పోస్టల్ బ్యాలెట్ ఓటు.. తిరస్కరణకు తావివ్వొద్దు
ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగులు, సిబ్బంది, సైనికులు, ఇతర అత్యవసర సేవలకు చెందిన వారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ముందస్తుగా ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో చెల్లనివి 1445..
భూపాలపల్లిలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేసేందుకు వరుసలో నిల్చొన్న ఉద్యోగులు
ఈనాడు డిజిటల్, జయశంకర్ భూపాలపల్లి: ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగులు, సిబ్బంది, సైనికులు, ఇతర అత్యవసర సేవలకు చెందిన వారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ముందస్తుగా ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు. ఈ ఓటు వేసే క్రమంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల తిరస్కరణకు గురవుతున్నాయి.
అధికారుల చర్యలు..
గత అసెంబ్లీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ల దరఖాస్తు పత్రాలను నేరుగా సేకరించి జిల్లాలకు పంపించారు. దీంతో ఉద్యోగులు, వివిధ సర్వీసుల వారు ఇక్కట్లు ఎదుర్కొన్నారు. ఈసారి ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ కోసం అప్లికేషన్ను అందుబాటులోకి తెచ్చింది. సిబ్బంది ఫారం 12 పత్రాలను సేకరించి ఎపిక్ కార్డుతో సహా వివరాలను వైబ్సైట్లో పొందుపర్చారు. సదరు ఉద్యోగి ఎక్కడ ఓటు వేయడానికి ఎంపిక చేసుకున్నారో ఆ డేటా అంతా ఆన్లైన్లో కనిపించేలా ఏర్పాట్లు చేశారు.
ఓటు వేసేటప్పుడు పొరపాట్లు జరగకుండా సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నారు. డిక్లరేషన్ సమయంలో ఇబ్బందులు కలగకుండా గెజిటెడ్ అధికారులను అందుబాటులో ఉంచుతున్నారు. ఈనెల 8 వరకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ జరగనుంది.
నర్సంపేటలో అత్యధికం..
గత అసెంబ్లీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 1445 తిరస్కరణకు గురయ్యాయి. నర్సంపేట నియోజకవర్గంలో అత్యధికంగా 278 ఉన్నాయి. సరిగా ఓటు వేయకపోవడం, సంతకాలు చేయకపోవడం, తదితర కారణాలతో ఇవి చెల్లకుండా పోయాయి.
ఒకరికే టిక్ చేయాలి..
పోస్టల్ బ్యాలెట్ వేసేవారికి ఫారం 12 ఇస్తారు. ఇందులో 13ఎ, 13బి, 13సి, 13డి కవర్లు ఉంటాయి. 13ఎ కవర్లో డిక్లరేషన్ ఫారంపై తప్పకుండా సంతకం చేయాలి. బ్యాలెట్ నెంబరు, సీరియల్ నెంబరు వేయాలి. 13బి కవర్లో బ్యాలెట్ పేపర్ ఉంటుంది. అభ్యర్థుల పేర్లు, పార్టీల పేర్లు మాత్రమే ఉంటాయి. వాటి ఎదురుగా పెన్నుతో రైట్ గుర్తు పెట్టాలి. ఒకరి ఎదురుగా మాత్రమే టిక్ పెట్టాలి. ఒకరి కంటే ఎక్కువ మందికి టిక్ చేస్తే తిరస్కరణకు గురవుతుంది. ఏ అభ్యర్థికి లేదా నోటాకు టిక్ పెట్టకున్నా తిరస్కరిస్తారు.
