ఉద్యోగుల ఓట్లకు వైకాపా బేరసారాలు
ఉద్యోగులు, ఉపాధ్యాయుల పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు అధికార వైకాపా బేరసారాలు సాగిస్తోంది. తమ విధానాలపై గుర్రుగా ఉన్న ఆయా వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తోంది.
నెల్లూరు(కలెక్టరేట్), న్యూస్టుడే: ఉద్యోగులు, ఉపాధ్యాయుల పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు అధికార వైకాపా బేరసారాలు సాగిస్తోంది. తమ విధానాలపై గుర్రుగా ఉన్న ఆయా వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 19,834 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉండగా- వాటి వినియోగంలో గందరగోళానికి గురవుతున్నారు. ఎక్కువ సంఖ్యలో ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. చాలా మందికి బ్యాలెట్ విడుదల కాలేదు. ఈ క్రమంలో మొత్తం 19,834 ఓట్లకు.. ఆది, సోమవారాల్లో 14,541 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఇతర జిల్లాల ఓటర్లు 2,548 ఉండగా- 1,374 మంది ఓటు వేశారు. సోమవారం కావలి జడ్పీ హైస్కూల్లో ఓటింగ్ ప్రక్రియ గంట ఆలస్యంగా ప్రారంభమవగా- ఉద్యోగులు అవస్థలు పడ్డారు. ఈ కేంద్రం వద్దనే.. కొందరు నాయకులు డబ్బు పంపిణీ చేయడం చర్చనీయాంశమైంది. వెంకటాచలం క్యూబా ఇంజినీరింగ్ కళాశాల వద్ద తెదేపా ఏజెంట్ను పోలీసులు బయటకు పంపడం స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది.
అధికార పార్టీ ఆపసోపాలు
కందుకూరు, నెల్లూరు గ్రామీణం, ఆత్మకూరు, సర్వేపల్లి, కావలి నియోజకవర్గాల్లో ఒక్కో పోస్టల్ బ్యాలెట్కు అధికార పార్టీ నాయకులు రూ.అయిదు వేలు ఇవ్వడంతో పాటు.. ఓటు వేసేందుకు కార్లు కూడా సమకూర్చినట్లు సమాచారం. ఆ క్రమంలో కొందరు ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆ మొత్తాలను తిరస్కరించినట్లు తెలిసింది. పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకుంటున్న వారిలో ఎక్కువ శాతం మంది ఉపాధ్యాయులు ఉండటం.. సీపీఎస్ ఆందోళన నేపథ్యంలో వారిపై వైకాపా ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం తదితరాలతో తమకు అనుకూలంగా ఉండరనే నెపంతో గందరగోళానికి, ఇబ్బందులకు గురి చేస్తున్నారనే ఆరోపిస్తున్నారు. అధికార పార్టీకే ఓటు వేసినట్లు చరవాణిలో ఫొటోలు తీసి తమకు పంపాలని కొన్ని సంఘాల నాయకులు ఉద్యోగులను కోరారన్న సమాచారం వివాదాస్పదమవుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిబంధనల మేరకు కౌంటింగ్ ఏర్పాట్లు
[ 02-06-2024]
ఎన్నికల సంఘం నిబంధనల మేరకు కౌంటింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరినారాయణన్ తెలిపారు. శనివారం కనుపర్తిపాడులోని ప్రియదర్శిని కళాశాలలోని కౌంటింగ్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. -
గంటల వ్యవధిలో దంపతుల మృతి
[ 02-06-2024]
ఏ కష్టం వచ్చినా కలసి ఉంటామని మనువాడేటప్పుడు బాస చేసుకున్న ఆ దంపతులు ఒక్కటిగానే ఇహం వీడి పరం చేరారు. భార్య కన్నుమూతతో కలత చెందిన భర్త కూడా ఆమె మృతదేహంపై రోదిస్తూ తుది శ్వాస విడిచారు. -
సోమశిల.. సాగుకెలా?
[ 02-06-2024]
ఇండోసోల్ సోలార్ ప్యానల్స్ తయారీ పరిశ్రమకు 115 ఎంఎల్డీ నీటిని కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో.. సోమశిల జలాశయం నీటి కేటాయింపులు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. పరిశ్రమల రాకతో ప్రగతికి బాటలు పడతాయని ఓ వర్గం అంటుండగా- ఈ ఏడాది ఎదురైన వర్షాభావ పరిస్థితులు.. -
భజే వాయుపుత్రం
[ 02-06-2024]
జిల్లా వ్యాప్తంగా శనివారం హనుమజ్జయంతిని ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. అంజనీ సుతుని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్గామిట్టలోని శబరి శ్రీరామ క్షేత్రంలో సామూహిక లక్ష మల్లెలార్చన నిర్వహించగా.. -
జమకాని సొమ్ము... జవాబు చెప్పేవారు లేరు!
[ 02-06-2024]
జూన్ నెలకూ సామాజిక భద్రత పింఛన్లను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించగా- ఈసారి పింఛనుదారులు ఇబ్బందులు పడ్డారు. అధిక ఉష్ణోగ్రతలు.. ఉక్కపోత మధ్య బ్యాంకుల వద్దకు చేరిన లబ్ధిదారులు.. -
కలగానే సొంత భవనాలు
[ 02-06-2024]
సంగంలోని ప్రభుత్వ ఆశ్రమ ఐటీఐకి సొంత భవనాలు కలగానే మిగిలాయి. ఏళ్లుగా పరాయి పంచనే తరగతులు నిర్వహిస్తున్నా.. ఐటీఐకి కేటాయించిన స్థలంపై కబ్జాదారులు కన్నేసి ప్రయత్నాలు చేస్తున్నా.. అదే సమయంలో గ్రావెల్ దొంగలు గుల్ల చేస్తున్నా.. -
నిబంధనలకు నీళ్లు
[ 02-06-2024]
జాతీయ రహదారి నిర్మాణంలో గుత్తేదారులు నిబంధనలకు నీళ్లొదిలారు. మట్టి తరలింపులో అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. అనుమతులు లేకుండా తవ్వకాలు సాగిస్తున్నారు. ప్రభుత్వానికి సీనరేజీ చెల్లించకుండా తీసుకెళుతున్నారు. -
అతివేగంతో అదుపుతప్పిన ట్రావెల్స్ బస్సు
[ 02-06-2024]
పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 11మందికి గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. కామాక్షి ట్రావెల్స్కు చెందిన బస్సు 40 మంది ప్రయాణికులతో శుక్రవారం అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరి శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరుకు వస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
అత్యధిక సబ్స్క్రైబర్లున్న యూట్యూబ్ ఛానల్గా మిస్టర్బీస్ట్
-
ఏపీలోకి నైరుతి రుతుపవనాలు.. పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు
-
మంత్రి కోమటిరెడ్డి ఆరోపణలు రుజువు చేస్తే.. ముక్కు నేలకు రాస్తా: హరీశ్రావు
-
‘మాపై దాడి చేయొద్దు’: రవీనా టాండన్ విజ్ఞప్తి.. వీడియో వైరల్
-
ఏపీలో 3 రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM