తాగునీరు అందించనున్న తిరునిండ్రవూరు చెరువు
స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేయాలని డిమాండు చేస్తున్న ఆవడి వాసులకు జలమండలి విభాగం శుభవార్త చెప్పింది. తిరునిండ్రవూరు చెరువు నీటిని తాగునీరుగా శుద్ధి చేసి ఆవడి కార్పొరేషన్, చెన్నైకి పంపిణీ చేయడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.
ప్రభుత్వానికి జలమండలి ప్రతిపాదనలు
న్యూస్టుడే, వడపళని: స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేయాలని డిమాండు చేస్తున్న ఆవడి వాసులకు జలమండలి విభాగం శుభవార్త చెప్పింది. తిరునిండ్రవూరు చెరువు నీటిని తాగునీరుగా శుద్ధి చేసి ఆవడి కార్పొరేషన్, చెన్నైకి పంపిణీ చేయడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.
రూ.100 కోట్లతో నివేదిక
తిరునిండ్రవూరు చెరువు 349 హెక్టార్లలో చెన్నై నగరానికి పశ్చిమంగా ఉంది. మురుగు నీరు, ఆక్రమణలతో కుచించుకుపోయింది. దీనికితోడు ఏళ్ల తరబడి పూడికతీత పనులు కూడా జరగలేదు. గతంలో తాగునీటి అవసరాలకు పోరూరు, రెట్టేరి, నెమం, అయనంబాక్కం చెరువులను వినియోగించుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో వరద నీటిని నియంత్రించి, తిరునిండ్రవూరు చెరువులో సమృద్ధిగా నీటిని నిల్వ చేసేందుకు రూ.100 కోట్లతో సమగ్ర నివేదికను జలమండలి విభాగం ప్రభుత్వ ఆర్థిక విభాగానికి పరిశీలనార్థం పంపింది.
500 ఎంసీఎఫ్టీలకు పెంచే యోచన
ఈ చెరువులో నీటి సామర్థ్యాన్ని 150 నుంచి 500 మిలియన్ క్యూబిక్ అడుగుల వరకు పెంచుకునే వీలుందని జలమండలి విభాగ అధికారులు పేర్కొన్నారు. చెరువులో 1.50 మీటర్ల వరకు చెత్తాచెదారాలు పేరుకుపోయాయని, మురుగు శుభ్రం చేసి ఆక్రమణలు తొలగించాలనే ప్రణాళికలు కూడా ఉన్నాయని చెప్పారు. చేపట్టనున్న ప్రాజెక్టుతో ఆదాయం కూడా సమకూరనుంది. చెరువు నుంచి 30 లక్షల క్యూబిక్ మీటర్ల కోర్స్ సాయిల్ (సవుడు)ను తొలగించి దాని ద్వారా రూ.36 కోట్ల మేరకు ఆదాయాన్ని గడించే వీలుంది. వరదలు సంభవించినప్పుడు పెరియార్ నగర్, ముత్తమిళ్ నగర్, తిరునిండ్రవూరు పరిసరాల్లో లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్న వారి పరిస్థితి దయనీయంగా ఉంది. ‘తమిళనాడు అర్బన్ హ్యాబిటెట్ డెవలప్మెంట్ బోర్డ్’ (టీఎన్యూహెచ్డీబీ) చెరువుకు సమీపంలోని మత్తమిళ్ నగర్, కన్నికాపురం, పెరియార్ నగర్ ప్రాంతాల్లో ఇళ్లను ఏర్పాటు చేసిందని, చెరువులో నీరు నిండినప్పుడు ఈ ప్రాంతాలన్నీ నీటమునిగి ఉంటాయని అధికారులు గమనించారు. 4.8 కి.మీ వరకు చెరువును, తీరం వద్ద బలోపేతం చేసి, నీటిని నియంత్రించేందుకు షట్టర్లు కూడా ఏర్పాటు చేయాలని కూడా జలమండలి విభాగం ప్రభుత్వానికి ప్రతిపాదించింది.
శాశ్వత వనరుగా...
