చూసిన కనులదే భాగ్యం!
జగదభిరాముడి కల్యాణానికి జగమే ఊయలూగింది. సర్వమంగళ స్వరూపుడు శ్రీరాముడు, సకల జన శుభధాత్రి సీతాదేవి మూడు ముళ్లబంధంతో ఒక్కటైన వేళ భక్తజనం ఆనందంతో పులకించిపోయారు.
వైభవంగా సీతారాముల కల్యాణం
న్యూస్టుడే, ఒంటిమిట్ట
జగదభిరాముడి కల్యాణానికి జగమే ఊయలూగింది. సర్వమంగళ స్వరూపుడు శ్రీరాముడు, సకల జన శుభధాత్రి సీతాదేవి మూడు ముళ్లబంధంతో ఒక్కటైన వేళ భక్తజనం ఆనందంతో పులకించిపోయారు. పండు వెన్నెల్లో పావనమూర్తి పరిణయ వేడుక ముగ్ధ మనోహరంగా సాగింది. ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు సోమవారం సీతారాముల కల్యాణం కనుల పండువగా జరిగింది. వేదపండితుల మంత్రోచ్ఛారణ, మంగళవాయిద్యాల నడుమ పరిణయ క్రతువును నేత్రపర్వంగా నిర్వహించారు. తితిదే ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రాములోరి సన్నిధి నుంచి మధ్యాహ్నం శోభాయాత్ర ప్రారంభమైంది. కల్యాణవేదిక అశేష భక్తవాహినితో కళకళలాడింది. ఎదుర్కోలు ఘట్టం నేత్రపర్వంగా జరిగింది. అనంతరం తితిదే పాంచరాత్ర ఆగమశాస్త్ర సలహాదారు కల్యాణపురం రాజేష్ భట్టార్ ఆధ్వర్యంలో రాములోరి పెళ్లి వేడుకను శాస్త్రోక్తంగా నిర్వహించారు. లోక పావని మెడలో పావనమూర్తి పరంధాముడు మూడుముళ్లు వేసిన శుభ సమయాన ముల్లోకాలు మురిశాయి.
మంగళసూత్రం చూపుతున్న అర్చకులు కల్యాణం అనంతరం సీతారాములు
ముత్యాల తలంబ్రాలు, శ్రీవారి లడ్డూల పంపిణీ
సీతారాముల కల్యాణోత్సవానికి హాజరైన భక్తులకు అక్షింతలు, రెండు కంకణాలు, ఒక ముత్యం, తిరుమల నుంచి వచ్చిన చిన్న లడ్డూల పొట్లాలు అందజేశారు. ప్యాకింగ్ చేశారు. తిరుమల నుంచి అయిదు వేల లడ్డూలు తీసుకొచ్చి విక్రయించారు.
తరలివచ్చిన అధికారులు
పట్టువస్త్రాలు,ముత్యాల తలంబ్రాలు తెస్తున్న ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల్వలవన్, తితిదే ఈవో ధర్మారెడ్డి
కల్యాణోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవదాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల్ వలవన్ పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను అందజేశారు. సీతారాములకు 512 గ్రాముల కనకపు ఆభరణాలు, 14 కిలోల వెండి పూజా సామగ్రి, పట్టు వస్త్రాలను తితిదే కార్యనిర్వహణాధికారి ఎ.వి.ధర్మారెడ్డి కానుకగా సమర్పించారు. జేఈవోలు వీరబ్రహ్మం, గౌతమి తదితరులు ఆయన వెంట ఉన్నారు. ఐఏఎస్ అధికారులు ఎస్.ఎస్.రావత్, గిరిజాశంకర్, కలెక్టరు విజయరామరాజు, ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్, జిల్లా న్యాయమూర్తి శ్రీదేవి, జేసీ గణేష్కుమార్, అదనపు ఎస్పీలు వెంకటరాముడు, కృష్ణారావు, అధికారులు కల్యాణోత్సవాన్ని తిలకించారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
కల్యాణ వేదిక వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. ఎస్వీ సంగీత, నృత్య కళాశాల అధ్యాపకులు లక్ష్మీ సువర్ణ బృందం నాదస్వరం, డోలు వాద్యం మంగళ ప్రదంగా సాగింది. డాక్టరు వందన, చిన్నమ్మదేవి పర్యవేక్షణలో 40 మంది విద్యార్థులు శ్రీరామ నామామృతం భజన సంకీర్తనలు వీనులవిందుగా గానం చేశారు. డాక్టరు ఉషారాణి ఆధ్వర్యంలో సీతాకల్యాణం, రామాయణ శబ్దం, పాహిరామ ప్రభో కూచిపూడి నృత్యం మైమరిపించింది. రవి సుబ్రహ్మణ్యం పర్యవేక్షణలో భరతనాట్య ప్రదర్శన ఆకట్టుకుంది.
కల్యాణానికి పెద్దసంఖ్యలో హాజరైన భక్తులు
గ్రామోత్సవంలో భక్తజనం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ది రాక్షస గుణం... పేదల ప్రాణాలు పణం..!
[ 03-05-2024]
నిప్పులు చెరుగుతున్న భానుడి భగభగలతో పండుటాకులు విలవిలలాడిపోయారు... ప్రాణాలు హరిస్తున్న వడగాలులతో అల్లాడిపోయారు... భరించలేని ఉక్కపోతతో నిలువునా ఉడికిపోయారు... ఇదీ జిల్లావ్యాప్తంగా వివిధ బ్యాంకుల వద్ద గురువారం పింఛనుదారుల దయనీయ పరిస్థితి. -
ఆ ముగ్గురు మారీచులతో కడప నాశనం!
[ 03-05-2024]
ముగ్గురు మారీచులు కలిసి కడప నగరాన్ని సర్వనాశనం చేశారంటూ తెదేపా అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు మండిపడ్డారు. -
నాయకులారా... బడి దుస్థితి చూడరా
[ 03-05-2024]
మండల పరిధిలోని సోమిరెడ్డిపల్లె గ్రామంలో సుమారు 45 సంవత్సరాల క్రితం దాతలు ఇచ్చిన స్థలంలో ప్రాథమికోన్నత పాఠశాల ప్రారంభించారు. -
కొండాపురంలో రైళ్లు నిలిపేలా కృషి
[ 03-05-2024]
కొండాపురం రైల్వే నిలయంలో అన్ని రైళ్ల నిలుపుదలకు కృషి చేస్తానని మాజీ మంత్రి, ఎన్డీఏ కూటమి జమ్మలమడుగు ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణరెడ్డి స్పష్టం చేశారు. -
రాచమల్లుకు ఓటుతో బుద్ధి చెప్పండి
[ 03-05-2024]
రైతు కంట కన్నీరు వచ్చేలా మోసం చేసిన వారు బాగుపడినట్లు చరిత్రలో ఎక్కడా లేదు. ఈ కోవకే చెందిన ప్రొద్దుటూరు వైకాపా ఎమ్మెల్యే, అభ్యర్థి రాచమల్లు శివప్రసాదురెడ్డి రాజుపాళెం, ప్రొద్దుటూరు మండలాల శనగ రైతులను మోసం చేశారని, విజ్ఞులైన ఓటర్లారా ఎమ్మెల్యేకు ఓటుతో బుద్ధి చెప్పాలని గురువారం విడుదలైన కరపత్రం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
ఎంపీగా షర్మిలకు, ఎమ్మెల్యేగా పుట్టాకు ఓటేయండి: డీఎల్
[ 03-05-2024]
రాష్ట్రం కోల్పోయిన ప్రత్యేక హోదా సాధనకు పీసీసీ అధ్యక్షురాలు షర్మిల కొట్లాడుతున్నారని, ఆమెకే ఓటు వేయాలని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి కోరారు. -
ఒక్కఛాన్స్ అన్న జగన్... జనం పాలిట విలన్
[ 03-05-2024]
ఒక్కసారి అవకాశం ఇవ్వండి అంటూ పాదయాత్రలో జనం ముందుకు వచ్చిన జగన్.. అధికారంలోకి రాగానే వారి పాలిట విలన్గా మారారని తంబళ్లపల్లె తెదేపా అభ్యర్థి దాసరిపల్లి జయచంద్రారెడ్డి విమర్శించారు. -
ప్రచారభేరి
[ 03-05-2024]
అయిదేళ్ల పాలనలో వైకాపా ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో దోపిడీ దొంగల ముఠాలను తయారు చేసి వనరుల విధ్వంసానికి పాల్పడిందని 20 ఏళ్లు అభివృద్ధిలో వెనక్కు వెల్లిన రాష్ట్రాన్ని మళ్లీ గాడిన పెట్టాలంటే పరిపాలనలో అనుభవ శీలి అయిన చంద్రబాబు మళ్లీ సీఎం పగ్గాలు చేపట్టాలని, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలని కూటమి అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. -
గడికోట... ఓ భూబకాసురుడు!
[ 03-05-2024]
రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి ఓ భూబకాసురుడని, రాయచోటి పట్టణంలోని చిత్తూరు రోడ్డులో భూములను కాజేసి సుమారు రూ.200 కోట్లు కాజేశారని తెదేపా అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఆరోపించారు. -
తెదేపాకు గోవర్ధన్రెడ్డి రూ.5 లక్షల విరాళం
[ 03-05-2024]
తెదేపా అధినేత చంద్రబాబుకు కడపకు చెందిన ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్ గోవర్ధన్రెడ్డి రూ.5 లక్షల విరాళం అందజేశారు.
తాజా వార్తలు (Latest News)
-
హెచ్డీ రేవణ్ణ, ప్రజ్వల్పై కిడ్నాప్, అత్యాచారం కేసులు..
-
పిఠాపురంలో పవన్కే జై.. ముద్రగడ కుమార్తె కీలక వ్యాఖ్యలు
-
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
వివేకా హత్య కేసు.. సునీల్ యాదవ్, ఉదయ్కుమార్రెడ్డికి చుక్కెదురు
-
ఘోరం.. సెల్ఫోన్ టార్చ్లైట్ వెలుగులో ప్రసవం.. తల్లీబిడ్డ మృతి
-
ఉక్రెయిన్పై రష్యా ‘క్లోరోపిక్రిన్’ ప్రయోగం? ఏంటీ ఆయుధం?