కమలం జెండా భుజాన.. కాషాయ దండు నగరాన
లోక్సభ ఎన్నికల్లో రాజధాని పరిధిలోని నాలుగు స్థానాల్లో పాగా వేయడానికి భాజపా విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.
4 లోక్సభ స్థానాల్లో ప్రచారానికి అగ్ర నేతలు
అన్నింటిలో విజయానికి కార్యాచరణ
లోక్సభ ఎన్నికల్లో రాజధాని పరిధిలోని నాలుగు స్థానాల్లో పాగా వేయడానికి భాజపా విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. జనానికి దగ్గరగా ఉన్న నేతలను అభ్యర్థులుగా నిలపడంతో విజయం సులభంగా సాధించాలని భావిస్తోంది. ఇదే లక్ష్యంగా పార్టీ అగ్రనేతలు హైదరాబాద్కు రాబోతున్నారు. పన్నెండు మందికిపైగా కేంద్ర మంత్రులు ఓటర్లను కలవడానికి వస్తున్నారు. ప్రధాని మోదీ ఈనెల 27న పర్యటించబోతున్నారు. మరోవైపు నలుగురు అభ్యర్థులు నెల రోజులుగా నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ఓటర్లకు దగ్గరవడానికి ప్రయత్నిస్తున్నారు.
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి
రాజధాని పరిధిలోకి వచ్చే సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల, హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గాల్లోని 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గోషామహల్ నుంచి రాజాసింగ్ ఒక్కరే ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇదీ హైదరాబాద్ లోక్సభ పరిధి. నాలుగు ఎంపీ స్థానాల్లో సికింద్రాబాద్ నుంచి గత ఎన్నిల్లో కిషన్రెడ్డి ఒక్కరే గెలిచారు. ఆయనకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం లభించడంతో పాటు రాష్ట్ర భాజపా అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్నారు. మొన్నటి శాసనసభ ఎన్నికల్లో భాజపా ఒక్క స్థానంలోనే గెలిచినా, 12 చోట్ల రెండో స్థానంలో నిలిచింది. కొన్ని నియోజకవర్గాల్లో లక్షకుపైగా ఓట్లను దక్కించుకుంది. ఫలితంగా కొన్నిచోట్ల కాంగ్రెస్ మూడో స్థానానికి పరిమితమైంది. తద్వారా కమలానికి బలమైన ఓటు బ్యాంకు ఉందని స్పష్టమైంది. ఇప్పుడు దీన్నే ఉపయోగించుకోవాలన్నది పార్టీ అగ్రనేతల ఆలోచన. అయోధ్య రామాలయాన్ని ప్రారంభించిన తరువాత రాజధాని పరిధిలో పార్టీకి అనుకూల వాతావరణం ఉందని కమలనాథులు చెబుతున్నారు. మహా నగరం పరిధిలో ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది ఉన్నారు. వీరంతా అనుకూలంగా ఉంటారన్న ఉద్దేశంతో నగర నేతలు ప్రధానంగా దృష్టిసారించారు. సంబంధిత వర్గం అగ్రనేతలను దిల్లీనుంచి రప్పించి వారితో మాట్లాడించడానికి ఏర్పాట్లుచేస్తున్నారు. నగరంలో ఉన్నత విద్యావంతులు, మేధావులతో ప్రధాన మోదీ ఈనెల 27న ప్రత్యేకంగా మాట్లాడబోతున్నారు. ఇటీవల మాజీ సైనికులతో రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సమావేశానికి నిర్ణయించినా ఆయన హాజరుకాలేదు. మరోసారి వచ్చి ప్రత్యేకంగా మాట్లాడతారని చెబుతున్నారు. భాజపా అనుబంధ సంస్థలు కూడా రంగంలోకి దిగి పెద్దఎత్తున ప్రచారంలో పాలుపంచుకుంటున్నాయి. మొత్తంగా ఏ వర్గాన్నీ వదలకుండా భాజపా వ్యూహాత్మకంగా ముందుకు వెళుతోంది. ఇకనుంచి ప్రతిరోజూ ఏదో ఒక ప్రాంతంలో అగ్రనేతలతో ప్రచారానికి కార్యాచరణ రూపొందించింది.
సికింద్రాబాద్ లోక్సభ అభ్యర్థిగా మరోసారి కిషన్రెడ్డి బరిలో నిలిచారు. ఎమ్మెల్యేగా మూడుసార్లు, ఎంపీగా ఒక్కసారి గెలిచిన అనుభవంతో మరోసారి గెలవడానికి అన్ని వ్యూహాలతో ముందుకు వెళుతున్నారు. అన్ని కాలనీల్లో పర్యటిస్తూ ఓటర్లతో మమేకం కావడానికి ప్రయత్నిస్తున్నారు. కేంద మంత్రి, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉండటంతో మిగిలిన లోక్సభ నియోజకవర్గాల ప్రచారంలో పాల్గొంటున్నా ప్రధానంగా సికింద్రాబాద్పైనే దృష్టి సారించారు.
