పాలమూరు... ప్రచార హోరు
లోక్సభ ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో ‘మహబూబ్నగర్ (పాలమూరు)’ బరిలో నిలిచిన అభ్యర్థులు ప్రచారంహోరెత్తిస్తున్నారు. గెలుపు తమదేనంటూ ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు.
విజయంపై ఎవరి ధీమా వారిదే
న్యూస్టుడే, బొంరాస్పేట, కొడంగల్
లోక్సభ ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో ‘మహబూబ్నగర్ (పాలమూరు)’ బరిలో నిలిచిన అభ్యర్థులు ప్రచారంహోరెత్తిస్తున్నారు. గెలుపు తమదేనంటూ ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు.
నేరుగా రంగంలోకి సీఎం..
వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ అసెంబ్లీ సెగ్మెంట్ మహబూబ్నగర్ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. మహబూబ్నగర్ వాసిగా, కొడంగల్ ఎమ్మెల్యేగా ఎదిగిన రేవంత్రెడ్డి సీఎం పీఠాన్ని అధిరోహించారు. జిల్లాకు శక్తిమేరకు సాయం చేయాలని తరచూ స్థానిక నేతలతో మాట్లాడటమే కాదు తానే చొరవ తీసుకుని మహబూబ్నగర్లో కాంగ్రెస్ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డిని పోటీలో నిలబెట్టారు. ఆయన గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఇప్పటికి జిల్లాలో రెండుసార్లు ప్రచారం చేశారు. స్వయంగా ముఖ్యమంత్రే బాధ్యత తీసుకోవడంతో వంశీచంద్రెడ్డి విజయం కాంగ్రెస్ శ్రేణులుధీమా వ్యక్తం చేస్తున్నాయి.
ఏడుగురు ఎమ్మెల్యేలూ కాంగ్రెస్ వారే..: పాలమూరు లోక్సభ స్థానానికి సీˆఎం ఇన్ఛార్జిగా ఉండటంతో పాటు దీని పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. కొడంగల్ నియోజకవర్గం నుంచి కచ్చితంగా 50 వేల మెజార్టీ రావాలని సీఎంఆదేశించారు. ఇదే లక్ష్యంతో కార్యకర్తలు, నేతలు గ్రామాల్లో ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
కొడంగల్ నియోజకవర్గంలోని భారాస ముఖ్యనేతలు, పార్టీని వీడుతూ కాంగ్రెస్లో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో నేతల్లో ఉత్సాహం రెట్టిపవుతోంది.
కేసీఆర్ పథకాలే బలం.. నమ్మకం
ముఖ్యమంత్రిగా కేసీˆఆర్ ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు నేటికీ ప్రజల గుండెల్లో ఉన్నాయని అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి అంటున్నారు. వాటినే ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలు నిలబెట్టుకోలేదని విమర్శిస్తున్నారు. ఇటీవల కోస్గికి వచ్చిన మాజీ మంత్రి హరీశ్ రావు కూడా ఎల్ఈడీ తెరలపై కాంగ్రెస్ హామీలు ఎలా అమలు కాలేదో చూపించి ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరాన్ని వివరించారు. కేసీˆఆర్ పదేళ్ల పాలనలో చేపట్టిన సంక్షేమ పథకాలు పేదలకు వివరించేలా అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి తగిన ప్రణాళిక రూపొందించుకుని ముందుకు వెళ్తున్నారు. ఇటీవలే మాజీ సీఎం కేసీఆర్ మహబూబ్నగర్లో నిర్వహించిన సభకు వేలాదిగా జనం రావడం పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపింది. ఇదే జోష్తో ప్రచారం కొనసాగిస్తున్నారు.
మోదీ పాలన చూపిస్తూ.. ఆశలు కల్పిస్తూ..
కేంద్రంలో పదేళ్ల మోదీ పాలనతో ప్రజలు సంతోషంగా ఉన్నారని పార్టీ అభ్యర్థి డీకే అరుణ ఎక్కడ ప్రచారం చేసినా చెబుతున్నారు. కాంగ్రెస్ హామీలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాను గెలిస్తే కచ్చితంగా మంత్రి పదవి వస్తుందని, పాలమూరు జిల్లాకు నిధులు తీసుకొచ్చి పూర్తిస్థాయిలో కేంద్ర పథకాలను అమలుచేస్తామంటూ స్వయంగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇందులో ప్రధానంగా కృష్ణా - వికారాబాద్ రైల్వేలైన్ పూర్తి చేస్తామని భరోసా ఇస్తున్నారు. ఆమె గతంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించడంతో ప్రతి గ్రామంలో కొంత పట్టు ఉండటం కలిసి వచ్చే అవకాశంగా శ్రేణులు పేర్కొంటున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జైలుకెళ్లినా మార్పు రాలె.. జల్సాలకు అలవాటు పడి చోరీలు
[ 02-06-2024]
నలుగురు స్నేహితులు.. జల్సాలకు అలవాటు పడి దొంగతనాలే లక్ష్యంగా చేసుకున్నారు.. పలు చోరీల కేసుల్లో పోలీసులు అరెస్టుచేసి జైలుకు పంపినా వారిలో మార్పు రాలేదు. -
డ్రైవింగ్ లైసెన్సులు పాత విధానంలోనే
[ 02-06-2024]
డ్రైవింగ్ లైసెన్సులను యథావిధిగా రవాణాశాఖ కార్యాలయాల్లోనే జారీ చేయనున్నారు. డ్రైవింగ్ లైసెన్సింగ్ విధానాన్ని మరింత సరళతరం చేస్తున్నట్లు గతంలో కేంద్రం ప్రకటించింది. -
గ్రూప్స్ పరీక్షలకు సిద్ధమవుతూ.. మానసిక ఒత్తిడితో యువతి ఆత్మహత్య
[ 02-06-2024]
గ్రూప్స్ పరీక్షలకు సిద్ధమవుతున్న ఓ యువతి తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మేడ్చల్ ఠాణా పరిధిలో శనివారం జరిగింది. -
దశాబ్ది స్ఫూర్తిగా.. శతాబ్దికి బాసటగా
[ 02-06-2024]
అరవై ఏళ్ల ప్రజల సుదీర్ఘ పోరాటం ఫలితంగా పదేళ్ల క్రితం తెలంగాణ స్వరాష్ట్రం కల సాకారమైంది. ఉద్యమాలకు ఊపిరిలూదిన హైదరాబాద్ గడ్డ ఆ రోజు ఎంతో పులకించింది. -
ఉద్యమానికి ఊపిరిలూదారు
[ 02-06-2024]
తెలంగాణ రాష్ట్ర సాధన క్రతువులో మొయినాబాద్ కీలకపాత్ర పోషించింది. ఈ ప్రాంతానికి చెందిన ముగ్గురు ఉద్యమానికి ఊపిరిలూది.. -
ప్రగతి కాంక్ష.. సాగాలి నిరంతర దీక్ష
[ 02-06-2024]
తెలంగాణ డయగ్నొస్టిక్ కేంద్రాల ద్వారా ఇప్పటివరకు జిల్లాలో 1,05,103 మందికి వివిధ రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. వికారాబాద్ వైద్య కళాశాలకు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) అనుమతి మంజూరు చేసింది. -
ఫలితాల వెల్లడికి సర్వం సన్నద్ధం
[ 02-06-2024]
రాజధాని పరిధిలోని నాలుగు ఎంపీ స్థానాలు, ఓ అసెంబ్లీ నియోజకవర్గం ఓట్ల లెక్కింపునకు సమయం ఆసన్నమైంది. సుమారు ఆరు వేల మంది ఉద్యోగులు ఈనెల 4న ఓట్ల లెక్కింపులో పాల్గొననున్నారు. -
బుల్కాపూర్ నాలా బఫర్ జోన్ కబ్జా
[ 02-06-2024]
నగరానికి చెందిన వరద నీటిని మోసుకెళ్లే ప్రధాన కాలువల్లో బుల్కాపూర్ నాలా కీలకమైంది. శతాబ్దాల క్రితమే నగర ప్రజలను వరద ముంపు నుంచి కాపాడేందుకు ప్రణాళికాబద్ధంగా నాటి నిజాం పాలకులు తవ్వించగా.. -
డబ్బులిచ్చుకో.. నిరభ్యంతరంగా పత్రాలు పుచ్చుకో
[ 02-06-2024]
రాజధాని నగరం శివారు ప్రాంతాల్లోని చెరువులు..వాగుల్లో రియల్ వెంచర్లు వేసుకునేందుకు ఇరిగేషన్ శాఖ అధికారులు సహకరించారు. -
దేశ భద్రతకు మూలస్తంభాలుగా నిలవాలి
[ 02-06-2024]
సవాళ్లను అధిగమించేందుకు కృషి, పట్టుదల, ఐక్యత, చిత్తశుద్ధి దేశ భద్రతకు మూలస్తంభాలుగా నిలుస్తాయని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్)ఎయిర్ పోర్టు సెక్టార్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ప్రవీర్ రంజన్ తెలిపారు. -
రౌడీషీటర్ హత్యకు పథక రచన
[ 02-06-2024]
ఇద్దరు రౌడీషీటర్ల మధ్య తలెత్తిన గొడవతో ఒకరిపై మరొకరు పగ పెంచుకున్నారు. వారిలో ఒకరి హత్యకు పథకం వేసి అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. -
ఉచిత న్యాయం.. మరింత చేరువ
[ 02-06-2024]
కాలంతోపాటు నేరాలు, అసాంఘిక కార్యకలాపాలు పెరుగుతున్నాయి. వీటివల్ల బాధితులకు సత్వర న్యాయం జరగాలి. ఈ నేపథ్యంలో జిల్లాలో న్యాయసేవలు విస్తృతమవుతున్నాయి. -
యాప్లతో డ్రగ్స్ సరఫరా
[ 02-06-2024]
రెండు వేర్వేరు కేసుల్లో నగరంలో డ్రగ్స్ విక్రయిస్తున్న వి.లక్ష్మిపతి(28), ఒకారో కాస్మోస్ రమ్సీ(38)లను టీఎస్ న్యాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. -
పనిచేసే సంస్థకు ఉద్యోగుల కన్నం
[ 02-06-2024]
డిజిటల్ చెల్లింపులకు సంబంధించిన క్యూఆర్ కోడ్ మార్చేసి ప్రైవేటు సంస్థలో రూ.4.15 కోట్లు కొట్టేసిన మోసంలో సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం(ఈవోడబ్ల్యూ) పోలీసులు ఇద్దర్ని అరెస్టు చేశారు. -
నకిలీ పాస్పోర్టుల కుంభకోణంలో ముగ్గురి అరెస్టు
[ 02-06-2024]
నకిలీ పాస్పోర్టుల కుంభకోణంలో తెలంగాణ సీఐడీ మరో ముగ్గుర్ని అరెస్టు చేసింది. ఇందులో ఇద్దరు శ్రీలంక దేశస్థులు ఉండడం గమనార్హం.
తాజా వార్తలు (Latest News)
-
మరోసారి టైం వేస్టు చేసుకోవద్దు: ఎగ్జిట్ పోల్స్ తర్వాత ప్రశాంత్ కిషోర్ స్పందన
-
కౌంటింగ్ నిబంధనలపై కాంగ్రెస్ అభ్యంతరాలు.. స్పష్టతనిచ్చిన ఈసీ
-
తెలంగాణ ప్రజలు బానిసత్వాన్ని భరించరు: ఆవిర్భావ వేడుకల్లో సీఎం రేవంత్
-
ఆధునిక భారతం కళ్లారా చూసిన మరో స్వాతంత్ర్య పోరాటమది: కేటీఆర్
-
సీఎం రేవంత్ నేతృత్వంలో గ్యారంటీలను అమలు చేస్తాం: సోనియాగాంధీ
-
డ్రాగన్ ఘనత.. జాబిల్లి ఆవలివైపు ల్యాండ్ అయిన చాంగే-6..!