logo

ఏడుగురు అభ్యర్థులు.. 9 నామపత్రాలు

వరంగల్‌ పార్లమెంట్‌ స్థానానికి మంగళవారం ఏడుగురు అభ్యర్థులు 9 నామపత్రాలను రిటర్నింగ్‌ అధికారి ప్రావీణ్యకు సమర్పించారు.

Published : 24 Apr 2024 02:50 IST

వరంగల్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: వరంగల్‌ పార్లమెంట్‌ స్థానానికి మంగళవారం ఏడుగురు అభ్యర్థులు 9 నామపత్రాలను రిటర్నింగ్‌ అధికారి ప్రావీణ్యకు సమర్పించారు. హనుమకొండ జిల్లా హసన్‌పర్తికి చెందిన పోతరాజు నర్సింహరాజు, హనుమకొండ జిల్లా పరకాల మండలం రాజీపేటకు చెందిన కుమ్మరి కనకయ్య, వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటకు చెందిన కొంగర అనిల్‌కుమార్‌, వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట మండలం రామవరం గ్రామానికి చెందిన చిలుముల్ల సుజాత, వరంగల్‌ క్రిస్టియన్‌ కాలనీకి చెందిన పోగుల అశోక్‌ స్వతంత్ర అభ్యర్థులుగా నామపత్రాలను దాఖలు చేశారు. హనుమకొండ జిల్లా దేవన్నపేటకు చెందిన స్వతంత్ర అభ్యర్థి ఎల్లందుల శోభన్‌బాబు, ‘విదుతులై చిరుతైగల్‌ కట్చి’ పార్టీ అభ్యర్థిగా హనుమకొండ జిల్లా నడికూడ మండలం నార్లపూర్‌కు చెందిన మచ్చ దేవేందర్‌ రెండుసెట్ల చొప్పున నామపత్రాలను రిటర్నింగ్‌ అధికారికి సమర్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని