‘రోజా మాయమాటలు నమ్మి మోసపోవద్దు’
మంత్రి రోజా మాయమాటలు నమ్మి మోసపోవద్దని శ్రీశైలం ఆలయ కమిటీ మాజీ ఛైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని జంబాడ సమీప నెహ్రునగర్లో లక్ష్మీపతిరాజు ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
జంబాడలో ఆత్మీయ సమావేశంలో గాలి భానుప్రకాష్కు శాలువా కప్పుతున్న శ్రీశైలం ఆలయ కమిటీ మాజీ ఛైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి
విజయపురం, న్యూస్టుడే: మంత్రి రోజా మాయమాటలు నమ్మి మోసపోవద్దని శ్రీశైలం ఆలయ కమిటీ మాజీ ఛైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని జంబాడ సమీప నెహ్రునగర్లో లక్ష్మీపతిరాజు ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ పదేళ్లపాటు పార్టీ ఆభివృద్ధి కోసం కృషి చేసిన తనకు తగిన గుణపాఠం నేర్పారన్నారు. ఆమె స్వార్థం కోసం మొదటి నుంచి పార్టీ జెండా మోసిన వారిని పక్కన పెట్టారని విమర్శించారు. నిండ్రలో నేను, వడమాలపేటలో మురళీధర్రెడ్డి, పుత్తూరులో అమ్ములు, విజయపురంలో లక్ష్మీపతిరాజు, నగరిలో కేజేకుమార్ పార్టీ కోసం సొంత డబ్బులు ఖర్చు చేసి పార్టీ బలోపేతం చేశామన్నారు. ఆమె అక్రమ సంపాదన కోసం వ్యాపారాలకు అడ్డుపడతామని భావించి పార్టీ నుంచి దూరం చేసుకుంటు వచ్చారని, అందువల్లే పార్టీ మారాల్సి వచ్చిందన్నారు. ఎన్నికల్లో ఆమె కల్లిబొల్లి మాటలు విని ఎవరు మోసపోవద్దని మళ్లీ గెలిపించుకుంటే ఐదేళ్లు కనబడరని తెలిపారు. గాలి భానుప్రకాష్ మాట్లాడుతూ పార్టీలో చేరడం చాలా ఆనందంగా ఉందని మీరందరూ కలసికట్టుగా కృషి చేసి అత్యధిక మెజారీతో గెలపించాలని కోరారు. రోజాను తరిమికొట్టే సమయం ఆసన్నమైందని విజయపురం ప్రకృతి సంపదను దోచుకున్న ఆమెను చిత్తుచిత్తుగా ఓడించి ఇంటికి పంపాలని కోరారు. పలువురు వైకాపా అనుచరులు తెదేపా తీర్థం పుచ్చుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెట్టింగ్ భూతం.. ఆడితే ఖతం
[ 02-06-2024]
శాసనసభ పోరులో గెలుపోటములపై పందేల వేట సాగిస్తున్నారు. ఈ ఊబిలోకి సామాన్యులను సైతం వైకాపా ముఠాలు దించుతున్నాయి. వారిని ఆర్థికంగా కుంగదీసే ప్రయత్నాలు చేస్తున్నాయి. -
వసతి గృహాల్లో సమస్యల స్వాగతం
[ 02-06-2024]
ముఖ్యమంత్రి జగన్ ఏ సభ, సమావేశం జరిగినా మైక్ పట్టుకుని ‘నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు’ అంటూ పల్లవి పాడుతుంటారు. -
లెక్కలు తేలే రోజుకు కౌంట్డౌన్
[ 02-06-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన ఓట్ల లెక్కింపు మంగళవారం జరగనుంది. జిల్లాలో ఒక లోక్సభ స్థానం, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి పోలైన ఓట్ల లెక్కింపునకు అధికారులు సర్వసన్నద్ధమయ్యారు. -
ఖాతాల్లోనే పింఛన్ మొత్తం
[ 02-06-2024]
సామాజిక భద్రతా పింఛన్ల లబ్ధిదారుల కష్టాలు జూన్లోనూ కొనసాగాయి. ఎన్నికల్లో లబ్ధే లక్ష్యంగా ప్రభుత్వం రెండు నెలలుగా పింఛనర్లను ఇబ్బందులకు గురిచేయడంపై ప్రతిపక్షాల నుంచి పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. -
తెదేపా సానుభూతిపరులపై అదే ప‘నిఘా’
[ 02-06-2024]
దాడులకు తెగబడే వారిని నియంత్రించాల్సిన పోలీసులు.. బాధితులపైనే నిఘా పెడుతున్న తీరు విమర్శలకు తావిస్తోంది. -
పోస్టల్ బ్యాలెట్పై పేచీ తొలగినట్లేనా?
[ 02-06-2024]
ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ఇక అందరి కళ్లు పోస్టల్ బ్యాలెట్లపై పడనున్నాయి. -
ఓట్ల లెక్కింపులో జాగ్రత్తగా ఉండాలి
[ 02-06-2024]
చిత్తూరు లోక్సభ స్థానం ఓట్ల లెక్కింపులో అధికారులు జాగ్రత్తగా ఉండాలని జేసీ శ్రీనివాసులు అన్నారు. -
విద్యుత్తు శాఖ నిర్లక్ష్యానికి రెండు కాళ్లు కోల్పోయిన విద్యార్థి
[ 02-06-2024]
బంగారు భవిష్యత్తు కలిగిన ఓ విద్యార్థి విద్యుత్తు శాఖ నిర్లక్ష్యానికి తన రెండు కాళ్లు కోల్పోయాడు. -
గాలివాన బీభత్సం
[ 02-06-2024]
జిల్లాలోని పలు ప్రాంతాల్లో శనివారం పెనుగాలుల వర్షం కురిసింది. వారం రోజులుగా తీవ్ర ఎండ వేడిమి వల్ల ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. -
పోలీసులు సంసిద్ధంగా ఉండండి: ఎస్పీ
[ 02-06-2024]
చిత్తూరు నగరంలోని ఎస్వీసెట్ కళాశాలలో ఈ నెల 4వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపునకు పోలీసు అధికారులు సంసిద్ధంగా, అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
మంత్రి కోమటిరెడ్డి ఆరోపణలు రుజువు చేస్తే.. ముక్కు నేలకు రాస్తా: హరీశ్రావు
-
‘మాపై దాడి చేయొద్దు’: రవీనా టాండన్ విజ్ఞప్తి.. వీడియో వైరల్
-
ఏపీలో 3 రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
దేశంలోనే సుదీర్ఘ కాలం సీఎం.. 39 ఏళ్లలో తొలి ఓటమి
-
స్టార్టప్లు నేర్పిన పాఠాలివే: గజల్ అలఘ్