ఇల్లు ఇవ్వకుండా వాయిదాలు కట్టాలా?..టిడ్కో లబ్ధిదారుల్లో అయోమయం
పాలకొల్లు పట్టణాల్లో తొలివిడతగా కొందరికి ఫ్లాట్లు కేటాయించారు. అక్కడ ఎటువంటి వసతులు కల్పించకపోగా బ్యాంకుల నుంచి వాయిదాల చెల్లింపునకు ఒత్తిళ్లు కొనసాగిస్తున్నాయి.
పాలకొల్లు, భీమవరం పట్టణం,తాడేపల్లిగూడెం, భీమవరం, పాలకొల్లు పట్టణాల్లో తొలివిడతగా కొందరికి ఫ్లాట్లు కేటాయించారు. అక్కడ ఎటువంటి వసతులు కల్పించకపోగా బ్యాంకుల నుంచి వాయిదాల చెల్లింపునకు ఒత్తిళ్లు కొనసాగిస్తున్నాయి. ఆయా పట్టణాల్లో నిర్మాణం పూర్తికాని ఫ్లాట్లను కూడా లబ్ధిదారులకు కేటాయిస్తూ పట్టాలు పంపిణీ చేయడం గమనార్హం.
భీమవరం పట్టణానికి చెందిన ఒక లబ్ధిదారు టిడ్కో ఇంటి కోసం రూ.లక్ష చెల్లించారు. ఆరేళ్లయినా టిడ్కో సముదాయంలో ఫ్ల్లాట్ కేటాయించలేదు. నెలకు రూ.4,500 చొప్పున ప్రతి నెలా వాయిదా చెల్లించాలని బ్యాంకు నుంచి తాఖీదులు అందాయి. ఇదేమిటంటూ మరికొందరితో కలిసి బ్యాంకుకు వెళ్లా. అద్దె ఇంటికి ఇప్పటికే రూ.7 వేలు చెల్లిస్తున్నా, ఫ్లాట్ ఇవ్వకపోగా వాయిదా కట్టమంటే ఎలా అని ప్రశ్నించా. దీంతో అధికారులు కొంత వెనక్కి తగ్గారు.
* జంగారెడ్డిగూడెంలో 864 ఇళ్లకు 456 మందికి రుణాలు ఇచ్చారు. అప్పట్లో ఇళ్లు పూర్తి కానందున 2023 డిసెంబరు వరకు వాయిదాలు చెల్లించాల్సిన అవసరం లేకుండా రెండేళ్లు మినహాయింపు ఇచ్చారు. ఈ గడువు ప్రస్తుతం పూర్తయింది. వీరిలో పలువురికి వాయిదాలు చెల్లించాలంటూ బ్యాంకుల నుంచి తాఖీదులు అందుతున్నాయి. ఇప్పటికే అద్దె ఇళ్లలో ఉంటున్న తమను వాయిదాలు కూడా కట్టమనడం ఎంత వరకు సమంజసమని లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు.
జంగారెడ్డిగూడెం, న్యూస్టుడే: ఉమ్మడి జిల్లాలో టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల పరిస్థితి దయనీయంగా మారింది. కొన్నిపట్టణాల్లో గృహ సముదాయాల నిర్మాణం పూర్తికాలేదు. పూర్తయిన చోట్ల కూడా కొందరికి ఫ్లాట్లు కేటాయించలేదు. చాలీచాలని అద్దె ఇళ్లలో వారు కాలం గడుపుతున్నారు. కానీ వారి పేరిట రుణాలు మంజూరు చేయడంతో వాయిదాలు చెల్లించాలంటూ బ్యాంకులు ఒత్తిడి చేస్తున్నాయి. ఇళ్లలోకి వెళ్లకుండా ఎలా చెల్లించేదని లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు.
పాలకొల్లులో 6,400 గృహాలకు 6 వేల మందికి ఇంటి రుణాలు మంజూరు చేశారు. వీటిలో ఇప్పటి వరకు 1,800 మందికి ఇళ్లు అప్పగించారు. వీళ్లను వాయిదాలు కట్టమంటూ ఒత్తిడి చేస్తున్నారు. చెల్లించని పక్షంలో ఇళ్లు వేలం వేస్తామంటూ హెచ్చరికలు చేస్తున్నారు. మిగిలిన ఇళ్ల నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. వీటిని కేటాయించిన లబ్ధిదారులకు సైతం వాయిదాలు చెల్లించాలని బ్యాంకుల నుంచి వేధింపులు మొదలయ్యాయి.
రూ.3 వేల వాయిదా
టిడ్కో ఇళ్లకు సంబంధించి నెలకు రూ.3 వేల చొప్పున వాయిదాలు చెల్లించాలంటూ చాలా కాలంగా మాకు బ్యాంకు నుంచి ఫోన్లు వస్తున్నాయి. ఇటీవల నా భార్య పార్వతికి స్టెంట్ వేసిన సమయంలోను ఒత్తిడి చేశారు. మాకు బీ 6 బ్లాక్లో జి4 ఫ్లాట్ కేటాయించారు. అక్కడికి వెళితే కాపలాదారులు కనీసం ఫ్లాట్ చూడనివ్వలేదు.
