాయాన్ని ప్రారంభించారు.
* 1.21 - గురుకుల పాఠశాలల భవనాల ప్రారంభోత్సవం జరిగింది.
* 1.46 - డిజిటల్ తరగతిని ప్రారంభించిన, విద్యార్థులతో కేటీఆర్ మాట్లాడారు.
* 1.58 - మంత్రుల చేతుల మీదుగా దళిత బంధు విజయగాథ పుస్తకం, సీడీ ఆవిష్కరించారు.
* 2.08 - విద్యార్థులతో కలిసి కేటీఆర్, మంత్రులు, అధికారులు సహపంక్తి భోజనం చేశారు.
* 3.27 - కమలాపూర్లో అన్ని కార్యక్రమాలు ముగించుకొని కేటీఆర్, మంత్రులు కారులో జమ్మికుంటకు బయలుదేరారు.
రాష్ట్రం వచ్చాక గురుకులాలు బాగుపడ్డాయి
మహాత్మా జ్యోతిబా ఫులే బీసీ సంక్షేమ గురుకులాలు తెలంగాణకే తలమానికమని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. బీసీ గురుకులాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1.60 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారన్నారు. మంత్రి కేటీఆర్ సూచన మేరకు బాలికల పాఠశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు.
సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్కు ఆదేశం
కస్తూర్బా విద్యాలయ ప్రత్యేకాధికారి చేరాల అర్చన, విద్యార్థినులు తమకు శౌచాలయాలు సరిపడా లేవని, హాస్టల్లోకి పాములు, తేళ్లు వస్తున్నాయని, డ్యుయల్ డెస్కు బెంచీలు లేవని మంత్రి కేటీఆర్కు వినతిపత్రం అందజేశారు. స్పందించిన మంత్రి కలెక్టర్, ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిని పిలిచి తక్షణమే కేజీబీవీ సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఎమ్మెల్సీ నిధులు మంజూరు చేయాలని సూచించారు.
భారీ బందోబస్తు
కేటీఆర్ పర్యటనలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్ భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు. సెంట్రల్ జోన్ డీసీపీ బారీ, ఏసీపీలు శివరామయ్య, శ్రీనివాస్, డేవిడ్రాజు, దేవేందర్రెడ్డి, రఘుచందర్లతోపాటు మొత్తం 8 మంది ఏసీపీలు, 20 మంది సీఐలు, 40 మంది ఎస్ఐలతోపాటు సుమారు 600 మంది పోలీసులు కేటీఆర్ పర్యటనకు కట్టుదిట్టమైన బందోబస్తు కల్పించారు.
రుచికరమైన భోజనం..
మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు.. ఎంజేపీ విద్యార్థులు సుమారు 1400 మందితో కలిసి భోజనం చేశారు. వివిధ రకాల రుచికరమైన వంటకాలు వడ్డించారు. భోజనంలో పాపడం, బాస్మతి భగార అన్నం, తెల్లటి అన్నం, చికెన్, వంకాయ, పాలకూర పప్పు, సాంబారు, బెండకాయ వేపుడు, పెరుగు, టమాటా పూదీన చట్నీ, కడ్డూ కీర్ (బాదం స్వీటు), వాటర్ బాటిల్ను సమకూర్చారు.
విద్యార్థులతో మమేకమై..
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో భారాస సభ ఉండడంతో కమలాపూర్లో కేటీఆర్ ఎలాంటి రాజకీయ ప్రసంగాలు చేయలేదు. విద్యార్థులతో మమేకమయ్యేందుకే అధిక ప్రాధాన్యం ఇచ్చారు. విద్యార్థుల యోగక్షేమాలు తెలుసుకున్నారు. వారితో సహపంక్తి భోజనం చేస్తూ ముచ్చటించారు.
* భోజనం చేస్తుండగా పై నుంచి డ్రోన్ చక్కర్లు కొడుతుండగా విద్యార్థులు ఆశ్చర్యంగా చూశారు. మీకు డ్రోన్ గురించి తెలుసా? అని కేటీఆర్ అడగ్గా 10వ తరగతి చదివే వినీత్నాయక్ బదులిస్తూ డ్రోన్ను పొలం పనుల్లో పిచికారీకి, ఫొటోలు తీయడానికి ఉపయోగిస్తారని చెప్పారు.
* మీ పాఠశాలకు ఏం కావాలని మంత్రి అడగ్గా, డిజిటల్ కంప్యూటర్ ల్యాబ్ కావాలని, చలికాలంలో చన్నీళ్ల స్నానం చేస్తున్నామని గీజర్లు కావాలని విద్యార్థులు కోరారు. వెంటనే ఆ ఏర్పాట్లన్నీ చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
* పాఠశాల ప్రారంభోత్సవం జరిగాక కేటీఆర్ డిజిటల్ తరగతులను పరిశీలించారు. అక్కడ కొందరు విద్యార్థులతో మాట్లాడుతూ పాఠశాలలో వసతులు ఎలా ఉన్నాయామ్మా, మీ అమ్మానాన్న అప్పుడప్పుడు వచ్చి వెళుతుంటారా? అంటూ 6వ తరగతి చదివే వంశికను అడగ్గా.. ఇక్కడ మాకు అన్ని వసతులు ఉన్నాయని, ఇంటి కన్నా ఇక్కడే బావుందని తెలిపింది.
రైతు బంధు అంటే తెలుసా?: ఎనిమిదో తరగతి చదివే ప్రవల్లికతో కేటీఆర్ మాట్లాడుతుండగా, తమది వ్యవసాయ కుటుంబం అని తెలిపింది. రైతు బంధు అంటే తెలుసా? అది ఎప్పుడు వస్తుంది? అంటూ కేటీఆర్ ఆమెను అడిగారు. ప్రవల్లిక బదులిస్తూ రైతుబంధు తమకు వస్తుందని, ఏడాదికి రెండు సార్లు ప్రభుత్వం ఇస్తుందని చెప్పడంతో ఆమెను అభినందిస్తూ ఇక్కడ చదువుకొని గ్లోబల్ స్థాయిలో ఉన్నత శిఖరాలు అందుకోవాలని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అనుమతి లేని క్లినిక్లు.. అర్హత లేకున్నా చికిత్సలు
[ 03-05-2024]
ఉమ్మడి వరంగల్లో వైద్యం వ్యాపారమైంది. నకిలీ వైద్యులు దీన్ని వ్యాపారంగా మలుచుకొని రూ.కోట్లు సంపాదిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా 75 శాతం నకిలీ వైద్యులు ప్రైౖవేటు మెడికల్ ప్రాక్టీషనర్స్, రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ క్లినిక్ల పేరిట చిన్నస్థాయి ఆసుపత్రులు నిర్వహిస్తున్నారు. -
వసతులు కల్పిస్తేనే పండగలా పోలింగ్
[ 03-05-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు మౌలిక సదుపాయాలు కల్పించాలని ఇప్పటికే భారత ఎన్నికల సంఘం జిల్లాల ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. -
ఎన్కౌంటర్లో చనిపోయింది సుష్మిత కాదా..!
[ 03-05-2024]
ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతంలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో తెలంగాణకు చెందిన ముగ్గురు మావోయిస్టులు మృతిచెందినట్లు వార్తలొచ్చాయి. వీరిలో హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం సూధన్పల్లికి చెందిన మావోయిస్టు దళ సభ్యురాలు తిక్క సుష్మిత -
పాత వారికి ప్రాధాన్యం.. కొత్త వారికి గౌరవం
[ 03-05-2024]
పార్టీలో మొదటి నుంచి పనిచేస్తున్న పాత వారికి ప్రాధాన్యం ఇస్తూనే.. ఇటీవల కాంగ్రెస్లో చేరిన వారిని గౌరవించుకుందామని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. -
మోదీ నాయకత్వంలో దేశం పురోగతి
[ 03-05-2024]
మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తోందని భాజపా ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్ అన్నారు. గురువారం రాత్రి ఐనవోలు మండల కేంద్రంలో నిర్వహించిన భాజపా కార్నర్ మీటింగ్లో కేంద్ర మాజీ మంత్రి పొన్ను రాధాకృష్ణన్తో కలిసి మాట్లాడారు. -
అమలుకు నోచని హామీలతో కాంగ్రెస్ మోసం
[ 03-05-2024]
అమలుకు నోచని హామీలతో మోసం చేసి.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఎవరూ నమ్మడం లేదని వరంగల్ లోక్సభ నియోజకవర్గ భారాస అభ్యర్థి డాక్టర్ సుధీర్కుమార్ అన్నారు. -
‘భాజపావి బ్లాక్మెయిల్ రాజకీయాలు’
[ 03-05-2024]
దేశంలో మరోసారి అధికారంలోకి రావడానికి భాజపా బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తోందని వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య విమర్శించారు. -
దేశం కోసం మరోసారి మోదీ..
[ 03-05-2024]
దేశం కోసం, ధర్మం కోసం మూడోసారి మోదీని ప్రధాని కావాలని ప్రజలు నిర్ణయించుకున్నారని, 400కు పైగా పార్లమెంటు స్థానాల్లో భాజపా గెలుపు ఖాయమని కామారెడ్డి ఎమ్మెల్యే టి.వెంకటరమణారెడ్డి, భువనగిరి లోక్సభ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బూరనర్సయ్య గౌడ్ అన్నారు. -
నేటి నుంచి ‘ఇంటి వద్ద ఓటింగ్’
[ 03-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ ఈ నెల 13న జరగనుంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు, 85 ఏళ్లపై బడిన ఓటర్లు, దివ్యాంగులు ఇంటి వద్దనే ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. -
ఎండలు బాబోయ్..
