విద్వేషాలు సృష్టిస్తున్న భాజపా: మంత్రి ఉత్తమ్
మతాన్ని అడ్డు పెట్టుకొని భాజపా విద్వేషాలు సృష్టిస్తుందని, మరో అవకాశం ఇస్తే రిజర్వేషన్లకు తూట్లు పడతాయని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పేర్కొన్నారు.
మునగాల ప్రచార సభలో మాట్లాడుతున్న మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, చిత్రంలో అభ్యర్థి రఘువీర్రెడ్డి, తదితరులు
నడిగూడెం, మోతె, మునగాల, న్యూస్టుడే: మతాన్ని అడ్డు పెట్టుకొని భాజపా విద్వేషాలు సృష్టిస్తుందని, మరో అవకాశం ఇస్తే రిజర్వేషన్లకు తూట్లు పడతాయని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పేర్కొన్నారు. గురువారం నడిగూడెం, మోతె, మునగాలలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడారు. నడిగూడెం మండలంలో ఉన్న అన్ని లిఫ్ట్ ఇరిగేషన్లకు మరమ్మతులు చేయించి, చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తానన్నారు. మోదీ మరోసారి ప్రధాని అయితే దేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందన్నారు. తెలంగాణ అభివృద్ధికి సహకరించని మోదీ, అమిత్షాకు ఇక్కడ తిరిగే అర్హతలేదన్నారు. సీపీఎం, మిత్రపక్షాల సహకారంతో తెలంగాణలో 15 లోక్సభ స్థానాల్లో గెలుపొందనున్నట్లు తెలిపారు. మాజీ మంత్రి జానారెడ్డి మాట్లాడుతూ.. దేశాన్ని పాలించాలని కలలు గన్న కేసీఆర్ను తెలంగాణ ప్రజలు ఇంటికే పరిమితం చేశారని, అలాగే మోదీని గద్దెదించాలన్నారు. దేశసంపదను కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెట్టి, నిరుద్యోగులను మోసం చేసిన భాజాపాను ఓడించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి పేర్కొన్నారు. ఎంపీ అభ్యర్థి రఘువీర్రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి, సూర్యాపేట, నల్గొండ జిల్లాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న, శంకర్ నాయక్, పీసీసీ కార్యదర్శి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే చందర్రావు, సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
కోదాడ: ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధే కనిపిస్తోందని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, నల్గొండ ఎంపీ అభ్యర్థి రఘువీర్రెడ్డి అన్నారు. పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. అనంతరం అక్కడి నుంచి రంగా థియేటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. నల్గొండ అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ గెలుపుతోనే సాధ్యం అవుతుందన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి జానారెడ్డి, ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీనారాయణ, పట్టణ అధ్యక్షుడు రామారావు, తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రేమను పంచండి..విలువలతో పెంచండి
[ 01-06-2024]
విశ్వంలో స్వార్థం లేని ప్రేమ చూపేది కేవలం అమ్మానాన్న మాత్రమే. పిల్లలను తల్లిదండ్రులు అపురూపంగా చూసుకుంటారు. -
లఘుచిత్రం.. దివ్యాంగులకు మణిహారం
[ 01-06-2024]
పుట్టుకతోనే దివ్యాంగుడైనా.. అతడి ఆలోచన అందరికీ ఆదర్శంగా నిలిచింది. తన లాంటి వారికి ఉపయోగపడేలా ఒక యూట్యూబ్ ఛానల్ ఏర్పాటుకు దారితీసింది. -
దేవాలయ భూములకు ఇక పాస్బుక్
[ 01-06-2024]
ఆక్రమణలకు గురైన దేవాలయాల స్థలాలను స్వాధీనం చేసుకొని, వాటికున్న వివాదాలు పరిష్కరించి పట్టా పాసు పుస్తకాలు జారీ చేయాలని దేవాదాయ, అటవీశాఖ మంత్రి కొండా సురేఖ ఆ శాఖ ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో ఆదేశాలు జారీచేశారు -
కొలిమిని తలపించె..!
