జగన్ జమానాలో ప్రయాణికుల హైరానా
రోడ్లు బాగు చేయాల్సిన ప్రభుత్వం పట్టించుకోకపోవడం ప్రయాణికులకు శాపంగా మారుతోంది. సుదూర ప్రాంతాలకు కాలం చెల్లిన బస్సులు తిప్పుతుండటంతో గుంతల రోడ్లలో అవి ఆగిపోతున్నాయి.
గూడెంకొత్తవీధి, న్యూస్టుడే: రోడ్లు బాగు చేయాల్సిన ప్రభుత్వం పట్టించుకోకపోవడం ప్రయాణికులకు శాపంగా మారుతోంది. సుదూర ప్రాంతాలకు కాలం చెల్లిన బస్సులు తిప్పుతుండటంతో గుంతల రోడ్లలో అవి ఆగిపోతున్నాయి. విశాఖపట్నం నుంచి భద్రాచలం వెళ్తున్న బస్సు బుధవారం రెండు చోట్ల ఆగిపోయింది. లోతుగెడ్డ కూడలి వద్ద ఆగిపోవడంతో డ్రైవర్ బాగు చేసుకుని ముందుకు సాగారు. గూడెంకొత్తవీధి వచ్చే మార్గంలో గోతులు అధికంగా ఉండటంతో గేరు రాడ్డు పనిచేయలేదు. ఆర్వీ నగర్ నుంచి గూడెంకొత్తవీధి మధ్యలో ఏకంగా గేరు రాడ్డు విరిగింది. దీంతో చేసేదేమీ లేక జీకేవీధిలో బస్సును ఆపేశారు. ఇందులో 20 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. వీరిలో సగం మంది భద్రాచలంలో జరిగే పరీక్షకు వెళుతున్నారు. బస్సు ఆగిపోవడంతో వారంతా నిరసన వ్యక్తం చేశారు. రోడ్లు సరిగ్గా లేక, కాలం చెల్లిన బస్సులు తిప్పుతుండటంతో ఈ పరిస్థితి ఎదురైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రయాణికులే విశాఖపట్నం డీఎంకు ఫోన్లో ఫిర్యాదు చేయడంతో అప్పటికప్పుడు నర్సీపట్నం నుంచి మరో బస్సు పంపించారు. అందులో ప్రయాణికులను భద్రాచలం పంపించారు.
పరీక్షకు హాజరవ్వలేకపోతున్నాం
- శివ, ప్రయాణికుడు
మాది నర్సీపట్నం. భద్రాచలంలో జరిగే పరీక్షకు వెళుతున్నాను. మూడేళ్ల తరువాత ఈ మార్గంలో ప్రయాణిస్తున్నాను. రోడ్లు సరిగా లేవు. బస్సు రెండు చోట్ల ఆగిపోయింది. పరీక్షకు హాజరవ్వలేకపోతున్నా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లెక్కింపునకు సర్వం సిద్ధం
[ 02-06-2024]
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మంగళవారం జరగనుంది. జిల్లాలోని మూడు శాసనసభ, అరకు పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్, ఈవీఎంల లెక్కింపునకు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కలెక్టర్ విజయ సునీత, -
ఉద్యానానికి ‘‘ఉపాధి’’ ఊతం
[ 02-06-2024]
కొద్దిరోజుల్లో వానాకాలం మొదలుకానుంది. ఇకపై ఉపాధిహామీ పథకం కింద చెరువుల్లో పూడికతీత పనులు తగ్గించి జూన్ నుంచి ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించాలని అధికారులు నిర్ణయించారు. -
భీమిలి తీరంలో విధ్వంసం విజయవంతం
[ 02-06-2024]
ఆయన హయాంలో సీఆర్జెడ్ నిబంధనలపై నీతి వాక్యాలు వల్లె వేశారు. ఇప్పుడు తానే భీమిలి తీరంలో విధ్వంసానికి తెరలేపారు. ఎన్నికల కోడ్ విధుల్లో అధికారులుంటే, చాకిరేవు గెడ్డ పోరంబోకు భూ ఆక్రమణల్లో సదరు నేత నిమగ్నమయ్యారు. -
తపాలా బీమాతో ధీమా!
[ 02-06-2024]
అనుకోని ప్రమాదాల్లో ఎవరైనా చనిపోతే వారిపై ఆధారపడిన కుటుంబాల పరిస్థితి దయనీయం. భార్య/భర్త మరణిస్తే వారి పిల్లల చదువులు, ఇతర అవసరాల కోసం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. -
ఆఖరి మజిలీకి అవస్థలు
[ 02-06-2024]
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సర్వం త్యాగం చేసి.. పునరావాస కాలనీలకు వచ్చిన ముంపు గ్రామాల నిర్వాసితుల్లో ఎవరైనా మృతిచెందితే వారి ఆఖరి మజిలీకి తీవ్ర అవస్థలు తప్పడం లేదు. -
పిడుగుపాటుకు క్రీడాకారుడి మృతి
[ 02-06-2024]
పద్మాపురం సమీపంలో శనివారం పిడుగుపడటంతో గిరి యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. -
ఎండల తీవ్రతకు పైపులైన్ పేలుడు!
[ 02-06-2024]
ఛత్తీస్గడ్, ఒడిశా మీదుగా ఆంధ్రప్రదేశ్లోని విశాఖకు వెళుతున్న ఐరన్ఓర్ పైపులైన్ శుక్రవారం అర్ధరాత్రి పేలిపోయింది. చింతపల్లి మండలం బలపం పంచాయతీలోని దిగజనబ గ్రామం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. -
అన్ని సర్వేల్లో కూటమిదే గెలుపు!
[ 02-06-2024]
కూటమికే ప్రజలు పట్టం కట్టనున్నారని, సర్వేలన్నీ అవే చెబుతున్నాయని పాడేరు అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘మాపై దాడి చేయొద్దు’: రవీనా టాండన్ విజ్ఞప్తి.. వీడియో వైరల్
-
ఏపీలో 3 రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
దేశంలోనే సుదీర్ఘ కాలం సీఎం.. 39 ఏళ్లలో తొలి ఓటమి
-
స్టార్టప్లు నేర్పిన పాఠాలివే: గజల్ అలఘ్
-
అక్కడ జడేజా బ్యాటింగ్.. నేను నోరు మూసుకోవడం బెటర్: మంజ్రేకర్