[ 03-05-2024]
జిల్లాలో రోజురోజుకు ఎండ దంచి కొడుతోంది. ఉదయం 8 గంటల నుంచే భానుడు ప్రతాపాన్ని చూపుతుండటంతో బయటకు వెళ్లలేని పరిస్థితి.. జన సంచారం లేక రోడ్లు, దుకాణాలు వెలవెలబోతున్నాయి. -
ఇంటి నుంచి ఓటుకు అర్హులు 866
[ 03-05-2024]
పోలింగ్ కేంద్రాలకు వెళ్లలేని వారు తమ ఓటు హక్కును తాము ఉన్నచోటనే వినియోగించుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం వివిధ వర్గాలవారికి అవకాశం కల్పించింది. -
టీ హబ్కు జబ్బు
[ 03-05-2024]
ములుగు జిల్లా ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన ‘టీ హబ్’కు జబ్బు చేసింది. సుమారు 20 రోజులుగా పరీక్షలు నిర్వహించడం లేదు. విద్యుత్తు సమస్య కారణంగా యంత్రాలు పనిచేయకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. -
అభ్యర్థులు నచ్చకపోతే.. నోటా
[ 03-05-2024]
రాజ్యాంగం కల్పించిన వజ్రాయుధం ఓటుహక్కు. ఓటరు తనకు నచ్చిన అభ్యర్థిని ఎన్నుకునేందుకు దీన్ని వినియోగిస్తారు. ఒకవేళ వారెవరూ నచ్చకుంటే నోటా (నన్ ఆఫ్ ద అబోవ్)ను సంధించొచ్చు. -
ఓట్ల గని ఎవరికో?
[ 03-05-2024]
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి.. రోజురోజుకు ఎన్నికల వేడి రాజుకుంటోంది.. రాష్ట్రానికి వెలుగులు నింపే సింగరేణి నల్లసూరీల ఓట్లు కూడా కీలకంగా మారనున్నాయి. వరంగల్, మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గాల పరిధిలో సింగరేణి కార్మిక ఓటర్లు ప్రభావం చూపనున్నారు. -
ఇంటి నుంచి ఓటుకు స్పందన కరవు
[ 03-05-2024]
ప్రతీసారి ఎన్నికల్లో వృద్ధులు.. దివ్యాంగులు అతికష్టం మీద పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయడం చూస్తుంటాం. అయితే గత శాసనసభ ఎన్నికల నుంచి ఇంటివద్దే ఓటువేసేందుకు వారికి ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించింది. -
పొదుపు సంఘాలకు సోలార్ ప్లాంట్ల నిర్వహణ
[ 03-05-2024]
ప్రభుత్వం నుంచి రుణాలు తీసుకొని చిరు వ్యాపారాలు నిర్వహిస్తున్న, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్న పొదుపు సంఘాల మహిళలు మరింత ఆర్థికంగా బలపడే విధంగా ప్రభుత్వాలు మరో అవకాశం కల్పించాయి. -
వల పన్నారు.. రూ.5 కోట్లకు ముంచారు!
[ 03-05-2024]
వరంగల్ నగరానికి చెందిన ఓ ఉద్యోగి అడ్డదారిలో భారీగా సంపాదించాలనుకున్నాడు. మరో ఇద్దరిని కలుపుకొని స్థానికంగా ఉండే ఓ బడా పత్తి వ్యాపారికి వల వేశారు. -
సెలవులో ఉద్యోగి.. కదలని దస్త్రాలు
[ 03-05-2024]
గ్రేటర్ వరంగల్ టౌన్ప్లానింగ్ విభాగం తీరు ఎవరికి వారే అన్నట్లుగా ఉంది. పెద్ద భవనాల అనుమతులు పెద్ద సార్లు, చిన్నాచితక భవనాల అనుమతులు కిందిస్థాయి అధికారులు చూస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ ముగ్గురి వల్లే మేం గెలిచాం.. ప్రతి ఓవరూ సవాలే: ట్రావిస్ హెడ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
హెచ్డీ రేవణ్ణ, ప్రజ్వల్పై కిడ్నాప్, అత్యాచారం కేసులు..
-
పిఠాపురంలో పవన్కే జై.. ముద్రగడ కుమార్తె కీలక వ్యాఖ్యలు
-
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
వివేకా హత్య కేసు.. సునీల్ యాదవ్, ఉదయ్కుమార్రెడ్డికి చుక్కెదురు