icon icon icon
icon icon icon

Chandrababu: జగన్‌ ప్యాలెస్‌ కొల్లగొడితే పేదల పొట్ట నిండుతుంది: చంద్రబాబు

జగన్‌ ప్యాలెస్‌ కొల్లగొడితే పేదల పొట్ట నిండుతుందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గ పరిధిలోని కౌతాళంలో నిర్వహించిన ‘ప్రజాగళం’ సభలో ఆయన ప్రసంగించారు.

Updated : 28 Apr 2024 19:23 IST

మంత్రాలయం: జగన్‌ ప్యాలెస్‌ కొల్లగొడితే పేదల పొట్ట నిండుతుందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గ పరిధిలోని కౌతాళంలో నిర్వహించిన ‘ప్రజాగళం’ సభలో ఆయన ప్రసంగించారు. సామాజిక సమీకరణల ప్రకారం కర్నూలు జిల్లాలో టికెట్లు ఇచ్చామన్నారు. వైకాపాను చిత్తు చిత్తుగా ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాయలసీమలో 102 ప్రాజెక్టులను రద్దు చేసిన దుర్మార్గుడు సీఎం జగన్‌ అని చంద్రబాబు విమర్శించారు. ఆర్డీఎస్‌ ద్వారా ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదని మండిపడ్డారు.

‘‘ బడుగు జీవుల రక్తం తాగే వ్యక్తులు బాలనాగిరెడ్డి, సాయిప్రతాప్‌రెడ్డి. సీఎం జగన్‌ చెప్పేవన్నీ అబద్ధాలు.. చేసేవన్నీ మోసాలే. ఉద్యోగాలు ఇవ్వకుండా జే బ్రాండ్‌ మద్యం, గంజాయి ఇచ్చారు. తాగునీరు ఎక్కడ ఉంటే అక్కడి ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు. పక్కనే తుంగభద్ర నది ఉన్నా.. ఈ ప్రాంత ప్రజలకు తాగడానికి నీళ్లు లేవు. జగన్‌ను నమ్మి రాయలసీమ ప్రజలు మోసపోయారు. ఎన్డీయే కూటమి వల్లే మంత్రాలయం అభివృద్ధి చెందుతుంది’’ అని చంద్రబాబు భరోసా ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img