-నాయుడు కొండయ్య, జంగారెడ్డిగూడెం
బ్యాంకులో వేస్తే మాయం
నాకు గతంలో జగనన్న కాలనీలో ఇంటి పట్టా ఇచ్చారు. అనంతరం టిడ్కో గృహ సముదాయంలో ఖాళీలు ఉన్నాయని చెప్పి ఇంటిపట్టా వెనక్కి తీసుకొని సింగిల్ బెడ్ రూమ్ కేటాయించారు. బ్యాంకులో నాతో రుణ ఖాతా తెరిపించారు. ఎప్పుడు డబ్బులు డిపాజిట్ చేసినా నగదు కట్ అయిపోతోంది. దీంతో ఆ ఖాతాలో డబ్బులు వేయడం మానేశాం.
-డోకల లక్ష్మి, లబ్ధిదారు, జంగారెడ్డిగూడెం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విధ్వంస వేటు
[ 12-05-2024]
గోదావరి సవ్వళ్లు.. ప్రశాంతతకు మారుపేరైన పల్లెలు.. ఆత్మీయతకు రూపమైన పురాలు... ఉమ్మడి పశ్చిమ గోదావరి పేరెత్తగానే రాష్ట్రంలోని ప్రజల మదిలో మెదిలే భావాలివి.. కానీ, అయిదేళ్ల జగన్ పాలనలో జిల్లాలో దాడులు పెరిగిపోయాయి. -
రాష్ట్రానికి జీవనాడి.. పథకాలు ఎడారి
[ 12-05-2024]
అపార జలవనరులు ఉన్న ఏలూరు జిల్లా రాష్ట్రానికి జీవనాడి అయ్యే అవకాశాలు ఉన్నా, వైకాపా సర్కారు నిర్లక్ష్యంతో ఆ జలాలు వృథాగా సముద్రం పాలవుతున్నాయి. -
ముమ్మాటికీ.. జగనాసుర మార్గాలే!
[ 12-05-2024]
ఏ దేశంలోనైనా ప్రగతికి చిహ్నాలు మార్గాలే.. ఆర్థిక అభ్యున్నతికి ఊపిరినివ్వాల్సిన మార్గాలు జగన్ ఏలుబడిలో బలిపీఠమెక్కాయి. -
రైతుల కంట్లో కారం.. వైకాపా నేతలకు ‘సహకారం’
[ 12-05-2024]
అయిదేళ్ల వైకాపా సర్కారు పాలనలో సహకార వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయింది. వ్యవస్థలోని లొసుగులను ఆసరాగా చేసుకొని ప్రజా సొమ్మును స్వాహా చేయడంలో సిద్ధహస్తులైన అధికార పార్టీ నేతల కారణంగా అవినీతి ఊబిలో కూరుకుపోయాయి. -
జగన్ వస్తే...జనం అల్లాడాల్సిందే!
[ 12-05-2024]
మండుటెండ..విపరీతమైన ఉక్కపోత...గంటల కొద్దీ నిరీక్షణతో శనివారం కైకలూరులోని సీఎం జగన్ సభకు వచ్చిన ప్రజలు నరకయాతన అనుభవించారు. -
బాకాలూదుకోవడమే
[ 12-05-2024]
కైకలూరులో సీఎం జగన్ శనివారం నిర్వహించిన సిద్ధం సభలో ఆద్యంతం పథకాల గురించి ఊదరకొట్టారు. -
ఈ చట్టం మనకొద్దు
[ 12-05-2024]
వైకాపా సర్కారు తెచ్చిన భూహక్కు చట్టం ప్రతుల నకళ్లను నరసాపురం ఎంపీ, తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు పెద అమిరంలోని తన నివాసం వద్ద శనివారం సాయంత్రం దహనం చేసి నిరసన తెలిపారు. -
జగన్కు ఓటేస్తే మళ్లీ చీకటి రోజులు
[ 12-05-2024]
నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేయలేని సీఎం జగన్ అయిదేళ్లలో 12 సార్లు ఛార్జీలు పెంచి చీకట్లు మిగిల్చారని వైకాపాకు ఓటేస్తే మళ్లీ చీకటి రోజులు వస్తాయని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. -
క్లీన్ స్వీప్ చేయబోతున్నాం
[ 12-05-2024]
ఏలూరు పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో క్లీన్ స్వీప్ చేయబోతున్నామని తెదేపా, జనసేన, భాజపా కూటమి ఎంపీ అభ్యర్థి పుట్టా మహేశ్ కుమార్ యాదవ్ అన్నారు. -
ఓట్ల వేటకు కోట్లు గుమ్మరింపు!
[ 12-05-2024]
ప్రస్తుత ఎన్నికలను రెండు ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో ఓటర్లపై నోట్ల వాన కురుస్తోంది. -
ఊరు రమ్మంది.. ఓటేయమంది!
[ 12-05-2024]
ఉద్యోగాలు, ఉపాధి నిమిత్తం ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న వేలాది మంది ఓటు వేసేందుకు స్వస్థలాలకు భారీగా తరలి వస్తున్నారు. -
వ్యతిరేక ఓటును ఆపే కుట్ర?
[ 12-05-2024]
‘హలో.. మేము తహసీల్దారు కార్యాలయం నుంచి మాట్లాడుతున్నాం.. మీకు తణుకులో ఆదివారం నుంచి ఎన్నికల విధులు వేశారు.