ప్రస్తుతం ఆవడి మున్సిపల్ కార్పొరేషన్కు చెన్నై మెట్రో వాటర్ నుంచి అధిక మొత్తంలో తాగునీరు సరఫరా అవుతోంది. తిరునిండ్రవూరు చెరువును శాశ్వతంగా తాగునీటి సరఫరాకు అనుగుణంగా తీర్చిదిద్దితే ఆవడి, పరిసర ప్రాంతవాసులకు ఉపయోగకరంగా ఉండగలదు. పూండి జలాశయంలో అధికంగా చేరుకునే నీటిని పూండి - చెంబరంబాక్కం లింకు కాలువ ద్వారా తిరునిండ్రవూరు చెరువుకు తరలించాలనే ప్రణాళికలు కూడా ఉన్నాయి. దీంతో చెరువులో నీటి నిల్వ కూడా పెరుగుతుందని, కొంత నీటిని చెన్నైకి కూడా సరఫరా చేసే వీలుంటుందని ఓ అధికారి పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జయలలిత సిద్ధాంతాలపై జగడం.. తమిళనాట రాజకీయాల్లో తీవ్ర చర్చ
[ 02-06-2024]
జయలలిత హిందుత్వవాది అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయవర్గాల్లో పెనుదుమారం రేపుతున్నాయి. అన్నామలై ఇటీవల విలేకర్లతో మాట్లాడుతూ.. -
కాషాయ వస్త్రాలతో సూర్యారాధన
[ 02-06-2024]
కన్నియాకుమరిలోని వివేకానంద స్మారక మండపంలో ప్రధాని మోదీ ధ్యానం ముగిసింది. శనివారం ఉదయం 5.50కు కాషాయ వస్త్రాలతో బయటకొచ్చిన ప్రధాని సూర్యారాధన చేశారు. -
త్వరలో పిత్తల మాత్తి విడుదల
[ 02-06-2024]
మాణిక్క విద్య దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పిత్తల మాత్తి’. ఇందులో ఉమాపతి రామయ్య, సంస్కృతి, బాల శరవణన్, తంబి రామయ్య, దేవదర్శిని, విద్యుల్లేఖ రామన్, ‘ఆడుకళం’ నరేన్, ‘కాదల్’ సుకుమార్ తదితరులు నటించారు. -
‘కలైజ్ఞర్ 100’ ప్రదర్శన ప్రారంభం
[ 02-06-2024]
దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి శతజయంతి ముగింపు వేడుకలు సందర్భంగా ప్యారిస్ కార్నర్లోని రాజా అన్నామలై హాలులో ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను నటుడు ప్రకాశ్రాజ్ శనివారం ప్రారంభించారు. -
షరతులతో పర్యాటకులకు అనుమతి
[ 02-06-2024]
ప్రధాని మోదీ ధ్యానం సందర్భంగా గురువారం కన్నియాకుమరి వివేకానంద స్మారక మండపానికి పర్యాటకులను అనుమతించలేదు. శుక్రవారం అనుమతించారు. లగేజీ, సెల్ఫోన్లు తదితరాలను తీసుకెళ్లనివ్వలేదు. -
భాజపా రికార్డు సృష్టిస్తుంది
[ 02-06-2024]
లోక్సభ ఎన్నికల్లో భాజపా రికార్డు సృష్టించి ప్రధాని మోదీ మూడోసారి ప్రధాని అవుతారని కేంద్ర సహాయ మంత్రి ఎల్.మురుగన్ ధీమా వ్యక్తం చేశారు. -
చెన్నైలో తల్లిపాల విక్రయంపై నిఘా
[ 02-06-2024]
చెన్నైలో తల్లిపాల విక్రయాలపై నిఘా పెట్టేందుకు 18 బృందాలు ఏర్పాటు చేసినట్లు ఆహారభద్రతాశాఖ అధికారులు తెలిపారు. చెన్నై మాధవరం ప్రాంతంలో చట్టవిరుద్ధంగా తల్లిపాలు సీసాల్లో పెట్టి విక్రయిస్తున్న ప్రైవేట్ మందుల దుకాణానికి
తాజా వార్తలు (Latest News)
-
మరోసారి టైం వేస్టు చేసుకోవద్దు: ఎగ్జిట్ పోల్స్ తర్వాత ప్రశాంత్ కిషోర్ స్పందన
-
కౌంటింగ్ నిబంధనలపై కాంగ్రెస్ అభ్యంతరాలు.. స్పష్టతనిచ్చిన ఈసీ
-
తెలంగాణ ప్రజలు బానిసత్వాన్ని భరించరు: ఆవిర్భావ వేడుకల్లో సీఎం రేవంత్
-
ఆధునిక భారతం కళ్లారా చూసిన మరో స్వాతంత్ర్య పోరాటమది: కేటీఆర్
-
సీఎం రేవంత్ నేతృత్వంలో గ్యారంటీలను అమలు చేస్తాం: సోనియాగాంధీ
-
డ్రాగన్ ఘనత.. జాబిల్లి ఆవలివైపు ల్యాండ్ అయిన చాంగే-6..!