మల్కాజిగిరి నుంచి బరిలో ఉన్న ఈటల రాజేందర్ అన్ని శక్తులను ఒడ్డి పోరాడుతున్నారు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెల్చిన ఈటల మొన్నటి శాసనసభ ఎన్నికల్లో 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈ క్రమంలోనే మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం లభించడంతో, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో గెలవాలన్న పట్టుదలతో ప్రయత్నిస్తున్నారు. అగ్రనేతలతో భారీగా ప్రచారానికి ప్రణాళిక రూపొందించుకున్నారు.
చేవెళ్ల అభ్యర్థిగా మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి బరిలో నిలిచారు. ఇక్కడ ఆయన మూడోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయినా నియోజకవర్గంలోని పార్టీ నేతలతో సన్నిహిత సంబంధాలతో గ్రామాల్లో పర్యటిస్తూ పార్టీని బలోపేతం చేసుకున్నారు. మూడు నెలలుగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆయన భార్య, అపోలో జేఎండీ కొండా సంగీతారెడ్డి కూడా పెద్దఎత్తున ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇక్కడా అన్ని ప్రాంతాల్లో అగ్రనేతలతో ప్రచారం చేయించనున్నారు.
హైదరాబాద్ అభ్యర్థిగా మాధవీలత పోటీ చేస్తున్నారు. ఎంఐఎం అభ్యర్థిగా ప్రస్తుత ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఉన్నారు. చాలా ఏళ్లుగా ఇక్కడ ఎంఐఎం విజయం సాధిస్తోంది. ఈ పార్టీకి గట్టిపోటీ ఇవ్వాలనే లక్ష్యంతో, ఇక్కడ అనేక సేవా కార్యక్రమాలు చేసిన మాధవీలతను భాజపా బరిలో నిలిపింది. తొలుత ఇక్కడి ప్రధాన ఓటర్ల మనసు గెల్చుకోవాలన్న ఆలోచనలో పార్టీ ఉంది. దీనికి అనుగుణంగానే ఆమె ప్రచారం పెద్దఎత్తున సాగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జైలుకెళ్లినా మార్పు రాలె.. జల్సాలకు అలవాటు పడి చోరీలు
[ 02-06-2024]
నలుగురు స్నేహితులు.. జల్సాలకు అలవాటు పడి దొంగతనాలే లక్ష్యంగా చేసుకున్నారు.. పలు చోరీల కేసుల్లో పోలీసులు అరెస్టుచేసి జైలుకు పంపినా వారిలో మార్పు రాలేదు. -
డ్రైవింగ్ లైసెన్సులు పాత విధానంలోనే
[ 02-06-2024]
డ్రైవింగ్ లైసెన్సులను యథావిధిగా రవాణాశాఖ కార్యాలయాల్లోనే జారీ చేయనున్నారు. డ్రైవింగ్ లైసెన్సింగ్ విధానాన్ని మరింత సరళతరం చేస్తున్నట్లు గతంలో కేంద్రం ప్రకటించింది. -
గ్రూప్స్ పరీక్షలకు సిద్ధమవుతూ.. మానసిక ఒత్తిడితో యువతి ఆత్మహత్య
[ 02-06-2024]
గ్రూప్స్ పరీక్షలకు సిద్ధమవుతున్న ఓ యువతి తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మేడ్చల్ ఠాణా పరిధిలో శనివారం జరిగింది. -
దశాబ్ది స్ఫూర్తిగా.. శతాబ్దికి బాసటగా
[ 02-06-2024]
అరవై ఏళ్ల ప్రజల సుదీర్ఘ పోరాటం ఫలితంగా పదేళ్ల క్రితం తెలంగాణ స్వరాష్ట్రం కల సాకారమైంది. ఉద్యమాలకు ఊపిరిలూదిన హైదరాబాద్ గడ్డ ఆ రోజు ఎంతో పులకించింది. -
ఉద్యమానికి ఊపిరిలూదారు
[ 02-06-2024]
తెలంగాణ రాష్ట్ర సాధన క్రతువులో మొయినాబాద్ కీలకపాత్ర పోషించింది. ఈ ప్రాంతానికి చెందిన ముగ్గురు ఉద్యమానికి ఊపిరిలూది.. -
ప్రగతి కాంక్ష.. సాగాలి నిరంతర దీక్ష
[ 02-06-2024]
