Bandi Sanjay: తెలంగాణలో ఎంతమందికి రెండు పడక గదుల ఇళ్లు వచ్చాయ్?: బండి సంజయ్
దేశవ్యాప్తంగా మోదీ 3 కోట్ల ఇళ్లు నిర్మించారని భాజపా (BJP) జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ చెప్పారు.
ఎలబోతారం: దేశవ్యాప్తంగా మోదీ 3 కోట్ల ఇళ్లు నిర్మించారని భాజపా (BJP) జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ చెప్పారు. కరీంనగర్ జిల్లాలోని ఎలబోతారంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. రాష్ట్రంలో ఎంత మందికి రెండు పడక గదుల ఇళ్లు వచ్చాయని ప్రశ్నించారు.‘‘పదేళ్లలో కేసీఆర్ ఎవరికైనా రేషన్కార్డులు ఇచ్చారా? రేషన్ కార్డులు ఇవ్వని భారాస, మంత్రి గంగుల కమలాకర్కు ఎందుకు ఓటు వేయాలి. కేసీఆర్ రూ.5 వేలు రైతుబంధు ఇచ్చి రూ.10 వేలు లాక్కుంటున్నారు’’ అని బండి సంజయ్ విమర్శించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.