ఉల్లి రైతుకు కన్నీరు
ఆరుగాలం కష్టపడి పండించిన ఉల్లి ధరలు తగ్గటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రోజురోజుకు మార్కెట్లో ఉల్లి ధరలు పడిపోతుండటంతో రైతులకు పెట్టుబడి కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది.
ధర పడిపోయి తీవ్ర నష్టం
న్యూస్టుడే, దేవరకద్ర గ్రామీణం : ఆరుగాలం కష్టపడి పండించిన ఉల్లి ధరలు తగ్గటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రోజురోజుకు మార్కెట్లో ఉల్లి ధరలు పడిపోతుండటంతో రైతులకు పెట్టుబడి కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ప్రభుత్వం ఉల్లికి మద్దతు ధర కల్పించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. దేవరకద్ర మార్కెట్ యార్డుకు దేవరకద్ర, చిన్నచింతకుంట, మరికల్, కోయిలకొండ మండలాల్లో రైతులు పండించిన ఉల్లి విక్రయించేందుకు తీసుకువస్తుంటారు. నెల కిందట క్వింటా ఉల్లికి రూ.3వేల వరకు వచ్చిన ధర ఇప్పుడు సగానికి పడిపోయింది. ఎకరాలో ఉల్లి సాగుకు రైతులు రూ.45వేల వరకు ఖర్చు చేశారు. ఎకరాలో 35 క్వింటాళ్ల వరకు ఉల్లి దిగుబడి వచ్చింది. క్వింటాకు రూ. 1,200 వరకే ధర పలుకుతోంది. ఎకరాలో పండిన పంటకు రూ.42వేలే వస్తోంది. సాగు ఖర్చులు పెరిగినా మార్కెట్లో ఉల్లికి మద్దతు ధర లభించకపోవడంతో రైతులు కంటతడి పెడుతున్నారు.
పెట్టుబడి కూడా రాలేదు..
- కొండన్న, గూరకొండ
ఎకటిన్నర ఎకరాలో ఉల్లి సాగుచేశా. రూ.50వేలు ఖర్చు చేయగా 42 క్వింటాళ్ల ఉల్లి పండింది. మార్కెట్లో క్వింటా రూ.1,200 చొప్పున విక్రయించడంతో రూ.50,400 ఆదాయం వచ్చింది. పెట్టుబడి కంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ రాలేదు. ప్రభుత్వం ఉల్లి రైతులకు మద్దతు ధర ఇచ్చి ఆదుకోవాలి.
ప్రభుత్వం ఆదుకోవాలి..
- వెంకటేశ్, గూరకొండ
ఉల్లి రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలి. గత నెలతో పోల్చితే ఉల్లి ధరలు బాగా తగ్గిపోయాయి. తగినంత సాగునీరు అందక ఉల్లి పంట దిగుబడి సగం పడిపోయింది. మార్కెట్లో ధరలు లేకపోవడంతో పెట్టుబడి కూడా రావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస నాయకుల సంబరాలు
[ 02-06-2024]
ఉమ్మడి పాలమూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా భారాసకు చెందిన నవీన్ కుమార్ రెడ్డి గెలుపొందారు. -
పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల కోసం ఏర్పాట్లు పూర్తి
[ 02-06-2024]
సోమవారం నుంచి జిల్లాలో పదో తరగతి విద్యార్థులకు అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. -
గద్వాలలో నటుడు సుమన్ సందడి
[ 02-06-2024]
గద్వాల పట్టణంలో ఆదివారం ప్రముఖ సినీ నటుడు సుమన్ సందడి చేశారు. -
ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు
[ 02-06-2024]
గద్వాల పట్టణంలోని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించారు. -
ప్రగతి విరిసేలా.. పాలమూరు మెరిసేలా!
[ 02-06-2024]
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి పదేళ్లు పూర్తయ్యింది. ఈ పదేళ్ల ప్రస్థానంలో ఉమ్మడి మహబూబ్నగర్లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. పలు రంగాల్లో ప్రగతి దశగా అడుగులు పడ్డాయి. -
సమగ్ర వికాసమే సంకల్పం
[ 02-06-2024]
రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల వేళ తమ నియోజక వర్గ సర్వతో ముఖాభివృద్ధే ధ్యేయమని పాలమూరు శాసనసభ్యులు అంటు న్నారు. ప్రధానంగా సాగునీటి వనరులపై దృష్టి సారిస్తామంటున్నారు. -
ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియకు భారీ భద్రత
[ 02-06-2024]
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపునకు పోలీసు శాఖ భారీ బందోబస్తు చేపడుతున్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం నుంచి ముగిసే వరకు అవాంఛనీయ ఘటనలు -
ఆవిర్భావ వేడుకలకు ముస్తాబు
[ 02-06-2024]
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు పాలమూరు పట్టణం ముస్తాబైంది. తెలంగాణ, అంబేడ్కర్, క్లాక్టవర్, వన్టౌన్, కూడళ్లను రంగురంగుల విద్యుత్తు దీపాలతో అలంకరించారు. -
డబ్బాలతోనే రండి.. మాంసం తీసుకెళ్లండి
[ 02-06-2024]
చికెన్, మటన్ కొనడానికి వెళ్లేందుకు ఇక నుంచి వట్టి చేతులతో వెళ్లవద్దని, స్టీల్ డబ్బాలు వెంట తీసుకెళ్లాలని మహబూబ్నగర్ పురపాలక సంఘం పట్టణవాసులను కోరుతోంది. -
విద్యుత్తు శాఖలో ప్రతి పనికి ఓ రేటు!
[ 02-06-2024]
విద్యుత్తు కనెక్షన్ లేని ఇల్లు బహుశ ఉండదేమో. అదే, ఆ శాఖ అధికారులు కొందరికి కలిసి వస్తోంది. నిబంధనల పేరుతో జాప్యం చేయడం.. చేయి తడిపితే పనులు చకచకా చేయడం వారికి సాధారణమైంది. -
చినుకు.. పడితే వణుకే!
[ 02-06-2024]
పట్టణాల్లో రహదారి పక్కనున్న కాలువ చిన్నదే అయినప్పటికీ అది సక్రమంగా లేకపోతే ఎదురయ్యే సమస్య తీవ్రంగా ఉంటుంది. ఏళ్ల తరబడి నుంచి పట్టణాల్లో నివసిస్తున్న వారికి వర్షం పడితే దడే. -
లోతట్టు కాలనీలపై దృష్టేది?
[ 02-06-2024]
వర్షాల నేపథ్యంలో పురపాలకల్లోని లోతట్టు కాలనీల్లో ఆందోళన నెలకొంది. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని పురపాలక పారిశుద్ధ్య సిబ్బంది వార్డుల్లోని మురుగు కాల్వలు శుభ్రం చేస్తున్నారు -
వానాకాలం.. వ్యాధుల ముప్పు
[ 02-06-2024]
రుతువులతోపాటు వాతావరణంలో ఏర్పడే మార్పుల వల్ల వచ్చే వ్యాధులే సీజనల్ రుగ్మతలు. అందులోనూ వానాకాలంలో దోమల వృద్ధి అపారంగా ఉంటుంది.
తాజా వార్తలు (Latest News)
-
అత్యధిక సబ్స్క్రైబర్లున్న యూట్యూబ్ ఛానల్గా మిస్టర్బీస్ట్
-
ఏపీలోకి నైరుతి రుతుపవనాలు.. పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు
-
మంత్రి కోమటిరెడ్డి ఆరోపణలు రుజువు చేస్తే.. ముక్కు నేలకు రాస్తా: హరీశ్రావు
-
‘మాపై దాడి చేయొద్దు’: రవీనా టాండన్ విజ్ఞప్తి.. వీడియో వైరల్
-
ఏపీలో 3 రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM