రెడ్ అలర్ట్
వేసవి భగభగలు ప్రజల్ని హడలెత్తిస్తున్నాయి. నాలుగేళ్లలో ఉమ్మడి జిల్లా సగటు ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటలేదు.
ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు
అత్యధికంగా జన్నారంలో 46.3 డిగ్రీలుగా నమోదు
న్యూస్టుడే, రాంనగర్
వేసవి భగభగలు ప్రజల్ని హడలెత్తిస్తున్నాయి. నాలుగేళ్లలో ఉమ్మడి జిల్లా సగటు ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటలేదు. అలాంటిది ఈ సీజన్లో వరుసగా రెండు రోజుల నుంచి సగటు ఉష్ణోగ్రత 44.3 డిగ్రీలు ఉండగా, జిల్లాలోని పలు ప్రాంతాల్లో 45 డిగ్రీలు దాటడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే భారత వాతావరణ శాఖ జిల్లాలోని పలు ప్రాంతాల్లో రెడ్అలర్ట్ ప్రకటించడంతో అప్రమత్తంగా ఉండాలంటూ వైద్యులు సూచిస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో సోమవారం 44.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా, జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో ఇంకా ఎక్కువే నమోదైంది. వారం రోజులుగా వడగాల్పుల తీవ్రత అధికమైంది. ఈ నెల ప్రారంభం నుంచి వరుసగా 45 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. గాలిలో తేమ శాతం తగ్గిపోవడంతో ఎండ తీవ్రత ఎక్కువైంది.
ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటిన ప్రాంతాలు
ఉమ్మడి జిల్లాలోని పాలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటడంతో ఆయా ప్రాంతాలను రెడ్అలర్ట్గా ప్రకటించారు. ఆయా ప్రాంతాల్లోని జనం బయటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
మంచిర్యాల జిల్లాలోని జన్నారం, హజీపూర్, దండేపల్లి మండలాల్లో 46 డిగ్రీలు దాటగా, లింగాపూర్, తపాలపూర్, తపాలపూర్, భీమిని మండలాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో వాటిని రెడ్జోన్లో చేర్చారు. ఆదిలాబాద్ జిల్లాలోని భీంపూర్ మండలంలోని అర్లి, ఆదిలాబాద్ మండలం పిప్పల్ధరి ప్రాంతాల్లో 45.8 డిగ్రీలు నమోదు కావడంతో ఆయా ప్రాంతాలను రెడ్అలర్ట్గా ప్రకటించారు. కుమురం భీం జిల్లాలో రెబ్బెన, కాగజ్నగర్ మండలాల్లో 46 డిగ్రీలకు పైగా నమోదు కాగా, ఆసిఫాబాద్, జంబుగూడ, తిర్యాణి తదితర ప్రాంతాల్లో 45 డిగ్రీలు దాటింది. నిర్మల్ జిల్లాలో దస్తూరాబాద్, కడెం, ముజ్గి, ఖానాపూర్, తదితర ప్రాంతాలు రెడ్జోన్లో ఉన్నాయి.
మావలకు చెందిన ఉపాధి కూలీలు తెల్లవారుజామునే లేచి ఉపాధి పనులకు వెళుతున్నారు. తిరిగి 10 గంటల సమయంలో ఇంటికి కాలినడకన వెళ్లలేని పరిస్థితి ఉంది. అప్పటికే ఎండలో పని చేసిన కూలీలు తిరిగి నడిచి ఇళ్లకు వెళ్లడం ఇబ్బందిగా ఉండటంతో పనులు పూర్తయిన తర్వాత ఆటోల్లో ఇళ్లకు వెళుతున్నారు.
గుడిహత్నూర్ మండలం సీతాగొందిలో ఓ రైతు వేరుశనగ పంట వేశారు. మొక్కలను పీకడం, వాటి నుంచి కాయలను తుంచాలంటే ఉదయం నుంచి పంట పొలంలోనే ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎండలు ఎక్కువగా ఉండటంతో పొలం పనులకు తెల్లవారుజామునే వెళ్లి మొక్కలను తెంపుతున్నారు. ఎండలో కాయలు తెంపడం కష్టంగా ఉండటంతో వేరుశనగ కాయలను తెంపేందుకు పంట పొలంలోనే నీడ కోసం ప్లాస్టిక్ కవర్లతో కూలీలు చిన్న గుడారాలు ఏర్పాటు చేసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు
[ 02-06-2024]
తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు నిర్మల్ లో ఘనంగా ఆదివారం నిర్వహించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఆవరణలో కలెక్టర్ ఆశిష్ సంఘ్వాన్, అధికారులు అమరవీరుల స్తూపానికి జ్యోతి వెలిగించి, పూలు జల్లి నివాళులర్పించారు. -
కలెక్టరేట్లో తెలంగాణ ఆవిర్భావ అవతరణ వేడుకలు
[ 02-06-2024]
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలను జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్ లో కలెక్టర్ రాజర్షి షా జాతీయ జెండా ఎగురవేయగా.. -
ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు
[ 02-06-2024]
రామకృష్ణాపూర్ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
ఒకే రకం విత్తనాలు వాడొద్దు
[ 02-06-2024]
రైతులు ఒకేరకం విత్తనాలు వాడొద్దని, అన్ని రకాల విత్తనాలు సాగులో వినియోగించాలని ఏఈవో సాయి ప్రసాద్ తెలిపారు. -
తాంసిలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు
[ 02-06-2024]
మండలంలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. -
రైతులకు పత్తి విత్తనాల పంపిణీ
[ 02-06-2024]
మండల కేంద్రంలో ఆదివారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు రాశి -659 పత్తి విత్తనాలను పంపిణీ చేశారు. -
పాలన చేరువ.. కావాలి చొరవ
[ 02-06-2024]
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి దశాబ్దం పూర్తయ్యింది. ఈ పదేళ్ల కాలంలో జిల్లా రూపురేఖలు మారినా ఇంకా సౌకర్యాల కోసం విషయంలో ఎదురుచూడాల్సిన పరిస్థితి. -
అభివృద్ధి పథం.. ఆశల సమాహారం
[ 02-06-2024]
తెలంగాణ రాష్ట్రం అవతరించి నేటి(జూన్ 2)తో పదేళ్లు పూర్తవుతోంది. రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించడంలో అధికారులు తలమునకలై ఉన్నారు. -
ఒకే విత్తనంపై ఆధారపడొద్దు
[ 02-06-2024]
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రధాన పంట పత్తి. ఒకే రకమైన విత్తనానికి డిమాండ్ కనిపిస్తోంది. డీలర్ల మాయాజాలం అంతుచిక్కడం లేదు. -
భీం స్ఫూర్తి.. వెలగాలి ప్రగతి దీప్తి!
[ 02-06-2024]
ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించి పది వసంతాలు పూర్తి చేసుకుని నేటితో 11వ వసంతంలోకి అడుగుపెట్టబోతోంది. కుమురం భీం స్ఫూర్తితో కొత్త జిల్లా ఆవిర్భవించింది. -
భగ్గుమన్న భానుడు
[ 02-06-2024]
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మూడు రోజులుగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. -
హత్య చేసి.. కాల్చేశారు..
[ 02-06-2024]
గుర్తుతెలియని దుండగులు ఓ వ్యక్తిని హత్యచేసి దహనం చేసిన ఘటన నిర్మల్ జిల్లా బాసరలో చోటుచేసుకుంది. -
5 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం
[ 02-06-2024]
నకిలీ విత్తనాలు అక్రమంగా రవాణా చేసిన నిందితులను శనివారం అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
‘మాపై దాడి చేయొద్దు’: రవీనా టాండన్ విజ్ఞప్తి.. వీడియో వైరల్
-
ఏపీలో 3 రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
దేశంలోనే సుదీర్ఘ కాలం సీఎం.. 39 ఏళ్లలో తొలి ఓటమి
-
స్టార్టప్లు నేర్పిన పాఠాలివే: గజల్ అలఘ్
-
అక్కడ జడేజా బ్యాటింగ్.. నేను నోరు మూసుకోవడం బెటర్: మంజ్రేకర్