- పూర్తిచేసిన 13ఎ, 13బి కవర్లను 13సి కవర్లో పెట్టాలి. పోలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన పెట్టెలో వేయాలి లేదా సంబంధిత అధికారులకు తపాలా ద్వారా పంపించాలి. 13డి కవర్లో సూచనలు ఉంటాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూపాయి గొడవ.. ప్రాణం తీసింది
[ 02-06-2024]
కేవలం ఒక్క రూపాయి విషయంలో జరిగిన గొడవలో ఓ నిండు ప్రాణం పోయింది. ఈ ఘటన వరంగల్ లేబర్కాలనీలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. -
పదేళ్ల ప్రస్థానం.. ప్రగతికి దిశానిర్దేశం
[ 02-06-2024]
ఎందరో అమరవీరుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు పదేళ్ల వయసున్న చిన్న పాప లాంటిది. రాబోయే పదేళ్లకల్లా తెలంగాణ నవ యవ్వనంగా మరింత ఉత్సాహంతో ముందుకు సాగాలి. స్వరాష్ట్రం సాకారమై దశాబ్దం పూర్తి చేసుకున్న ఈ సంతోష క్షణాల్లో ‘విజన్ ఓరుగల్లు- 2034’కు ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. -
రాష్ట్రావతరణ వేడుకలకు ముస్తాబు
[ 02-06-2024]
తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఖిలా వరంగల్లోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద ఆదివారం ఉదయం 8.15 గంటలకు కలెక్టర్ ప్రావీణ్య అమరవీరులకు నివాళులర్పించనున్నారు. -
310 కిలోల నకిలీ పత్తి విత్తనాల పట్టివేత
[ 02-06-2024]
నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తున్న వ్యక్తిని పట్టుకొని, సుమారు 310 కిలోల విత్తనాలు, నిషేధిత గడ్డి నివారణ మందును వరంగల్ టాస్క్ఫోర్స్ సిబ్బంది, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ముస్తాబు
[ 02-06-2024]
జిల్లాలో ఆదివారం రాష్ట్ర ఆవిర్భావ వేడుకల నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. కలెక్టరేట్, జడ్పీ కార్యాలయం, పబ్లిక్ గార్డెన్లోని టౌన్హాల్, పోలీసు కమిషనరేట్తో పాటు మండల కేంద్రాల్లోనూ కార్యాలయాలను విద్యుత్తు దీపాలతో అలంకరించారు. -
ఆవిర్భావ వేడుకలకు ముస్తాబు
[ 02-06-2024]
రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకొని ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్తు దీపాలతో అలంకరించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా సంబంధిత అధికారులను ఆదేశించారు. -
ఆవిర్భావ వేడుకలకు వేళాయే..
[ 02-06-2024]
తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం కలెక్టరేట్లో అన్ని శాఖల ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. కలెక్టర్ భవేశ్ మిశ్రా చేతులమీదుగా జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు. -
ముస్తాబైన కలెక్టరేట్
[ 02-06-2024]
జూన్ 2న నిర్వహించనున్న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు జిల్లా కలెక్టరేట్ ముస్తాబైంది. జాతీయ జెండాను పోలిన మూడు రంగుల పరదాలతో భవనాన్ని అలంకరించారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. -
పల్లెకు దూరంగా ఆర్టీసీ సేవలు
[ 02-06-2024]
రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అందుబాటులోకి తీసుకురావడంతో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో ప్రయాణికులకు అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచకపోవడంతో పలు చోట్ల ఇబ్బందులు తప్పడం లేదు. చాలా గ్రామాల్లో బస్సులు ఆగకుండానే వెళుతున్నాయి. -
రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సిద్ధం
[ 02-06-2024]
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధం చేశారు. ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వంలో తొలిసారి వేడుకలు జరుగుతున్నాయి. -
భూమి చదును చేస్తుండగా అడ్డుకున్నారని రైతు ఆత్మహత్యాయత్నం
[ 02-06-2024]
తన పట్టా భూమిని చదును చేసుకుంటుంటే అటవీశాఖ అధికారులు అడ్డుకున్నారని ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి పంచాయతీ పరిధి పెద్దవెంకటాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
మంత్రి కోమటిరెడ్డి ఆరోపణలు రుజువు చేస్తే.. ముక్కు నేలకు రాస్తా: హరీశ్రావు
-
‘మాపై దాడి చేయొద్దు’: రవీనా టాండన్ విజ్ఞప్తి.. వీడియో వైరల్
-
ఏపీలో 3 రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
దేశంలోనే సుదీర్ఘ కాలం సీఎం.. 39 ఏళ్లలో తొలి ఓటమి
-
స్టార్టప్లు నేర్పిన పాఠాలివే: గజల్ అలఘ్