తెలంగాణ డయగ్నొస్టిక్ కేంద్రాల ద్వారా ఇప్పటివరకు జిల్లాలో 1,05,103 మందికి వివిధ రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. వికారాబాద్ వైద్య కళాశాలకు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) అనుమతి మంజూరు చేసింది. -
ఫలితాల వెల్లడికి సర్వం సన్నద్ధం
[ 02-06-2024]
రాజధాని పరిధిలోని నాలుగు ఎంపీ స్థానాలు, ఓ అసెంబ్లీ నియోజకవర్గం ఓట్ల లెక్కింపునకు సమయం ఆసన్నమైంది. సుమారు ఆరు వేల మంది ఉద్యోగులు ఈనెల 4న ఓట్ల లెక్కింపులో పాల్గొననున్నారు. -
బుల్కాపూర్ నాలా బఫర్ జోన్ కబ్జా
[ 02-06-2024]
నగరానికి చెందిన వరద నీటిని మోసుకెళ్లే ప్రధాన కాలువల్లో బుల్కాపూర్ నాలా కీలకమైంది. శతాబ్దాల క్రితమే నగర ప్రజలను వరద ముంపు నుంచి కాపాడేందుకు ప్రణాళికాబద్ధంగా నాటి నిజాం పాలకులు తవ్వించగా.. -
డబ్బులిచ్చుకో.. నిరభ్యంతరంగా పత్రాలు పుచ్చుకో
[ 02-06-2024]
రాజధాని నగరం శివారు ప్రాంతాల్లోని చెరువులు..వాగుల్లో రియల్ వెంచర్లు వేసుకునేందుకు ఇరిగేషన్ శాఖ అధికారులు సహకరించారు. -
దేశ భద్రతకు మూలస్తంభాలుగా నిలవాలి
[ 02-06-2024]
సవాళ్లను అధిగమించేందుకు కృషి, పట్టుదల, ఐక్యత, చిత్తశుద్ధి దేశ భద్రతకు మూలస్తంభాలుగా నిలుస్తాయని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్)ఎయిర్ పోర్టు సెక్టార్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ప్రవీర్ రంజన్ తెలిపారు. -
రౌడీషీటర్ హత్యకు పథక రచన
[ 02-06-2024]
ఇద్దరు రౌడీషీటర్ల మధ్య తలెత్తిన గొడవతో ఒకరిపై మరొకరు పగ పెంచుకున్నారు. వారిలో ఒకరి హత్యకు పథకం వేసి అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. -
ఉచిత న్యాయం.. మరింత చేరువ
[ 02-06-2024]
కాలంతోపాటు నేరాలు, అసాంఘిక కార్యకలాపాలు పెరుగుతున్నాయి. వీటివల్ల బాధితులకు సత్వర న్యాయం జరగాలి. ఈ నేపథ్యంలో జిల్లాలో న్యాయసేవలు విస్తృతమవుతున్నాయి. -
యాప్లతో డ్రగ్స్ సరఫరా
[ 02-06-2024]
రెండు వేర్వేరు కేసుల్లో నగరంలో డ్రగ్స్ విక్రయిస్తున్న వి.లక్ష్మిపతి(28), ఒకారో కాస్మోస్ రమ్సీ(38)లను టీఎస్ న్యాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. -
పనిచేసే సంస్థకు ఉద్యోగుల కన్నం
[ 02-06-2024]
డిజిటల్ చెల్లింపులకు సంబంధించిన క్యూఆర్ కోడ్ మార్చేసి ప్రైవేటు సంస్థలో రూ.4.15 కోట్లు కొట్టేసిన మోసంలో సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం(ఈవోడబ్ల్యూ) పోలీసులు ఇద్దర్ని అరెస్టు చేశారు. -
నకిలీ పాస్పోర్టుల కుంభకోణంలో ముగ్గురి అరెస్టు
[ 02-06-2024]
నకిలీ పాస్పోర్టుల కుంభకోణంలో తెలంగాణ సీఐడీ మరో ముగ్గుర్ని అరెస్టు చేసింది. ఇందులో ఇద్దరు శ్రీలంక దేశస్థులు ఉండడం గమనార్హం.
తాజా వార్తలు (Latest News)
-
కెనడాను చిత్తు చేసిన యూఎస్ఏ.. టీ20ల్లో రికార్డు విజయం
-
ప్రతి సన్నివేశం అభిమానులకు ట్రీటే: డైరెక్టర్ శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
విశాఖపట్నంలో ఈదురుగాలులతో భారీ వర్షం
-
ఇప్పుడు కెప్టెన్ ఎవరో తెలుసు.. ఐపీఎల్ ఊసే ఇక్కడ ఉండదు: మాజీలు
-
అమరవీరుల స్తూపానికి సీఎం రేవంత్రెడ్డి నివాళి
-
రాజ్భవన్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు