అస్త్రం సంధించి.. ఆదర్శంగా నిలిచి..
ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత శక్తిమంతమైన ఓటు అస్త్రాన్ని సంధించడంలో పల్లెలు ముందు వరుసలో నిలుస్తున్నాయి.
ఓటు హక్కు వినియోగంలో గ్రామీణుల చైతన్యం
గత ఎన్నికల్లో పెద్దపల్లిలో ఓటింగ్ సరళి
మంథని నియోజకవర్గంలో ఎండలో బారులు తీరిన ఓటర్లు (పాతచిత్రం)
న్యూస్టుడే, పెద్దపల్లి కలెక్టరేట్: ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత శక్తిమంతమైన ఓటు అస్త్రాన్ని సంధించడంలో పల్లెలు ముందు వరుసలో నిలుస్తున్నాయి. ఓటుహక్కు వినియోగించుకోవడానికి విద్యావంతులైన పట్నం వాసులు బద్దకిస్తుంటే గ్రామీణ ప్రాంత ప్రజలు బారులు తీరుతున్నారు. బతుకుదెరువు కోసం దూర ప్రాంతాలకు వెళ్లిన వారు కూడా బాధ్యతను మరచిపోకుండా సొంతూరి బాట పడుతున్నారు.
గత లోక్సభ ఎన్నికల్లో ఓటింగ్ సరళిని పరిశీలిస్తే పెద్దపల్లి నియోజకవర్గంలో గ్రామీణ ఓటర్లే ఆదర్శంగా నిలిచారు. గరిష్ఠంగా రామగుండం సెగ్మెంటులోని రాయదండిలో అత్యధికంగా 92.63 శాతం నమోదు కాగా పెద్దపల్లి పట్టణ సమీపంలోని బంధంపల్లిలో అత్యల్పంగా 2.47 శాతం పోలింగ్ నమోదైంది.
పల్లె జనం.. సంకల్ప బలం
రాయదండి పోలింగ్ కేంద్రంలో 188 మంది పురుషులు, 192 మంది మహిళలు కలిపి మొత్తం 380 మంది ఓటర్లుండగా 352 మంది ఓటేశారు. బెల్లంపల్లి నియోజకవర్గంలోని బెజ్జల్లో 91.19 శాతం, సోనాపూర్లో 90.95 శాతంతో రెండు, మూడో స్థానాల్లో నిలిచారు. ఈ మూడు గ్రామాల్లో జనాభా తక్కువగా ఉన్నా ఐకమత్యం, ఓటు వేయాలనే సంకల్పం బలంగా ఉండటంతో అధిక పోలింగ్ శాతం నమోదైంది. చెన్నూర్లో 48.31 శాతం, మంచిర్యాల నియోజకవర్గంలోని నస్పూర్లో 29.64 శాతం, రామగుండంలోని శాంతినికేతన్ పోలింగ్ కేంద్రంలో 27.48 శాతం నమోదైంది. పట్టణ, నగర ప్రాంత ఓటర్లు నిర్లిప్తంగా వ్యవహరిస్తుండటం పోలింగ్ శాతం పడిపోవడానికి కారణమవుతోంది.
115 చోట్ల 80 శాతానికి పైగా..
అయిదేళ్ల కిందట పెద్దపల్లి లోక్సభ స్థానం పరిధిలో 14,78,062 మంది ఓటర్లుండగా 9,67,801 (65 శాతం) మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరిలో పురుషులు 4,83,726 మంది, మహిళలు 4,84,059 మంది, 16 మంది ఇతరులున్నారు. ఏడు సెగ్మెంట్ల పరిధిలోని 115 పోలింగ్ కేంద్రాల్లో 80 శాతం కంటే అధికంగా పోలింగ్ నమోదైంది. బెల్లంపల్లిలో 28 చోట్ల, చెన్నూర్లో 32, మంచిర్యాలలో 7, ధర్మపురిలో 8, రామగుండంలో 1, మంథనిలో 25, పెద్దపల్లిలో 14 పోలింగ్ కేంద్రాల్లో నమోదు ఉంది. రామగుండం, మంచిర్యాల నియోజకవర్గాల్లోని ఎక్కువ చోట్ల 70 శాతం కంటే తక్కువ పోలింగ్ నమోదైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉద్యమస్ఫూర్తి.. చైతన్యకీర్తి
[ 02-06-2024]
పల్లె గొంతెత్తింది.. పట్నం కదిలింది.. రోడ్లు స్తంభించాయి.. వంటావార్పులకు దారులే అడ్డాగా మారాయి. -
జై బోలో హనుమాన్కీ
[ 02-06-2024]
‘ఓం శ్రీరామ జయరామ జయజయ రామా.. రామలక్ష్మణ జానకీ జై బోలో హనుమాన్కీ..’ నినాదాలతో అంజన్న క్షేత్రం మారుమోగింది. -
బడిబాటకు వేళాయె!
[ 02-06-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు పెంచేందుకు ప్రతీ సంవత్సరం లాగానే ప్రభుత్వం బడిబాట కార్యక్రమాన్ని రూపొందించింది. -
సింగరేణిలో మరో పంచ్ ఎంట్రీ
[ 02-06-2024]
సింగరేణిలో మరో పంచ్ ఎంట్రీ గని ఏర్పాటు చేయనున్నారు. -
మూత ‘బడి’కి మోక్షం!
[ 02-06-2024]
ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రతి పంచాయతీలో ఒక ప్రభుత్వ పాఠశాల ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జనవరిలోనే విద్యాశాఖను ఆదేశించారు. -
సాంకేతిక కోర్సులు.. ఉపాధికి బాటలు
[ 02-06-2024]
వారంతా పాఠశాల స్థాయిలో నేర్చుకున్న పాఠాలను ఉపాధి, ఉద్యోగాలుగా మలుచుకోవడానికి వచ్చిన అభ్యర్థులు. -
పుస్తక పఠనం.. బాలల వికాసం
[ 02-06-2024]
నేటికాలం పిల్లలు పాఠ్యపుస్తకాలు తప్పితే కథలు, గేయాలు, జీవిత చరిత్రలు వంటి ఆలోచింపజేసే పుస్తకాలకు దూరంగా ఉంటున్నారు. -
5 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం
[ 02-06-2024]
నకిలీ విత్తనాలు అక్రమంగా రవాణా చేసిన నిందితులను శనివారం అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
మరోసారి టైం వేస్టు చేసుకోవద్దు: ఎగ్జిట్ పోల్స్ తర్వాత ప్రశాంత్ కిషోర్ స్పందన
-
కౌంటింగ్ నిబంధనలపై కాంగ్రెస్ అభ్యంతరాలు.. స్పష్టతనిచ్చిన ఈసీ
-
తెలంగాణ ప్రజలు బానిసత్వాన్ని భరించరు: ఆవిర్భావ వేడుకల్లో సీఎం రేవంత్
-
ఆధునిక భారతం కళ్లారా చూసిన మరో స్వాతంత్ర్య పోరాటమది: కేటీఆర్
-
సీఎం రేవంత్ నేతృత్వంలో గ్యారంటీలను అమలు చేస్తాం: సోనియాగాంధీ
-
డ్రాగన్ ఘనత.. జాబిల్లి ఆవలివైపు ల్యాండ్ అయిన చాంగే-6..!