[ 01-06-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లా శుక్రవారం నిప్పుల కొలిమిలా మారింది. అనేక ప్రాంతాల్లో 45 డిగ్రీల పైనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
వైటీపీఎస్లో దొంగతనాలకు పాల్పడుతున్న 11 మంది అరెస్టు
[ 01-06-2024]
దామరచర్ల ప్రాంతంలోని వైటీపీఎస్లో పథకం ప్రకారం అల్యూమినీయం, జీఐ వైరు డీసీఎంలలో తరలించి అమ్మకాలు చేస్తున్న 11 మందిని అరెస్టు చేసినట్లు ఎస్పీ చందనా దీప్తి తెలిపారు. -
పత్తి పడిపోతోంది.. వరి పెరుగుతోంది
[ 01-06-2024]
వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు వ్యవసాయంలోనూ మార్పులు చేసుకుంటున్నారు. ఆర్థిక భారం మీద పడకుండా పంటల మార్పిడితో జాగ్రత్త పడుతున్నారు -
యాదాద్రిలో అమ్మవారికి ఆరాధనలు
[ 01-06-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో స్వయంభువులైన పంచనారసింహులను కొలుస్తూ శుక్రవారం నిత్యపూజలతో పాటు అమ్మవారిని ఆరాధిస్తూ ప్రత్యేక క్రతువులను ఆచారంగా కొనసాగించారు. -
బడి బస్సు భద్రమేనా..?
[ 01-06-2024]
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థల పునఃప్రారంభానికి ఆయా సంస్థలు సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే పలు సంస్థలు ప్రచారాలు సైతం ప్రారంభించాయి. -
రైతులకు చేయూత.. అతివలకు ఉపాధి
[ 01-06-2024]
సాగునీటి వనరులున్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో రైతులు ఎక్కువగా వరి, పత్తి సాగు చేస్తున్నారు. పండ్లు, కూరగాయలు తక్కువగా పండిస్తున్నారు -
శిథిల భవనాలు.. అరకొర వసతులు
[ 01-06-2024]
శిథిల భవనాలు, ఇరుకైన తరగతి గదులు.. సరిపడా అధ్యాపకులు లేకుండా.. అరకొర సౌకర్యాలతో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. -
విలువైన సామగ్రి మాయం.. ఇంటిదొంగల ప్రమేయం
[ 01-06-2024]
నిర్మాణంలో ఉన్న యాదాద్రి థర్మల్ విద్యుత్తు ప్లాంటు (వైటీపీఎస్)లో రూ.కోట్ల విలువైన సామగ్రి మాయమవుతోంది. నిత్యం ఎస్పీఎఫ్(ప్రత్యేక రక్షణ దళం) పర్యవేక్షణలో ఉన్న ప్లాంటులో వరుస చోరీలు జరుగుతుండటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
కదిలిన యంత్రాంగం
[ 01-06-2024]
రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ విత్తనాలతో పాటూ పత్తి, ఇతర పంటల విత్తనాల కొరత ఉందని చర్చ సాగుతున్న నేపథ్యంలో.. మూడు జిల్లాల కలెక్టర్లు శుక్రవారం క్షేత్రస్థాయిలో విత్తనాల సరఫరా పరిస్థితిని సమీక్షించారు.
తాజా వార్తలు (Latest News)
-
సినిమా థియేటర్లలో లోక్సభ ఎన్నికల ఫలితాలు!
-
మన గుడిలో పూజ.. దిల్లీ సంస్థ సేవ!
-
ఉద్యోగాలమ్ముకుంటున్న ఎంపీ వంగా గీత: మాజీ ఎమ్మెల్యే వర్మ
-
అదృశ్యమైన కోటా విద్యార్థి.. 23 రోజులు.. దేశమంతా చక్కర్లు కొట్టి!
-
భారత ఎన్నికలపై కోవర్ట్ ఆపరేషన్.. ఓపెన్ఏఐ సంచలన నివేదిక
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/06/24)