ఐదంచెల భద్రతా వ్యవస్థ
లోక్సభ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఐదంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు కామారెడ్డి ఎస్పీ సీహెచ్ సింధూశర్మ పేర్కొన్నారు.
ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు ప్రత్యేక కార్యాచరణ
పౌరులు ఫిర్యాదు చేయవచ్చు: ఎస్పీ సింధూశర్మ
ఈనాడు, కామారెడ్డి
లోక్సభ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఐదంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు కామారెడ్డి ఎస్పీ సీహెచ్ సింధూశర్మ పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలింగ్కేంద్రాల వద్ద భద్రత, ప్రవర్తనా నియమావళి అమలుకు తీసుకుంటున్న చర్యలను ఎస్పీ ఈనాడు ముఖాముఖిలో వెల్లడించారు. వారి మాటల్లోనే...
అదనపు బలగాలు.. బందోబస్తు
ఎన్నికల విధులకు అదనపు బలగాలు వచ్చాయి. వీటితో పాటు సీఎఎస్ఎఫ్ బలగాలు బందోబస్తును పర్యవేక్షిస్తాయి. సాధారణ పోలింగ్ కేంద్రంలో ఇద్దరు, సమస్యాత్మక కేంద్రాల్లో అదనపు బలగాలతో భద్రత ఏర్పాటు చేస్తున్నాం. పోలీస్స్టేషన్కో క్యూఆర్టీ (క్విక్రెస్పాన్స్ టీం)లను సైతం ఏర్పాటు చేస్తున్నాం. వీటితో పాటు ఈవీఎంలను భద్రంగా స్ట్రాంగ్రూంలకు చేర్చేందుకు నిర్దేశిత 64 మార్గాల్లో మొబైల్ టీంలను ఏర్పాటు చేశాం. డీఎస్పీల నేతృత్వంలో డివిజన్ స్థాయిలో స్పెషల్ టాస్క్ఫోర్స్ నిఘా బృందాలు పనిచేయనున్నాయి. జిల్లాస్థాయిలో మరో స్పెషల్ టాస్క్ఫోర్స్ బృందాన్ని నియమించి ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.
సామాజిక మాధ్యమాలపై నిఘా
సామాజిక మాధ్యమాల్లో రాజకీయ పార్టీల నాయకులను కించపర్చేలా, ప్రజలను రెచ్చగొట్టే అంశాలను పోస్టుచేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. సామాజిక మాధ్యమాల్లో నమోదు అవుతున్న రాజకీయ అంశాలకు సంబంధించి ఎవరైనా ఫిర్యాదు చేసినా లేక ఎన్నికల అధికారులు పరిశీలించినా.. సంబంధిత గ్రూప్ అడ్మిన్పై, పోస్టులు నమోదు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకుంటాం. ఇటీవల రాజంపేటలో సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులపై ఫిర్యాదు వస్తే చర్యలు చేపట్టాం.
రూ.1.95 కోట్ల నగదు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ విడుదల నాటి నుంచి నేటి వరకు జిల్లావ్యాప్తంగా 6525 లీటర్ల మద్యంతో పాటు రూ.1.95 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నాం. 1052 గ్రాముల అల్ఫ్రాజోలం, 300 గ్రాముల గంజాయిని పట్టుకున్నారు. వీటితో పాటు 90 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నాం.
పర్యవేక్షణకు కంట్రోల్రూం
ఈ నెల 13న జరిగే పోలింగ్ ప్రక్రియను పరిశీలించేందుకు కేంద్రాల్లో నిఘా కెమెరాలను ఏర్పాటు చేస్తున్నాం. సమస్యాత్మకంగా భావిస్తున్న 64 కేంద్రాల్లో లోన, బయట రెండు చొప్పున కెమెరాలు బిగించనున్నాం. వీటిని ఎప్పటికప్పుడు వీక్షించేందుకు కలెక్టరేట్తో పాటు సహాయఎన్నికల అధికారి కార్యాలయాలైన బాన్సువాడ, కామారెడ్డి, ఎల్లారెడ్డిల్లో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేస్తున్నాం. సాధారణ, పోలీసు పరిశీలకులతో సహా జిల్లా ఎన్నికల అధికారి, రిటర్నింగ్ అధికారులు కంట్రోల్రూమ్లో అందుబాటులో ఉండి పోలింగ్ సరళిని పరిశీలించనున్నారు. ఏదైనా ఘటన జరిగితే అప్రమత్తమయ్యేలా, ఘర్షణల నివారణకు పోలీసు బలగాలను రంగంలోకి దించనున్నాం.
ఉల్లంఘనలపై కేసులు
ఇప్పటివరకు జిల్లాలో 561 మందిని బైండోవర్ చేశాం. ఆయుధాలను స్వాధీనం చేసుకుని ఠాణాల్లో భద్రపరిచాం. భిక్కనూరు ఎంపీపీ కార్యాలయంలో పార్టీపరమైన సమావేశం నిర్వహించారనే ఫిర్యాదుతో పాటు తాడ్వాయిలో రాజకీయ పార్టీ సమావేశం అనంతరం నగదు పంపిణీ చేస్తున్న తీరుపై ఎంసీసీ ఉల్లంఘన కేసులు నమోదు చేశాం. ప్రచార గడువు ముగిసిన తర్వాత రాజకీయ పార్టీల ప్రలోభాలపై సీ-విజిల్ లేదా 1950 కాల్సెంటర్, డయల్ 100 ద్వారా పౌరులు ఫిర్యాదు చేస్తే పరిశీలించి చర్యలు చేపడతాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం
[ 02-06-2024]
నాగిరెడ్డిపేట మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగరవేసి ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. -
ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం
[ 02-06-2024]
తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా నాగిరెడ్డిపేట మండలంలో వేడుకలు నిర్వహించారు. -
కామారెడ్డిలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
[ 02-06-2024]
కామారెడ్డి జిల్లా కేంద్రంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఆదివారం వివిధ పక్షాల ఆధ్వర్యంలో నిర్వహించారు. -
దశదిశలా ప్రగతి సాగాలి
[ 02-06-2024]
ప్రత్యేక రాష్ట్ర సాధన పోరాటంలో ఉమ్మడి నిజామాబాద్ది ప్రత్యేక స్థానం. అభివృద్ధిలోనూ ప్రత్యేక ముద్ర కనిపించినా.. ఆశించిన ఫలితాలు దక్కలేదు. రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తయింది. నేటితో 11వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా వేడుకలు నిర్వహించుకుంటోంది. -
ఉద్యమానికి ఊపిరై.. స్వరాష్ట్ర సాధకులై
[ 02-06-2024]
నిజాం చెర నుంచి విముక్తి కోసం జరిగిన విమోచనోద్యమంలో ఇందూరు ప్రస్థానం ప్రత్యేకమైంది. అప్పటి హైదరాబాద్ రాష్ట్రం ఇండియన్ యూనియన్లో విలీనం అయ్యేవరకు ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు వీరులు పోరాట పటిమతో ఉద్యమం చేపట్టారు. -
రాష్ట్ర గీతం సృష్టికి ఇందూరే స్ఫూర్తి
[ 02-06-2024]
రాష్ట్ర గీతంగా గుర్తించడం అందెశ్రీకి దక్కిన గౌరవం. తెలంగాణ తొలిదశ ఉద్యమానికి దాశరథి ‘‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’’ ఊపిరిలూదితే.. మలి దశ పోరాటంలో అందరిలో స్ఫూర్తి నింపింది అందెశ్రీ గీతం.. -
తండా రోడ్డు తవ్వేశారు...
[ 02-06-2024]
రైతుల మధ్య ఏర్పడిన పంచాయితీ రోడ్డు తవ్వేయడానికి కారణమైంది. మంచిప్పకు చెందిన ఓ రైతు శివలాల్ తండాకు వెళ్లే రోడ్డును పొక్లెయిన్తో శనివారం తవ్వించేశారు. -
ఉపాధి కల్పిస్తానని మోసం
[ 02-06-2024]
కామారెడ్డి జిల్లాకేంద్రంలో దక్కన్ అబ్రాడ్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ పేరిట విదేశాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పి యువతను మోసగించిన ఘటన శనివారం వెలుగుచూసింది. -
డిగ్రీ పరీక్షల్లో ముగ్గురి డిబార్
[ 02-06-2024]
తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో శనివారం జరిగిన డిగ్రీ పరీక్షల్లో నిజామాబాద్లోని ఇందూరు ఉషోదయ, బోధన్లోని ఎస్వీ, ఎల్లారెడ్డి ప్రభుత్వ కళాశాల కేంద్రాల్లో ఒక్కొక్కరు చొప్పున విద్యార్థులు చూచిరాతకు పాల్పడుతూ పట్టుబడి డిబార్ అయినట్లు వర్సిటీ అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య చంద్రశేఖర్ తెలిపారు. -
అక్రమ కుళాయిలపై కొరడా
[ 02-06-2024]
నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న అక్రమ కుళాయిలపై కొరడా ఝలిపించేందుకు నగరపాలక సంస్థ కమిషనర్ మకరందు రంగం సిద్ధం చేశారు. -
కలెక్టరేట్లో వేడుకలు
[ 02-06-2024]
తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు కలెక్టరేట్లో నిర్వహిస్తున్నారు. ఈ మేరకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు ఆదివారం ఉదయం 8.45కు వినాయక్నగర్లోని అమరవీరుల
తాజా వార్తలు (Latest News)
-
అత్యధిక సబ్స్క్రైబర్లున్న యూట్యూబ్ ఛానల్గా మిస్టర్బీస్ట్
-
ఏపీలోకి నైరుతి రుతుపవనాలు.. పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు
-
మంత్రి కోమటిరెడ్డి ఆరోపణలు రుజువు చేస్తే.. ముక్కు నేలకు రాస్తా: హరీశ్రావు
-
‘మాపై దాడి చేయొద్దు’: రవీనా టాండన్ విజ్ఞప్తి.. వీడియో వైరల్
-
ఏపీలో 3 రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM