రాయగడ పీఠం ఎవరికి దక్కేనో?
రాయగడ జిల్లా ఒకప్పుడు కాంగ్రెస్కు, ఇప్పుడు బిజద పార్టీలకు కంచు కోటగా మారింది. 2019 ఎన్నికల్లో తప్పా బిజద విజయ కేతనం ఎగరవేస్తూనే ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో 50 వసంతాలకుపైగా చక్రం తిప్పి, ఇప్పుడు పార్టీ జిల్లా అధ్యక్షుడుగా పగ్గాలు చేపట్టిన సీనియర్ నాయకుడు నెక్కంటి భాస్కరరావుకు విధానసభ అభ్యర్థిని అనుసూయ మాఝిని గెలిపించుకోవలసిన పరిస్థితి ఎదురైంది.
బిజద.. కాంగ్రెస్ల మధ్య గట్టి పోటీ
రాయగడ, న్యూస్టుడే
రాయగడ జిల్లా ఒకప్పుడు కాంగ్రెస్కు, ఇప్పుడు బిజద పార్టీలకు కంచు కోటగా మారింది. 2019 ఎన్నికల్లో తప్పా బిజద విజయ కేతనం ఎగరవేస్తూనే ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో 50 వసంతాలకుపైగా చక్రం తిప్పి, ఇప్పుడు పార్టీ జిల్లా అధ్యక్షుడుగా పగ్గాలు చేపట్టిన సీనియర్ నాయకుడు నెక్కంటి భాస్కరరావుకు విధానసభ అభ్యర్థిని అనుసూయ మాఝిని గెలిపించుకోవలసిన పరిస్థితి ఎదురైంది. 2019 ఎన్నికల్లో రాష్ట్రమంతటా బిజద హవా కొనసాగినా ఇక్కడ మాత్రం బిజద ఓటమి పాలైంది. సీనియర్ నాయకుడు లాల్ బిహారి హిమిరిక రెండోస్థానానికి పడిపోయారు. అనూహ్యంగా స్వతంత్ర అభ్యర్థి మకరంద ముదిలి విజయం సాధించారు. ఇప్పుడు ఆయన పోటీలో లేకపోయినా పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకున్నాయి.
తొలిసారిగా మహిళా అభ్యర్థి
రాయగడ శాసనసభ అభ్యర్థినిగా తొలిసారిగా మహిళకు అవకాశం కల్పించి ముఖ్యమంత్రి మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి పేదలు, ఎస్సీ, ఎస్టీ వర్గాల ఓటు బ్యాంకు కొల్లగొట్టాలని పథకం రూపొందించారు. జిల్లాలో పర్యటించి ఓటర్లలో నూతన ఉత్సాహం నింపారు.
కాంగ్రెస్ పార్టీలో అయోమయం: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సామాజిక కార్యకర్త అప్పలస్వామి కడ్రకకు టికెట్ ఇచ్చారు. పార్టీలో విభేదాలు ఆయన గెలుపును దెబ్బ తీస్తాయేమోనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రాహుల్ పర్యటన రద్దు కూడా కొంత వరకు నష్టం కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
బసంత ఉలక : భాజపా అభ్యర్థిగా గిరిజన యువకుడు బసంత ఉలక 2019 ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వడంతో ఈసారి కూడా ఆయనకే అవకాశం లభించింది. అయోధ్య రామ మందిర ప్రతిష్ఠ జరగడంతో కొన్నివర్గాల ఓట్లు భాజపాకు పడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. మోదీ నవరంగపూర్, బ్రహ్మపుర ప్రచారాల్లో పాల్గొంటున్నా రాయగడ రాకపోవడం కొంత మేరకు ఇక్కడ కార్యకర్తల్లో అసంతృపి నెలకొందని, ప్రచారం కూడా మందకొడిగా సాగుతోంది. ఇలాంటి సమయంలో బిజద, కాంగ్రెస్ పార్టీల మధ్య ప్రధాన పోటీ ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. మరి రాయగడ పీఠం ఎవరికి దక్కుతుందో వేచి చూడాల్సిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సైకిల్పై వెళ్లి ఓటేసిన కేంద్ర మాజీ మంత్రి
[ 02-06-2024]
పంచాయతీ వార్డు సభ్యుడు కూడా హంగు, ఆర్భాటం ప్రదర్శిస్తున్న ఈ రోజుల్లో కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత ఎంపీ సైకిల్పై పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటేశారు. -
ముగిసిన పోలింగ్
[ 02-06-2024]
రాష్ట్రంలో చివరిదైన నాలుగో విడత పోలింగ్ ప్రశాంతంగా జరిగినట్లు శనివారం ప్రధాన ఎన్నికల అధికారి (ఎస్ఈసీ) నికుంజ బిహారీ ధొళో భువనేశ్వర్లో పేర్కొన్నా అక్కడక్కడా స్వల్ప ఘటనలు, కొట్లాటలు జరిగాయి. -
కొరాపుట్ సింహాసనం ఎవరికో?
[ 02-06-2024]
కొరాపుట్ లోక్సభ స్థానం ఫలితాలపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. కొరాపుట్, రాయగడ జిల్లాలకు చెందిన 7 నియోజకవర్గాలతో కూడిన లోక్సభ స్థానంలో 1957 నుంచి 18 సార్లు జరిగిన ఎన్నికల్లో 16 సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందడం విశేషం. -
రవుర్కెలాలో 18కి పెరిగిన మృతుల సంఖ్య
[ 02-06-2024]
రవుర్కెలా ఉక్కు నగరంలో వడదెబ్బ మృతుల సంఖ్య 18కి పెరిగింది. శనివారం చికిత్స పొందుతున్న బాధితుల్లో ఆరుగురు తుదిశ్వాస విడిచినట్లు రవుర్కెలా అదనపు కలెక్టరు (ఏడీఎం) అశుతోష్ కులకర్ణి విలేకరులకు చెప్పారు. -
‘పద్మశ్రీ’ మగుణి కన్నుమూత
[ 02-06-2024]
ప్రాచీనమైన తోలుబొమ్మలాటను విశ్వవ్యాప్తం చేసిన ప్రముఖ కళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత మగుణి చరణ్ కువర్ (88) శనివారం ఉదయం కేంఝర్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. -
కొంచెం తీరిక... పుస్తకాలతో తీరేను బడలిక
[ 02-06-2024]
పూర్వాశ్రమంలో రచయితగా గుర్తింపు పొందిన ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పర్యావరణవేత్త. ఆయన రచించిన పుస్తకాల్లో ‘ది గార్డ్న్ ఆఫ్ లైఫ్’ ఆంగ్ల రచన దేశవిదేశాల్లో పాఠకుల మన్ననందుకుంది. చెట్లు, కాండాలు, బెరళ్లు, లతలు, పుష్పాల్లో ఔషధీయ గుణాలున్నాయని అందులో వివరించారు. -
దోపిడీ ముఠా అరెస్ట్
[ 02-06-2024]
నవరంగపూర్లో జరిగిన చోరీ కేసులో పోలీసులు శనివారం ఓ ముఠాను అరెస్ట్ చేశారు. ఎస్పీ రోహిత్ వర్మా మీడియా సమావేశంలో తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 14వ తేదీన సదరు సమితి దంగరబేజి గ్రామంలో సునీల్ సాహు ఇంట్లో చోరీకి యత్నించి విఫలమయ్యారు. -
అధికారుల నిర్లక్ష్యం.. రోడ్డున పడ్డ కుటుంబం
[ 02-06-2024]
అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఓ కుటుంబం రోడ్డున పడ్డ ఘటన నవరంగపూర్ జిల్లాలో జరిగింది. బాధితుల కథనం మేరకు.. నందహండి సమితి జడబంద గూడ పంచాయతీ ముదులిగూడ గ్రామానికి చెందిన పద్మన్ బిశోయి ఆవాస్ యోజన ఇల్లు కోసం భార్య కనక పేరిట దరఖాస్తు చేసుకున్నారు. -
పోలింగ్ కేంద్రంలో తమలపాకుల అలంకరణ
[ 02-06-2024]
పూరీ జిల్లా కాకట్పూర్ మోడల్ పోలింగ్ కేంద్రాన్ని తమలపాకులతో అలంకరించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘మాపై దాడి చేయొద్దు’: రవీనా టాండన్ విజ్ఞప్తి.. వీడియో వైరల్
-
ఏపీలో 3 రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
దేశంలోనే సుదీర్ఘ కాలం సీఎం.. 39 ఏళ్లలో తొలి ఓటమి
-
స్టార్టప్లు నేర్పిన పాఠాలివే: గజల్ అలఘ్
-
అక్కడ జడేజా బ్యాటింగ్.. నేను నోరు మూసుకోవడం బెటర్: మంజ్రేకర్