పురలో మారిన ముఖచిత్రం
గడిచిన నాలుగేళ్ల జగిత్యాల పురపాలనలో వివిధ పార్టీల కౌన్సిలర్ల బలాబలాలు మారిపోయాయి. అధ్యక్ష పీఠంలో అనూహ్య మార్పులు, పాలకవర్గం కూర్పులో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ నేతలకు సవాల్గా మారాయి.
పార్టీలు మారుతున్న కౌన్సిలర్లు
న్యూస్టుడే, జగిత్యాల పట్టణం: గడిచిన నాలుగేళ్ల జగిత్యాల పురపాలనలో వివిధ పార్టీల కౌన్సిలర్ల బలాబలాలు మారిపోయాయి. అధ్యక్ష పీఠంలో అనూహ్య మార్పులు, పాలకవర్గం కూర్పులో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ నేతలకు సవాల్గా మారాయి. 2020 జనవరి 28న తొలిసారి భారాస(తెరాస) పాలకవర్గం ఏర్పడింది. ఎమ్మెల్యే సంజయ్కుమార్ నేతృత్వంలో 48 వార్డులకు భారాస(తెరాస) 31 వార్డులు, ఆరుగురు స్వతంత్రులుగా విజయం సాధించగా కాంగ్రెస్కు 07, భాజపా 03, ఎంఐఎం ఒక్క స్థానంలో గెలుపొందారు. అధ్యక్ష స్థానం బీసీ మహిళకు కేటాయించడంతో 37వ వార్డు కౌన్సిలర్ శ్రావణికి అవకాశం వచ్చింది. రెండేళ్ల తరువాత ఎమ్మెల్యే సంజయ్, ఛైర్పర్సన్ శ్రావణి మధ్య రాజకీయపరంగా విభేదాలు తలెత్తడంతో ఆమె పార్టీకి, కౌన్సిలర్ పదవికి రాజీనామా చేసి భాజపాలో చేరారు. ఆ తరువాత రెండేళ్లపాటు ఛైర్పర్సన్ పదవి ఎవరికి కేటాయించకపోగా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ను కొనసాగించడం భారాస కౌన్సిలర్లలోనూ వ్యతిరేకత ఏర్పడింది.
- స్వతంత్రులుగా గెలుపొందిన వొల్లెపు రేణుక, వానరాసి మల్లవ్వ, గుగ్గిళ్ల హరీశ్, చాంద్పాషా, భాజపా సభ్యుడు గుర్రం రాము భారాసలో చేరారు. తాజాగా ఛైర్పర్సన్ ఎన్నిక సందర్భంగా పలువురు భారాస కౌన్సిలర్లు అనూహ్యంగా పార్టీ విప్ను ధిక్కరించి కాంగ్రెస్కు అనుకూలంగా ఓటు వేయడంతో భారాస కౌన్సిలర్ తిరుగుబాటు 36వ వార్డు కౌన్సిలర్ అడువాల జ్యోతిని అధ్యక్ష పీఠం వరించింది. ఈ పరిణామంతో అధ్యక్షురాలు జ్యోతితోపాటు ఏకంగా 13 మంది భారాస కౌన్సిలర్లు కాంగ్రెస్లో చేరారు. ఇందులో భారాసతోపాటు, భాజపా, స్వతంత్రులు సైతం ఉన్నారు.
పుంజుకున్న కాంగ్రెస్
2020లో పురపగ్గాలు చేపట్టిన సందర్భంలో 31 స్థానాలు గెలిచిన భారాస ప్రస్తుతం 22 స్థానాలకు చేరి అధ్యక్ష పీఠం చేజార్చుకుంది. అప్పుడు ఏడు స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్ సంఖ్య 23కు చేరడంతోపాటు అధ్యక్ష స్థానం దక్కించుకుంది. పుర ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పార్టీని వీడుతున్న కౌన్సిలర్ల సంఖ్యతో పలు పార్టీల్లో అంతర్మథనం మొదలైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉద్యమస్ఫూర్తి.. చైతన్యకీర్తి
[ 02-06-2024]
పల్లె గొంతెత్తింది.. పట్నం కదిలింది.. రోడ్లు స్తంభించాయి.. వంటావార్పులకు దారులే అడ్డాగా మారాయి. -
జై బోలో హనుమాన్కీ
[ 02-06-2024]
‘ఓం శ్రీరామ జయరామ జయజయ రామా.. రామలక్ష్మణ జానకీ జై బోలో హనుమాన్కీ..’ నినాదాలతో అంజన్న క్షేత్రం మారుమోగింది. -
బడిబాటకు వేళాయె!
[ 02-06-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు పెంచేందుకు ప్రతీ సంవత్సరం లాగానే ప్రభుత్వం బడిబాట కార్యక్రమాన్ని రూపొందించింది. -
సింగరేణిలో మరో పంచ్ ఎంట్రీ
[ 02-06-2024]
సింగరేణిలో మరో పంచ్ ఎంట్రీ గని ఏర్పాటు చేయనున్నారు. -
మూత ‘బడి’కి మోక్షం!
[ 02-06-2024]
ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రతి పంచాయతీలో ఒక ప్రభుత్వ పాఠశాల ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జనవరిలోనే విద్యాశాఖను ఆదేశించారు. -
సాంకేతిక కోర్సులు.. ఉపాధికి బాటలు
[ 02-06-2024]
వారంతా పాఠశాల స్థాయిలో నేర్చుకున్న పాఠాలను ఉపాధి, ఉద్యోగాలుగా మలుచుకోవడానికి వచ్చిన అభ్యర్థులు. -
పుస్తక పఠనం.. బాలల వికాసం
[ 02-06-2024]
నేటికాలం పిల్లలు పాఠ్యపుస్తకాలు తప్పితే కథలు, గేయాలు, జీవిత చరిత్రలు వంటి ఆలోచింపజేసే పుస్తకాలకు దూరంగా ఉంటున్నారు. -
5 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం
[ 02-06-2024]
నకిలీ విత్తనాలు అక్రమంగా రవాణా చేసిన నిందితులను శనివారం అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
మరోసారి టైం వేస్టు చేసుకోవద్దు: ఎగ్జిట్ పోల్స్ తర్వాత ప్రశాంత్ కిషోర్ స్పందన
-
కౌంటింగ్ నిబంధనలపై కాంగ్రెస్ అభ్యంతరాలు.. స్పష్టతనిచ్చిన ఈసీ
-
తెలంగాణ ప్రజలు బానిసత్వాన్ని భరించరు: ఆవిర్భావ వేడుకల్లో సీఎం రేవంత్
-
ఆధునిక భారతం కళ్లారా చూసిన మరో స్వాతంత్ర్య పోరాటమది: కేటీఆర్
-
సీఎం రేవంత్ నేతృత్వంలో గ్యారంటీలను అమలు చేస్తాం: సోనియాగాంధీ
-
డ్రాగన్ ఘనత.. జాబిల్లి ఆవలివైపు ల్యాండ్ అయిన చాంగే-6..!